చతుర్వేదాలు
- 1 సామవేదం శాఖలు
- 2 ఇవి కూడా చూడండి
- 3 మూలాలు
- 4 వనరులు, ఉపయోగకరమైన గ్రంధాలు, బయటి లింకులు
చతుర్వేదాలలో ఒకటి సామవేదము (సంస్కృతం: सामवेद). సామం
అనగా మధురమైనది. వేదం అనగా జ్ఞానం అని అర్థం. అంటే ఇది యాగాలలో దేవతల
గొప్పతనాన్ని మధురంగా కీర్తించేది. నాలుగు వేదాల క్రమంలో మూడవది. దీనిని వేదవ్యాసుడు జైమిని మహర్షికి బోధించాడు. దీనిలో మొట్టమొదటి భాగాలు క్రీ.పూ 1000
వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు. ప్రాముఖ్యతలో, పవిత్రతలో, సాహిత్య
విలువల్లో ఋగ్వేదం తర్వాత రెండవ స్థానంలో ఉంటుంది.
వేదాలలో మూడు విధాలైన మంత్రాలున్నాయి - ఋక్కులు,
యజుస్సులు, సామములు. ప్రత్యేమైన ఛందస్సులో ఉన్న పద్య శ్లోకం ఋక్. వచన రూపంలో
(ఛందస్సు లేకుండా) ఉన్నను యజుస్సులు. గానానికి అనుగుణమైన పద్యశ్లోకం సామము. ఒకే
శ్లోకం ఋక్కుగాను లేదా సాముగాను వివిధ సందర్భాలలో ప్రస్తావింపబడవచ్చును.
ఋగ్వేదంలో అధ్యయన బద్ధమైన ఋక్కులున్నాయి. యజ్ఞాలలో ఉచ్ఛరింపబడే మంత్రాలు
యజుర్వేదంలో ఉన్నాయి. ఇవి కొన్ని యజుర్మంత్రాలు మరియు కొన్న ఋగ్వేదమంత్రాలు.
సామవేదంలో సామములున్నాయి. అధర్వణ వేదంలో ప్రధానంగా ఋక్కులు, కొన్ని యజుస్సులు
ఉన్నాయి.[1]
1895లో రాల్ఫ్ గ్రిఫిత్ ప్రచురించిన సామవేదం ఆంగ్లానువాదం పీఠికలో ఇలా
వ్రాశాడు [2] వేదాల క్రమంలో మూడవదిగా చెప్పబడే
"సామవేదం" లేదా "పవిత్ర గానాల వేదం" ఋగ్వేదం తరువాతి
ముఖ్యస్థానాన్ని కలిగి ఉంది. ఇందులో ముఖ్యాంశం యజ్ఞాలలో ఉద్గాత గానం చేసే స్తోత్రాలు. ఋగ్వేదం లోని వివిధ స్తోత్రాలను, శ్లోకాలను ఇందులో తిరిగి
అమర్చినట్లుగా అనిపిస్తున్నది. ఈ అమరిక క్రమానికి మూల ఋగ్వేదంలోని క్రమంతో సంబంధం
లేదు. యజ్ఞయాగాది కార్యాలలో ఉపయోగపడేందుకు వీలుగా వినియోగం బట్టి ఇలా
అమర్చినట్లున్నారు. ఇలా పునర్వవస్థీకరించిన సామములు కొన్ని (ప్రస్తుతం మనకు
లభిస్తున్న) మూల ఋగ్వేదంలోని శ్లోకాలకు యధాతధం కాగా మరి కొన్ని సామములు గణనీయంగా
మార్పు చెందినట్లున్నాయి. మరి కొన్ని సామములు ప్రస్తుతం లభించే ఋగ్వేద పాఠం కంటే
పురాతనమైనవిగా అనిపిస్తాయి. గానం చేసేటప్పుడు ఈ శ్లోకాలను ఉచ్ఛారణాపరంగా
ప్రత్యేకమైన విధానంలో గానం చేయాలి. Two
of these manuals, the Gramageyagdna, or Congregational, and the Aranyagana or
Forest Song-Book, follow the order of the verses of part I, of the Sanhita,
and two others, the Uhagana, the Uhyagana, of Part II. This part is less
disjointed than part I, and is generally arranged in triplets whose first
verse is often the repetition of a verse that has occurred in part I. సామవేద గానాలను ఎప్పుడు సంకలనం చేశారో ఊహించడం
సాధ్యం కావడంలేదు. అలాగే సంకలనకర్త పేరు కూడా మౌఖిక సంప్రదాయ పరంగా లభించడం లేదు.
సామవేదంలో 1875 మంత్రాలు ఉన్నాయి. ఒక్కొక్కదానికి ప్రత్యేకమైన
ఛందస్సు ఉంది. సామవేదంలోని 1875 మంత్రాలలో చాలావరకు ఋగ్వేద సంహితలో ఉన్న 10,552
మంత్రాలలోనుండి యధాతధంగా తీసుకొనబడ్డాయి. ఈ సారూప్యం పాఠానికి మాత్రమే
వర్తిస్తుంది. ఉచ్ఛారణా విధానం మాత్రం సామవేదంలో వేరుగా ఉంటుంది. భగవద్గీత 10-22
లో "వేదములలో నేను సామమును" అని కృష్ణుడు చెప్పడాన్ని బట్టి
సామవేదానికి ఉన్న ప్రాముఖ్యతను ఊహించవచ్చును.
విషయ సూచిక
సామవేద సంహితకు మూడు శాఖలున్నాయి. వాటిలో కౌతుమీయ
శాఖ గుజరాత్లో ప్రాచుర్యంలో ఉన్నది. జైమినీయ శాఖ కర్ణాటక ప్రాంతంలోను, రాహయణీయ
శాఖ మహారాష్ట్ర ప్రాంతంలోను ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిలో కౌతుమీయ, రాహయనీయ
శాఖలలో మంత్రాలు, ఉచ్ఛారణావిధానం ఒకటే కాని మంత్రాల క్రమంలో తేడా ఉంది. జైమినీయ
శాఖలో 1693 మంత్రాలు మాత్రమే ఉన్నాయి. కాని ఇందులో ఎక్కువ గానాలు (3681) ఉన్నాయి.
సామవేదం ఒక్కొక్క అధ్యాయంలోను ఋగ్వేదంలోని ఒక్కొక్క మండలంనుండి మంత్రాలు
గ్రహించబడ్డాయి. ఒక్కొక్క అధ్యాయం ఒకో దేవత గురించి ఒకో ఛందస్సులో కీర్తిస్తుంది.
ఉదాహరణకు సామవేదం మొదటి అధ్యాయంలో 11 మంత్రాలున్నాయి. వీటిలో 10 మంత్రాలు
ఋగ్వేదంలోనివే. 11వ సామవేద మంత్రం మాత్రం ఋగ్వేదంలో కనిపించదు. ఋగ్వేదంలో
పేర్కొన్న దేవతల పేర్లే సామవేదంలో పేర్కొనబడ్డాయి. కాని "పవమాన సోముడు"
గురించిన స్తోత్రాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. [1]
- 1 పురాణాలలో జ్యోతిష్యం
- 2 జానపదుల జోస్యం
- 2.1 ప్రశ్నా శాస్త్రం
- 3 సాయన, నిరయణ సిద్ధాంతాలు
- 4 గోచారము
- 5 రాశులు నక్షత్ర పాదాలు
- 6 నక్షత్రాలు అధిదేతలు వర్ణం రతం
- 7 గోచార ఫలదర్శన చక్రం
- 8 మహర్ధశ అంతర్ధశ
- 9 గ్రహాలు శత్రువులు మిత్రులు సములు
- 9.1 కొన్ని వివరాలు
- 10 జన్మలగ్నము
- 11 ఛాయాగ్రహాలు
- 11.1 గ్రహస్థితి బలాబలాలు
- 11.2 గ్రహావస్థలు
- 12 విమర్శలు
- 13 సమాధానాలు
- శ్రీనివాసుడు పద్మావతిని చేపట్టడానికి సోది చెప్పే స్త్రీ రూపంలో వచ్చి తన ప్రణయ వృత్తాంతాన్ని ఆకాశరాజు దంపతులకు తెలిపి వారిలో తమ వివాహం పట్ల సుముఖత కలిగించి పద్మావతిని పరిణయమాడటంలో విజయం సాధించనట్లు పురాణ కథనాలు చెప్తున్నాయి.
- కంసుడికి మేనల్లుడి రూపంలో మరణం పొంచివున్నట్లు ఆకాశవాణి ముందుగానే వినిపించింది.
- శిశుపాలుని మరణం కృష్ణుని ద్వారా సంభవించనున్నదని పెద్దలు చెప్పినట్లు అందువలన శిశుపాలుని తల్లి కృష్ణుని నుండి నూరు తప్పుల వరకు సహించేలా వరం పొందినట్లు భారతంలో వర్ణించబడింది. ఆ తరువాత నూరు తప్పులు చేసి శిశుపాలుడు కృష్ణుని చేతిలో మరణించడం లోక విదితం.
- త్రిజటా స్వప్నవృత్తాంతము శ్రీ రాముడు రావణుని వధించి సీతమ్మను విడిపించినట్లు త్రిజట ద్వారా వాల్మీకి పలికించడం స్వప్న ఆధారిత జ్యోస్యం వాడుకలో ఉన్నదని చెప్పడానికి నిదర్శనం.
- చిలుక జోస్యం, పుల్లల జోస్యం, రాగుల జోస్యం, చిప్పకట్టె జోస్యం, అంజన పసరు జోస్యం, చెంబు జోస్యం మొదలైనవి జానపదుల జోస్యాలు.
- బాలసంతు వారు శైవులు.తెల్లవారు ఝామున గంట వాయిస్తూ ఇంటింటికి వచ్చి ఇంటి యజమాని విన్నా వినకపోయినా జోస్యం చెప్పి వెళతారు.
- ప్రశ్నచెప్పే జ్యోతిష పండితుడు శుభ్రమైన వస్త్రధారణ చేసి ఉండాలి. శ్వేతవస్త్రధారణ మరింత శ్రేష్టం.
- ప్రశ్నచెప్పే జ్యోతిష పండితుడు మంచి మనసు కలవాడై ఉండాలి.
- ప్రశ్నచెప్పే జ్యోతిష పండితుడు శుభసమయంలో సమాధానం చెప్పాలి.
- చెప్పే జ్యోతిష పండితుడు తలంటుకున్న సమయంలో, దుఃఖితుడై ఉన్న సమయంలో, వికలమై మనస్సు కల్లోలితమైన సమయంలో, తల విరబోసుకున్న సమయంలో, భీమి మీద నిలబడి ఉన్న సమయంలో సమాధానం చెప్పకూడదు. అలాంటి సమయంలో పండితుడిని ప్రశ్న అడగకూడదు. ఆ పరిస్థితిలో చెప్పే సమాధానం అశుభాన్ని కలిగిస్తుంది.
- ప్రశ్న అడిగే ప్రదేశం పట్టి ఫలితాలు ఉంటాయి. పూలున్న ప్రదేశం, వృక్షములు ఉన్న ప్రదేశం, పచ్చిక మైదానాలు, నదీతీరాలు, సరస్సు తీరాలు, చక్కగా లక్ష్మీకళుట్టిపడుతున్న భవనాలలో చెప్పే సమాధానం
- ప్రశ్న అడుగు పృచ్ఛకుడు శ్మశానం, కబేళా (మాంసవిక్రయ శాల), కారాగారం, నడి రోడ్డు, బురదగల ప్రదేశం, పాడుబడిన కట్టడాలు, పాడుబడిన గృహములు, ఎలుకలు కలుగులు, పాము కన్నాలు, పురుగులు ఉన్నప్రదేశంలో అడిగిన అశుభఫలితాలు కలుగుతాయి.
- దండహస్తులు (చేత కర్రలు పట్టుకున్న వాళ్ళు), కాషాయ వస్త్ర ధారులు, తల అంటుకున్న వాళ్ళు, జాతి భ్రష్టులు, నపుంసకులు, స్త్రీలు, సంకెళ్ళు తాళ్ళు పట్టుకున్న వాళ్ళు, తాడి పండ్లు చేత పట్టున్న వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఫలితం భయంకరం ఫలితాలను ఇస్తుంది.
- సంధ్యా సమయం, మిట్ట మధ్యాహ్నం, మధ్యాహ్నానికి ముందు సమయం, రాత్రి వేళలు అడిగిన అశుభ ఫలితం ఇస్తుంది. ఉత్తర దిక్కు, ఈశాన్య మూల, తూర్పు దిక్కున నిలిచి అడిన శుభ ఫలితం ఇస్తుంది.
- దశ వర్గులు రాశి, హోర, ద్రేక్కాణ, సప్తమాంశ, నవాంశా, దశాంశ, షోడాంశ, త్రిశాంశ అన్న పది విధానాలు రాశిచక్ర నిర్మాణ విధములు.
- స్వస్థము: స్వక్షేత్ర మందున్న గ్రహము స్వప్నావస్తను పొందును.
- దీప్తము: ఉచ్ఛక్షేత్ర మందున్న గ్రహము దీప్తావస్త నందుండును.
- ముదితము: మిత్ర క్షేత్ర మందున్న గ్రహము ముదితావస్తను పొందును.
- శాంతము: సమ క్షేత్ర మందున్న గ్రహము శాంతావస్తను పొందును.
- శక్తము: వక్రించి యున్న గ్రహము శక్త్యావస్తను పొందును.
- పీడితము: రాశి అంతమున 9 సక్షత్ర పాదములలో చివరి పాదము నందున్న గ్రహము పీడావస్థను పొందును.
- దీనము: శత్రు క్షేత్ర మందున్న గ్రహము దీనావస్థను పొందును.
- వికలము: అస్తంగత మయిన గ్రహము వికలావస్థను పొందును.
- ఖల: నీచ యందున్న గ్రహము ఖలావస్థను పొందును.
- భీతము: అతిచారము యందున్న గ్రహము భీత్యావస్థను పొందును.
జ్యోతిష్యం లేదా జోస్యం , భవిష్యత్తును తెలుసుకొనుటకు ప్రపంచ
వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం. ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్రము. జీవి
జీవితంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేదీ జననకాల
గ్రహస్థితి ప్రకారము, శరీర
లక్షణాలు, అర చేతులు, మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకొని చెప్పబడుతుంది. ఆరు వేదాంగాలలో జ్యోతిషము ఒకటి. ఇప్పటికీ ఆదరణ పొందుతున్న ప్రాచీనశాస్త్రాలలో ఇది కూడా ఉంది. మొట్టమొదటిగా
జ్యోతిష్య శాస్త్రాన్ని గ్రంధరూపంలో వరాహమిహిరుడు అందించాడు. హిందూ
సాంప్రదాయాల మరియు
విశ్వాసాలలో జన్మ
సిద్దాంతం ఒకటి. జన్మసిద్దాంతం
ప్రకారము పూర్వ
జన్మపాపపుణ్యాల ప్రభావం ప్రస్తుత జన్మలో ఉంటుంది. దానికి
తగిన విధంగా, తగిన సమయంలోనే జీవి జననం ఈ జన్మలో జరుగుతుంది. అనగా అటువంటి గ్రహస్థితి లో జీవి జననం జరుగుతుంది. ఇది అంతా
దైవలీలగా హిందువులు భావిస్తారు. కావున ప్రతి జీవి భూత భవిష్యత్ వర్థమాన కాలములు జననకాల గ్రహస్థితి ప్రకారము
జరుగుతాయి. ఇది హిందువుల ప్రగాఢ విశ్వాసము.హస్తసాముద్రికము, గోచారము, నాడీ
జ్యోస్యము, న్యూమరాలజీ, ప్రశ్న చెప్పడం, సోది మొదలైన విధానాలుగాజ్యోస్యం చెప్పడం వాడుకలో ఉంది.
విషయ సూచిక
జ్యోతిష శాస్త్రంలో ప్రశ్నాశాస్త్రం ప్రాముఖ్యత సంతరించుకుంది.
ప్రశ్నా శాస్త్ర సంబంధిత విషయాలు శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణంలో లభ్యమవుతాయి.
కనుక ఈ శాస్త్రం ఆతి పురాతన కాలం నుండి ప్రాచుర్యం పొంది ఉంది. ప్రశ్నఅడగడం
అన్నది అప్పటి నుండి ఇప్పటి వరకు వాడుకలో ఉన్న విషయమే. అనేక రూపాలలో ప్రశ్నలకు
సమాధానం చెప్పేవాళ్ళున్నా జ్యోతిష శాస్త్ర పండితులు అతి జాగరూకతతో గణించి చెప్పే
సమాధానాలు విశ్వసించ దగినవి. ప్రశ్నా శాస్త్రానికి సమాధానం చెప్పాలంటే సాధారణంగా
జాతక చక్రాన్ని చూసి చెప్పే కంటే విశేష పాండిత్యం అవసరమౌతుంది. పురాణాలలో ప్రశ్నా
శాస్త్రాన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. పృచ్ఛకుడు ఎలా ఉండాలి, ఏ
సమయంలో ప్రశ్న అడగాలి. ఎలాంటి ప్రదేశంలో అడగాలి మొదలైన అనేక విషయాలు
ప్రస్తావించబడ్డాయి. అలాగే ప్రశ్నను చెప్పే పండితుడు ఎలా చెప్పాలి అనే విషయాలు
ప్రస్తావించబడ్డాయి. వాటిలో శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణంలో ప్రస్తావించబడిన
విషయాలు ఇక్కడ చూడవచ్చు.
శుభఫలితాలు ఇస్తాయి.
ప్రశ్నాశాస్త్రంలో 1నుండి249 మధ్య ఒక అంకెను పృచ్ఛకుడుని అదిగి ఆ
అంకెకు సంబంధించిన సబ్ ఆధారముగా ఫలమును చెప్పు విధానము ఉత్తమమైనది
రాశి చక్రానికి ప్రారంభ బిందువు ఎక్కడ అన్నదొక వివాదం. ప్రతీ సంవత్సరం సూర్యుడు భూమధ్య రేఖ పైకి వచ్చే బిందువుని వసంత విషువద్బిందువు (Vernal Equinox) అని అంటారు. అది సుమారుగా మార్చి
21వ తేదీన జరుగుతుంది. ఆరోజు భూమధ్య రేఖమీద పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. ఈ
బిందువే రాశి చక్రానికి ప్రారంభ బిందువు అని ఒక సాంప్రదాయం. ఇలా లెక్కపెట్టే
రాశిచక్రాన్ని సాయన రాశిచక్రం అంటారు. కానీ భూమి తనచుట్టూ తాను తిరగడమే కాక బొంగరంలా
ధృవాల దగ్గర అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. ఈ ఊగే చలనం ఫలితంగా ప్రతి ఏడాదీ సూర్యుడు
భూమధ్య రేఖ మీదకి వచ్చే బిందువు కొద్దిగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది (Precession of the Equinoxes).
దీని ఫలితంగా రాశిచక్రపు ప్రారంభ బిందువు కూడా
మారిపోతూ ప్రతీ డెబ్భైరెండు సంవత్సరాలకు ఒక డిగ్రీ చొప్పున వెనక్కి జరిగిపోతూ
ఉంటుంది. కాబట్టి సాయన రాశి చక్రం అంటే ప్రతీ ఏడాదీ ప్రారంభ బిందువు మారిపోయే
రాశిచక్రం (Tropical Zodiac). దీన్ని
ప్రధానంగా పాశ్చాత్య జ్యోతిషంలో ఉపయోగిస్తారు.
అయితే ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న భారతీయ జ్యోతిశ్శాస్త్రం ఇలా
మారిపోయే రాశిచక్రాన్ని పరిగణనలోకి తీసుకోదు. ఒకానొక స్థిరమైన బిందువునించి
రాశిచక్రాన్ని లెక్కిస్తుంది. ఆ రాశిచక్రాన్ని నిరయణ రాశి చక్రం అంటారు.
వసంతవిషువద్బిందువుకీ (అంటే పాశ్చాత్య రాశిచక్రపు ప్రారంభ బిందువుకీ) ఈ స్థిర
బిందువుకీ మధ్య ప్రస్తుతం సుమారు 23 డిగ్రీల తేడా ఉన్నది. దాన్నే అయనాంశ అంటారు.
అయితే ఈ స్థిరబిందువు ఎక్కడ ఉండాలి అన్నదానిపై కూడా జ్యోతిష్కులకి ఏకాభిప్రాయం
లేదు. భారతీయ జ్యోతిషంలో కూడా ఒక సంప్రదాయానికీ మరొక సంప్రదాయానికీ ఈ స్థిరబిందువు
కొద్దిగా మారుతుంది. అంటే అయనాంశ మారుతుంది. ఈ అయనాంశలో లాహిరి, రామన్, దేవదత్త,
కృష్ణమూర్తి మొదలైన రకాలు ఉన్నాయి.
గోచారము అంటే గోళాలు యొక్క సంచారం ఆధారంగా జోస్యం చెప్పడం.
చంద్రగోళం భూప్రదక్షణం చేసే సమయంలో ఒక్కొక్క రోజూ ఒక్కొక్క నక్షత్రం సమీపంలో
కనిపిస్తుంది. చంద్రుడు సమీపలోని నక్షత్రాన్ని జాతకుని జన్మ నక్షత్రం. ఈ
నక్షత్రాలను వాటి ప్రక్కన కనిపించే నక్షత్రాతో కలిపి ఒక ఊహా రేఖతో గుర్తించి
వాటిని రాసులుగా గుర్తించారు. దీని ఆధారంగా చంద్రుని సమీపంలో ఉన్న నక్షత్రరాసిని
జాతకుని రాశిగా వ్యవహరిస్తారు. సూర్యుడు ఒకరాశినుండి ఇకంకొక రాశి మారటానిని
సంక్రమణ లేక సంక్రాంతి అంటారు. సూర్యుడు జ్యోతిష్యశాస్త్రాన్ననుసరించి ఒక్కొక్క
మాసంలో ఒక్కొక్క రాసిలో ప్రవేసిస్తాడు. సంవత్సరాకాలంలో 12 రాసులలో సంచరిస్తాడు.
తమిళులు తమ సంవత్సరాన్ని సూర్య సంచారాన్ని అనుసరించి గణిస్తారు. సుర్యుడు మేషంలో
ప్రవేసించే రోజు వారికి నూతన సంవత్సర ఆరంభం అవుతుంది. సూరుడు మకరరాశిలో
ప్రవేసించినపుడు హిందువులు పెద్ద పండుగగా ఆచరించే సంక్రాంతి పండుగ పర్వదినం.
సంక్రాంతిని మకర సంక్రాంతి అనే పేరుతో కూడా పిలవడం హిందువుల అలవాటు. ఒక సంవత్సర
కాలంలో 12 సంక్రాంతులు వస్తాయి. ఈ విధంగా సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు,
గురువు, శుక్రుడు, శని మొదలైన గ్రహాలు ఛాయా గ్రహాలుగా జ్యోతిష్యశాస్త్రాలలో
పిలవబడే రాహువు, కేతువు యొక్క సంచారము జ్యోతిష్య గణనలో భాగాలు. ఇవి కాక తెలుగు,
మళయాళ జ్యోతిష్కులు శని గ్రహ ఊపగ్రహాలలో పెద్దదైన మాందిని శని పుత్రునిగా
వ్యహరిస్తూ గణనలోకి తీసుకుంటారు. తమిళ జ్యోతిష్యంలో మాంది గణనలోకి తీసుకొనే ఆచారం
లేదు. గ్రహాలు సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేసే కాలాన్ని 12 రోజులుగా విభజించి
జ్యోతిష్య గణన చేస్తారు. వీటి ఆధారంగా గోచార ఫలితాలు ఉంటాయి.
సాధారణంగా ఒక రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి.ఒక నక్షత్రానికి 4
పాదాలు ఉంటాయి.
|
రాశి
|
నక్షత్రపాదాలు
|
దినారంభంలో లగ్నం
|
|
అశ్విని 1,2,3,4 పాదాలు భరణి 1,2,3,4 పాదాలు కృత్తిక 1 పాదం
|
మేష సంక్రాంతి నుండి వృషభ సంక్రాంతి వరకు మేషలగ్నం
|
|
|
కృత్తిక 2,3,4 పాదాలు రోహిణి 1,2,3,4 పాదాలు మృగశిర 1,2 పాదాలు
|
వృషభ సంక్రాంతి నుండి మిధున సంక్రాంతి వరకు వృషభ లగ్నం
|
|
|
మృగశిర 3,4 పాదాలు ఆరుద్ర 1,2,3,4 పాదాలు పునర్వసు 1,2,3
|
మిధున సంక్రాంతి నుండి కటక సంక్రంతి వరకు మిధిన లగ్నం
|
|
|
పునర్వసు 4వ పాదం పుష్యమి 1,2,3,4 పాదాలు ఆశ్లేష 1,2,3,4 పాదాలు
|
కటక సంక్రాంతి నుండి సింహ సంక్రాంతి వరకు కటక లగ్నం
|
|
|
మఖ 1,2,3,4 పాదాలు పూర్వఫల్గుణి 1,2,3,4 పాదాలు ఉత్తర ఫల్గుణి 1
పాదం
|
సింహ సంక్రాంతి నుండి కన్యా సంక్రాంతి వరకు సింహ లగ్నం
|
|
|
ఉత్తర ఫల్గుణి 2,3,4 పాదాలు హస్త 1,2,3,4 పాదాలు చిత్త 1,2 పాదాలు
|
కన్యా సంక్రాంతి నుండి తులా సంక్రాంతి వరకు కన్యా లగ్నం
|
|
|
చిత్త 3,4 పాదాలు స్వాతి 1,2,3,4 పాదాలు విశాఖ 1,2,3 పాదాలు
|
తులా సంక్రాంతి నుండి వృశ్చిక సంక్రాంతి వరకు తులా లగ్నం
|
|
|
విశాఖ 4వ పాదం అనూరాధ 1,2,3,4 పాదాలు జ్యేష్ట 1,2,3,4 పాదాలు
|
వృశ్చిక సంక్రాంతి నుండి ధనస్సు సంక్రాంతి వరకు వృశ్చిక లగ్నం
|
|
|
మూల 1,2,3,4 పాదాలు పూర్వాషాఢ 1,2,3,4 పాదాలు ఉత్తరాషాఢ 1 పాదం
|
ధనస్సు సంక్రాంతి నుండి మకర సంక్రాంతి వరకు ధనుర్లగ్నం
|
|
|
ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు శ్రవణం 1,2,3,4 పాదాలు ధనిష్ట 1,2 పాదాలు
|
మకర సంక్రాంతి నుండి కుంభ సంక్రాంతి వరకు మకర లగ్నం
|
|
|
ధనిష్ట 3,4 పాదాలు శతభిష 1,2,3,4 పాదాలు పూర్వాభద్ర 1,2,3,పాదాలు
|
కుంభ సంక్రాంతి నుండి మీన సంక్రాంతి వరకు కుంభలగ్నం
|
|
|
పూర్వాభద్ర 4వ పాదం ఉత్తరాబాధ్ర 1,2,3,4 పాదాలు రేవతి 1,2,3,4
పాదాలు
|
మీన సంక్రాంతి నుండి మేష సంక్రాంతి వరకు మీన లగ్నం
|
జ్యోతిష శాస్త్రంలో నక్షత్రాలను మూడు గణాలుగా విభజిస్తారు. ఇరవై ఏడు
నక్షత్రాలలో అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి,అనూరాధ, శ్రవణం,
రేవతి అను తొమ్మిది నక్షత్రాలు దేవగణ నక్షత్రాలు. భరణి, రోహిణి, ఆరుద్ర, పుబ్బ
(పూర్వ ఫల్గుణి), ఉత్తర(ఉత్తర ఫల్గుణి), పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పూర్వబాధ్ర,
కృత్తిక, ఉత్తరాబాధ్ర అను తొమ్మిది నక్షత్రాలు మానవ గణ నక్షత్రాలు. ఆశ్లేష, మఖ,
చిత్త, విశాఖ, జ్యేష్ట, మూల, ధనిష్ట, శతభిషం(శతతార) అనే తొమ్మిది నక్షత్రాలు
రాక్షస గణ నక్షత్రాలు.
|
నక్షత్రం
|
అధిదేవత
|
వర్ణం
|
రత్నం
|
నామం
|
గణం
|
జంతువు
|
నాడి
|
దిక్కు
|
వృక్షం
|
గ్రహం
|
|
అర్ధనారీశ్వరుడు
|
పసుపు
|
వైడూర్యం
|
చూ,చే,చో,ల
|
దేవగణం
|
గుర్రం
|
ఆది
|
నైఋతి
|
అడ్డరస
|
కేతువు
|
|
|
రవి
|
ఆకాశనీలం
|
వజ్రం
|
లీ,లూ,లే,లో
|
మానవగణం
|
ఏనుగు
|
మధ్య
|
|
దేవదారు
|
శుక్రుడు
|
|
|
అగ్ని
|
కావి
|
మాణిక్యం
|
ఆ,ఈ,ఊ,ఏ
|
రాక్షసగణం
|
మేక
|
అంత్య
|
|
ఔదంబర
|
సూర్యుడు
|
|
|
చంద్రుడు
|
తెలుపు
|
ముత్యం
|
ఒ,వా,వృ,వో
|
మానవగణం
|
పాము
|
అంత్య
|
|
జంబు
|
చంద్రుడు
|
|
|
దుర్గ
|
ఎరుపు
|
పగడం
|
వే,వో,కా,కి
|
దేవగణం
|
పాము
|
మధ్య
|
|
చంఢ్ర
|
కుజుడు
|
|
|
కాళి
|
ఎరుపు
|
గోమేధికం
|
కూ,ఘ,బ,చ
|
మానవగణం
|
కుక్క
|
ఆది
|
|
రేల
|
రాహువు
|
|
|
రాముడు
|
పసుపు
|
పుష్పరాగం
|
కే,కో,హా,హీ
|
దేవగణం
|
పిల్లి
|
ఆది
|
|
వెదురు
|
గురువు
|
|
|
దక్షిణామూర్తి
|
పసుపు,ఎరుపు
|
నీలం
|
హూ,హే,హో,డా
|
దేవగణం
|
మేక
|
మధ్య
|
|
పిప్పిలి
|
శని
|
|
|
చక్రత్తాళ్వార్
|
కావి
|
మరకతం
|
డి,డూ,డె,డొ
|
రాక్షసగణం
|
పిల్లి
|
అంత్య
|
|
నాగకేసరి
|
బుధుడు
|
|
|
ఇంద్రుడు
|
లేతపచ్చ
|
వైడూర్యం
|
మా,మి,మూ,మే
|
రాక్షసగణం
|
ఎలుక
|
అంత్య
|
|
మర్రి
|
కేతువు
|
|
|
రుద్రుడు
|
శ్వేతపట్టు
|
పచ్చ
|
మో,టా,టి,టూ
|
మానవగణం
|
ఎలుక
|
మధ్య
|
|
మోదుగ
|
శుక్రుడు
|
|
|
బృహస్పతి
|
లేతపచ్చ
|
మాణిక్యం
|
టే,టో,పా,పీ
|
మానవగణం
|
గోవు
|
ఆది
|
|
జువ్వి
|
సూర్యుడు
|
|
|
అయ్యప్ప
|
ముదురునీలం
|
ముత్యం
|
పూ,ష,ణ,డ
|
దేవగణం
|
దున్న
|
ఆద
|
|
కుంకుడు
|
చంద్రుడు
|
|
|
విశ్వకర్మ
|
ఎరుపు
|
పగడం
|
పే,పో,రా,రీ
|
రాక్షసగణం
|
పులి
|
మధ్య
|
|
తాటి
|
కుజుడు
|
|
|
వాయువు
|
తెలుపు
|
గోమేధికం
|
రూ,రే,రో,త
|
దేవగణం
|
దున్న
|
అంత్య
|
|
మద్ది
|
రాహువు
|
|
|
మురుగన్
|
పచ్చ
|
పుష్పరాగం
|
తీ,తూ,తే,తో
|
రాక్షసగణం
|
పులి
|
అంత్య
|
|
నాగకేసరి
|
గురువు
|
|
|
మహాలక్ష్మి
|
పసుపు
|
నీలం
|
నా,నీ,నూ,నే
|
దేవగణం
|
లేడి
|
మధ్య
|
|
పొగడ
|
శని
|
|
|
ఇంద్రుడు
|
శ్వేతపట్టు
|
మరకతం
|
నో,యా,యీ,యూ
|
రాక్షసగణం
|
లేడి
|
ఆది
|
|
విష్టి
|
బుధుడు
|
|
|
నిరుతి
|
ముదురుపచ్చ
|
వైడూర్యం
|
యే,యో,బా,బీ
|
రాక్షసగణం
|
కుక్క
|
ఆది
|
|
వేగిస
|
కేతువు
|
|
|
వరుణుడు
|
బూడిద
|
వజ్రం
|
బూ,దా,థా,ఢా
|
మానవగణం
|
కోతి
|
మధ్య
|
|
నెమ్మి
|
శుక్రుడు
|
|
|
గణపతి
|
తెలుపు
|
మాణిక్యం
|
బే,బో,జా,జీ
|
మానవగణం
|
ముంగిస
|
అంత్య
|
|
పనస
|
రవి
|
|
|
మహావిష్ణు
|
కావి
|
ముత్తు
|
ఖీ,ఖూ,ఖే,ఖో
|
దేవగణం
|
కోతి
|
అంత్య
|
|
జిల్లేడు
|
చంద్రుడు
|
|
|
చిత్రగుప్తుడు
|
పసుపుపట్టు
|
పగడం
|
గా,గీ,గూ,గే
|
రాక్షసగణం
|
గుర్రం
|
మధ్య
|
|
జమ్మి
|
కుజుడు
|
|
|
భద్రకాళి
|
కాఫి
|
గోమేదికం
|
గో,సా,సీ,సూ
|
రాక్షసగణం
|
గుర్రం
|
ఆది
|
|
అరటి
|
రాహువు
|
|
|
కుబేరుడు
|
ముదురుపసుపు
|
పూస
|
సే,సో,దా,దీ
|
మానవగణం
|
సింహం
|
ఆది
|
|
మామిడి
|
గురువు
|
|
|
కామధేను
|
గులాబి
|
నల్లపూస
|
దు,శం,ఛా,దా
|
మానవగణం
|
గోవు
|
మధ్య
|
|
వేప
|
శని
|
|
|
అయ్యప్ప
|
ముదురునీలం
|
ముత్యం
|
దే,దో,చా,చీ
|
దేవగణం
|
ఏనుగు
|
అంత్య
|
|
విప్ప
|
బుధుడు
|
|
స్థానం
|
రవి
|
చంద్రుడు
|
కుజుడు
|
బుధుడు
|
గురువు
|
శుకృడు
|
శని
|
రాహువు
|
కేతువు
|
|
1
|
స్థానచలనం
|
సౌజన్యం
|
దు॰ఖం
|
బంధనం
|
గమనం
|
ఆరోగ్యం
|
విపత్తు
|
భయం
|
భయం
|
|
2
|
భయం
|
వ్యయం
|
వ్యయం
|
లాభం
|
ధనలాభం
|
భాగ్యం
|
హాని
|
కలహం
|
విరోధం
|
|
3
|
సంపత్తు
|
లాభం
|
లాభం
|
వ్యయం
|
విపత్తు
|
సౌభాగ్యం
|
సంపద
|
సౌఖ్యం
|
సుఖం
|
|
4
|
మానభంగం
|
హాని
|
రిపుభయం
|
శుభం
|
వ్యయం
|
సుఖం
|
రోగం
|
మానహాని
|
మానహాని
|
|
5
|
భయం
|
కార్యనాశం
|
రిపుభయం
|
సంపద
|
పుత్రలాభం
|
సుతక్షయం
|
ధనవ్యయం
|
క్లేశం
|
|
|
6
|
రిపుహాని
|
శుభం
|
ధనలాభం
|
భూషణం
|
దు॰ఖం
|
వ్యయం
|
సంపద
|
సుఖం
|
సంతోషం
|
|
7
|
దేహపీడ
|
లాభం
|
కలహం
|
వ్యసనం
|
ఆరోగ్యం
|
క్లేశం
|
రాజాగ్రహం
|
భయం
|
భీతి
|
|
8
|
రోగం
|
వ్యయం
|
భయం
|
సంతోషం
|
హాని
|
భయం
|
దు॰ఖం
|
మృత్యువు
|
హాని
|
|
9
|
భయం
|
వ్యాకులం
|
వ్యయం
|
దు॰ఖం
|
ధనాగమం
|
ధనలాభం
|
రోగం
|
సంతానం
|
కలహం
|
|
10
|
లాభం
|
లాభం
|
చలనం
|
శుభం
|
హాని
|
సౌఖ్యం
|
జాడ్యం
|
కలహం
|
విరోధం
|
|
11
|
ఆరోగ్యం
|
శుభం
|
లాభం
|
సుఖం
|
సంతోషం
|
సౌఖ్యం
|
లాభం
|
లాభం
|
ధనాగమం
|
|
12
|
వ్యయం
|
దు॰ఖం
|
రోగం
|
వ్యయం
|
పీడ
|
లాభం
|
క్లేశం
|
హాని
|
హాని
|
|
గ్రహం
|
రవి
సం-నె-రో
|
చంద్రుడు
సం-నె-రో
|
కుజుడు
సం-నె-రో
|
రాహువు
సం-నె-రో
|
గురువు
సం-నె-రో
|
శని
సం-నె-రో
|
బుధుడు
సం-నె-రో
|
కేతువు
సం-నె-రో
|
శుకృడు
సం-నె-రో
|
మహర్దశాకాలం
|
|
1.రవి
|
0-3-18
|
0-6-0
|
0-4-6
|
0-10-24
|
0-9-18
|
0-11-12
|
0-0-6
|
0-4-6
|
1-0-0
|
6 సంవత్సరాలు
|
|
2.చంద్రుడు
|
0-6-0
|
0-10-0
|
0-7-0
|
1-6-0
|
1-4-0
|
1-7-0
|
1-5-0
|
0-7-0
|
1-8-0
|
10 సంవత్సరాలు
|
|
3.కుజుడు
|
0-4-6
|
0-7-0
|
0-4-27
|
1-0-18
|
0-11-6
|
1-1-9
|
0-11-27
|
0-4-27
|
1-2-0
|
7 సంవత్సరాలు
|
|
4.రాహువు
|
0-10-24
|
1-6-0
|
1-0-18
|
2-8-12
|
2-4-24
|
2-10-6
|
2-6-18
|
1-0-18
|
3-0-0
|
18 సంవత్సరాలు
|
|
5.గురువు
|
0-9-18
|
1-4-0
|
0-11-6
|
2-4-24
|
2-1-18
|
2-6-12
|
2-3-6
|
0-11-6
|
2-8-0
|
16 సంవత్సరాలు
|
|
6.శని
|
0-11-12
|
1-7-0
|
1-1-9
|
2-10-6
|
2-6-12
|
3-0-3
|
2-8-9
|
1-1-9
|
3-2-0
|
19 సంవత్సరాలు
|
|
7.బుధుడు
|
0-10-6
|
1-5-6
|
0-11-27
|
2-6-18
|
2-3-6
|
2-8-9
|
2-4-27
|
0-11-27
|
2-10-0
|
17 సంవత్సరాలు
|
|
8.కేతువు
|
0-4-6
|
0-7-0
|
0-4-27
|
1-0-18
|
0-11-6
|
1-1-9
|
0-11-27
|
0-4-27
|
1-2-0
|
7 సంవత్సరాలు
|
|
9.శుకృడు
|
1-0-0
|
1-8-0
|
1-2-0
|
3-0-0
|
2-8-0
|
3-2-0
|
2-10-0
|
1-2-0
|
3-4-0
|
20 సంవత్సరాలు
|
|
గ్రహం
|
|
శత్రువు
|
సముడు
|
|
రవి
|
చంద్రుడు, కుజుడు, గురువు
|
శని,శుకృడు
|
బుధుడు
|
|
చంద్రుడు
|
రవి, బుధుడు
|
శత్రువులు లేరు
|
మిగిలిన వారు సములు
|
|
కుజుడు
|
గురువు, చంద్రుడు, రవి
|
బుధుడు
|
శుక్రుడు, శని
|
|
బుధుడు
|
శుకృడు, రవి
|
చంద్రుడు
|
కుజుడు, గురువు, శని
|
|
గురువు
|
కుజుడు, చంద్రుడు
|
బుధ, శుకృడు
|
రవి, శని
|
|
శుకృడు
|
శని, బుధుడు
|
రవి, చంద్రుడు
|
కుజుడు, గురువు
|
|
శని
|
శుకృడు, బుధుడు
|
రవి, చంద్రుడు, కుజుడు
|
గురువు
|
|
రాహువు
|
శని, శుకృడు
|
రవి, చంద్రుడు, కుజుడు
|
గురువు, బుధుడు
|
|
కేతువు
|
రవి, చంద్రుడు, కుజుడు
|
శని, శుకృడు
|
బుధుడు, గురువు
|
భూమి తనచుట్టూ తాను తిరిగే ఆత్మ ప్రదక్షిణ కాలంలో ప్రతి రెండు గంటలకు లగ్నం
మారుతూ 24 గంటల సమాయాన్ని 12 రాశుల లగ్నాలుగా విభజిస్తూ జ్యోతిష్య గణన చేస్తారు.
చైత్రమాసం పాడ్యమి సూర్యోదయం మేష లగ్నంతో ఆరంభం ఔతుంది. ఒక రోజుకు నాలుగు నిమిషాల
కాలం ముందుకు జరుగుతూ చేర్చుకొని ఒక మాసకాలంలో 120 నిమిషాలు లగ్న కాలం మారుతూ
వైశాఖమాస ప్రారంభం వృషభ లగ్నంతో ఉదయం ఆరంభం ఔతుంది. ఈ విధంగా లగ్న గణన చేస్తూ
జాతకుడు పుట్టిన లగ్న నిర్ణయం చేస్తారు. లగ్నము ప్రదేశములకు అనుగుణముగా
మారుతుంటుంది.
జ్యోతిష్య శాస్రంలో రాహుకేతువులు ఛాయా గ్రహాలు. వీటికి జ్యోతిష్య
శాస్రంలో ఇల్లు లేదు. రాహుకేతువులు అపసవ్య మార్గంలో ప్రయాణం చేస్తాయి. రాహువు
కేతువుకు సరిగ్గా ఏడు రాశులు దూరంలో ప్రయాణం చేస్తాయి. కనుక ఈ రెండు గ్రహాలు
ప్రయాణకాలం సమమే. రాహువును కాలసర్పంగా వ్యవహరిస్తారు. రాశి చక్రంలో రాహువు
కేతువుకు మధ్యలో అన్ని గ్రహాలు ఉంటే దానిని కాలసర్ప దోషంగా నిర్ణయిస్తారు.
జ్యోతిష శాస్త్రమున గ్రహములు దిగ్బలం, స్థానబలం, కాల బలం, చేష్టాబలం
అను నాలుగు విధముల బలనిర్ణయం చేస్తారు , లగ్నంలో గురువు, బుధుడు ఉన్న బలవంతులు.
నాలుగవ స్థానములో చంద్రుడు, శుక్రుడు ఉన్న బలవంతులు. పదవ స్థానమున సూర్యుడు,
కుజుడు బలవంతులు. స్వ స్థానమున, ఉచ్ఛ స్థానమున, త్రికోణమున, మిత్ర స్థానమున, స్వ
నవాంశ అందు ఉన్న గ్రహములు, శుభ దృష్టి గ్రహములు బలముకలిగి ఉంటాయి. స్త్రీ
క్షేత్రములైన వృషభము, కటకము, కన్య, వృశ్చికము, మకరము, మీనములందు చంద్రుడు,
శుక్రుడు బలవంతులు. పురుష రాశులైన మేషము, మిధునము, సింహము, తుల, ధనస్సు, కుంభములందు
సూర్యుడు, కుజుడు, గురువు, బుధుడు, శని బలవంతులు. సూర్యుడు, కుజుడు, శుక్రుడు
పగటి అందు బలవంతులు. రాత్రి అందు బుధుడు, శని, గురువు బలవంతులు. సర్వ కాలమందు
బుధుడు బలవంతుడు. శుక్ల పక్షమున శుభగ్రహములు, కృష్ణ పక్షమున పాపగ్రహములు
బలవంతులు. యుద్ధమున జయించిన వాడు, వక్రగతి కల వాడు, సూర్యుడికి దూరముగా ఉన్న వాడు
చేష్టా బలం కలిగిన వాడు. అంటే ఉత్తరాయణమున కుజుడు, గురువు, సూర్యుడు, శుక్రుడు
దక్షిణాయనమున చంద్రుడు, శని రెండు ఆయనముల అందు స్వక్షేత్రమున ఉన్న బుధుడు చేష్టా
బలము కల వారు. స్త్రీ గ్రహములైన చంద్రుడు, శుక్రుడు రాశి మొదటి స్థానమున ఉన్న
బలము కలిగి ఉంటారు. పురుష గ్రహములైన సూర్యుడు, కుజుడు, గురువు రాశి మధ్యమున ఉన్న
బలము కలిగి ఉంటాయి. నపుంసక గ్రహములైన బుధుడు, శని రాశి అంతమున ఉన్నచేష్టా బలము
కలిగి ఉంటాయి. రాత్రి అందు మొదటి భాగమున చంద్రుడు, అర్ధరాత్రి అందు శుక్రుడు,
తెల్లవారు ఝామున కుజుడు, ఉదయకాలమున బుధుడు, మధ్యహ్న కాలమున సూర్యుడు, సాయం కాలమున
శని సర్వ కాలమందు గురువు బలవంతులు. శనికంటే కుజుడు, కుజుని కంటే బుధుడు,
బుధునికంటే గురువు, గురువుకంటే శుక్రుడు, శుక్రునికంటే చంద్రుడు, చంద్రునికంటే
సూర్యుడు బలవంతులు.
గ్రహావస్థలు పది రకాలు. (1) స్వస్థము, (2) దీప్తము, (3) ముదితము,
(4) శాంతము, (5) శక్తము, (6) పీడితము, (7) దీనము, (8) వికలము, (9) ఖల, (10) భీతము
అనేవి ఆ అవస్థలు.
ఉచ్ఛ స్థానమున ఉన్న దీప్తుడు, స్వక్షేత్రమున ఉన్న స్వస్థుడు,
మిత్రక్షేత్రమున ఉన్న ముదితుడు, శుభవర్గమున ఉన్న శాంతుడు, సూర్యునకు దూరమున ఉన్న
శక్తుడు, అస్తంగతుడైన వికలుడు, యుద్ధమున పరాజితుడైన పీడితుడు, పాప వర్గమున ఉన్న
ఖలుడు, నీచ అందు ఉన్న భీతుడు అని అంటారు. అలాగే సూర్యుడి సామీప్యాన్ని ఆధారంగా
చేసుకుని గ్రహగతులను నిర్ణయిస్తారు. సూర్యునితో చేరి ఉన్న గ్రహము అస్తంగత గ్రహం
అంటారు.సూర్యునికి రెండవ స్థానంలో ఉన్నశీఘ్రగతిని పొందిన గ్రహం అంటారు. సూర్యుని
నాల్గవ స్థానమున ఉన్న గ్రహాన్ని మందుడు అంటారు. సూర్యునికి అయిదు ఆరు రాశులలో
ఉన్న గ్రహం వక్రగతిని పొందిన గ్రహం అంటారు. సూర్యునికి ఏడు ఎనిమిది స్థానాలలో
ఉన్న గ్రహం అతి వక్రగతిని పొందిన గ్రహం అంటారు.సూర్యునికి తొమ్మిది, పది
స్థానాలలో ఉన్న గ్రహం కుటిలగతి పొందిన గ్రహం అంటారు. సూర్యునికి పదకొండు,
పన్నెండు స్థానాలలో ఉన్న గ్రహాన్ని అత్యంత శీఘ్రగతిన ఉన్న గ్రహం అంటారు.
జ్యోతిష్యాన్ని హేతువాదులు, శాస్త్రవేత్తలు తీవ్రంగా
విమర్శిస్తున్నారు. జ్యోతిష్యులు ఇప్పుడు కూడా భూకేంద్రక సిధ్ధాంతాన్ని
ప్రామాణికంగా భావిస్తున్నారు. వీరు నికోలాస్ కోపర్నికస్ ప్రతిపాదించిన సూర్య కేంద్రక సిధ్ధాంతాన్ని
అంగీకరించరు. భూమి నీడ చంద్రుని మీద పడడం వల్లే గ్రహణాలు ఏర్పడతాయన్న ఆర్యభట్టు సూత్రీకరణని కూడా వీరు అంగీకరించరు. వీరు ఇప్పుడు
కూడా ఉనికిలో లేని రాహుకేతువులని నమ్ముతారు.
జ్యోతిషం సూర్య కేంద్రక సిద్దాంతప్రకారము చెప్పబడినదే. భూమి
సూర్యుని చుట్టూ తిరగడం వలన ఏర్పడే మార్పులు జ్యోతిష శాస్త్రం స్పష్టంగా
వివరిస్తున్నది. జీవులు భూమి మీద బ్రతుకుతున్నాయి కానీ సూర్యుని మీద కాదు.
అందుకే భూమిని కేంద్రంగా తీసుకోవడం జరిగింది. ఇది చాలా అంతరార్థం కలిగిన విషయము. జ్యోతిష శాస్త్రజ్ఞానం ఖచ్చితంగా అవసరం.
రాహుకేతువులు భూకక్ష్య మరియు సూర్యకక్ష్యల ఖండనబిందువులు. అందుకే జన్మకుండలిలో అవి ఎదురెదురుగా ఉంటాయి. అందుకే వాటిని ఛాయాగ్రహాలు అంటున్నాము.
హేతువాదులు వారి సిద్దాంతాన్ని కాపాడుకునేందుకు, దేవుడే లేడు అని
నమ్ముతూ బ్రతుకుతున్నారు. వారికి జ్యోతిషం గురించి అనవసరం.
శాస్త్రవేత్తలు చాలా విషయాలు తెలుసుకొంటున్నారు. జ్యోతిషం గురించి
కూడా తెలుసుకొంటారు.
ఇలా విమర్శకుల ప్రతి ప్రశ్నకు జ్యోతిషశాస్త్రం సమాధానమిస్తుంది.
సంక్రాంతి కాల నిర్ణయం సంక్రాతి సందేహ నివారణ
శ్లో॥ మాందైక కర్మేన
శుద్ధవ్యర్కేందు ఉత్పాదతా తిథి: । శ్రాద్ధాదీషు
పరిగ్రాహ్యా గ్రహణాదౌతు బీజయుక్ ॥ ॥ తిథి కౌస్తుభం ॥
శ్లో॥ సిద్ధాంత గ్రహచారేణ
వ్రతాది: కాల ఉచ్యతే । దృక్సిద్ధ గ్రహచారేణ ప్రత్యక్ష ఫల చింతితమ్
॥ ॥ సిద్ధాంత రహస్యం ॥
నిత్య నైమిత్తిక కర్మలకు, వ్రతములకు, పండుగలకు,శ్రాద కర్మలకు తిథిని
నిర్ణయించుట యందు దృక్ కలపకుండా పూర్వ పద్దతి ప్రాకారమే (మహర్షి ప్రోక్తమైనది,
సూర్య సిద్దాంత ఉక్తమైన పద్దతి, సంప్రదాయ పద్దతి ప్రకారమే) ఆచరించవలయును.
గ్రహణాదులయందు, జాతక ఫలములు తెలియపరచునప్పుడు దృక్ యుక్తమైన
గ్రహములను తీసుకోవలనని మన శాస్త్రములు, సిద్ధాంత గ్రంధములు, మన పూర్వీకులు తెలియ
పరచిరి .
సంక్రాంతి పండుగను పూర్వ పద్దతి ప్రకారమే ఆచరించుట సర్వదా
శ్రేయోదాయకము.
పూర్వ పద్దతి ప్రకారము శ్రీ సూర్యభగవానుడు 14-01-2014 న సాయంత్రం
6-23 నిమిషములకు మకర సంక్రమణం చేయుచున్నడు. సూర్యాస్తమయం సాయంత్రం 6-01
నిమిషములకు.
ధర్మ శాస్త్ర నిర్ణయముననుసరించి 15-01-2014 ననే సంక్రాంతి
ఆచరించవలయును.
సుబ్రహ్మణ్య సిద్ధాంతి
శ్లో॥ మాందైక కర్మేన శుద్ధవ్యర్కేందు ఉత్పాదతా తిథి: । శ్రాద్ధాదీషు పరిగ్రాహ్యా గ్రహణాదౌతు బీజయుక్ ॥ ॥ తిథి కౌస్తుభం ॥
శ్లో॥ సిద్ధాంత గ్రహచారేణ వ్రతాది: కాల ఉచ్యతే । దృక్సిద్ధ గ్రహచారేణ ప్రత్యక్ష ఫల చింతితమ్ ॥ సిద్ధాంత రహస్యం
నిత్య నైమిత్తిక కర్మలకు, వ్రతములకు, పండుగలకు,శ్రాద కర్మలకు తిథిని నిర్ణయించుట యందు దృక్ కలపకుండా పూర్వ పద్దతి ప్రాకారమే (మహర్షి ప్రోక్తమైనది, సూర్య సిద్దాంత ఉక్తమైన పద్దతి, సంప్రదాయ పద్దతి ప్రకారమే)
ఆచరించవలయును.
గ్రహణాదులయందు, జాతక ఫలములు తెలియపరచునప్పుడు దృక్ యుక్తమైన గ్రహములను
తీసుకోవలనని మన శాస్త్రములు, సిద్ధాంత గ్రంధములు, మన పూర్వీకులు తెలియ పరచిరి .
సంక్రాంతి పండుగను పూర్వ పద్దతి ప్రకారమే ఆచరించుట సర్వదా
శ్రేయోదాయకము.
పూర్వ పద్దతి ప్రకారము శ్రీ సూర్యభగవానుడు 14-01-2014
న సాయంత్రం 6-23 నిమిషములకు మకర
సంక్రమణం చేయుచున్నడు. సూర్యాస్తమయం సాయంత్రం 6-01 నిమిషములకు.
- 1 సంస్కృతుల్లోని సాధారణ అంశాలు
- 2 సంప్రదాయ వివాహ ఉడుపులు
- 3 పెండ్లి మేళం
- 3.1 పాశ్చాత్య వివాహాలు
- 4 ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివాహ సంప్రదాయాలు
- 4.1 ఆఫ్రికన్ సంప్రదాయాలు
- 4.2 అరబ్ వివాహ సంప్రదాయాలు
- 4.3 బెంగాలీ వివాహ సంప్రదాయాలు
- 4.4 చైనీయుల వివాహ సంప్రదాయాలు
- 4.5 యూరోపియన్ సంప్రదాయాలు
- 4.6 ఫిలిప్పినో వివాహ సంప్రదాయాలు
- 4.7 జపనీస్ వివాహ సంప్రదాయాలు
- 4.8 మాలే వివాహ సంప్రదాయాలు
- 4.9 ఉత్తర అమెరికా సంప్రదాయాలు
- 4.10 పాకిస్తానీ వివాహ సంప్రదాయాలు
- 4.11 ఇరానియన్ వివాహం
- 4.12 రష్యన్ వివాహ సంప్రదాయాలు
- 5 మతపరమైన వివాహ అంశాలు
- 5.1 పలు మతాలకు సంబంధించిన సంప్రదాయాలు
- 6 పెళ్లి రకాలు
- 6.1 ప్రభుత్వ వివాహం
- 6.2 లేచిపోవడం
- 6.3 స్వలింగ వివాహం
- 6.4 లక్ష్య వివాహం
- 6.5 శ్వేత వివాహం
- 6.6 వారాంతపు వివాహం
- 6.7 సైనిక వివాహం
- 6.8 జంట వివాహం
- 7 గ్యాలరీ
- 8 వీటిని కూడా చూడండి
- 8.1 వివాహ ప్రణాళిక
- 8.2 వివాహ సంప్రదాయాలు
- 8.3 కార్యక్రమ అంశాలు
- 8.4 సంబంధిత ప్రయాణం
- 8.5 మతపరమైన అంశాలు
- 8.6 సంబంధిత కార్యక్రమాలు
- 8.7 సంబంధిత తరగతులు
- 8.8 గ్లోసరీలు
- 9 సూచనలు
ఇంగ్లాండ్ తోర్నబరి కాస్టిల్, పెండ్లి లో ఫోటోగ్రాఫ్స్ కై సిద్ధమవుతూ
ఫిన్లాండ్ కివ్రువేసి, కివ్రువేసి చర్చ్ లో పెండ్లి శుభకార్యం
యూరి పిమనోవ్ చే సోవియట్ పోస్టల్ స్టాంప్ పై పెయింట్ చేయబడిన "వెడ్డింగ్ ఆన్ టుమోరో స్ట్రీట్".
పార్స్ వెడ్డింగ్, 1905- చియాంగ్సమ్ లేదా హన్ఫు, చైనీయుల సంప్రదాయక మర్యాదపూర్వక వస్త్రధారణ.
- బాటిక్ మరియు కెబాయ, ఇండోనేషియాకి చెందిన జావా ప్రజలు మరియు మలేషియాలోని మాలే ప్రజలు ధరించే ఒక వస్త్రం.
- బరోంగ్ టాగలాగ్, ఫిలిప్పైన్స్కి చెందిన ఎంబ్రాయిడరీ చేసిన, పురుషులు ధరించే సంప్రదాయక వస్త్రం.
- కిమోనో, జపాన్ యొక్క సంప్రదాయక వస్త్రాలు.
- చీర, భారతదేశంలో కట్టుకునే భారత ప్రసిద్ధ మరియు సంప్రదాయక వస్త్రం.
- పంచె, దక్షిణ భారతదేశంలో పురుషులు ధరించే వస్త్రం.
- దషికి, పశ్చిమ ఆఫ్రికాలో జరిగే వివాహ వేడుకల్లో ధరించే ఒక సంప్రదాయక వస్త్రం.
- Áo Dài, వియత్నాం యొక్క సంప్రదాయక వస్త్రాలు.
- మార్నింగ్ డ్రెస్, పాశ్చాత్య దేశాల్లో పగటిపూట ధరించే సంప్రదాయక వస్త్రం.
- కిల్ట్, స్కాట్లాండ్ సంస్కృతికి సంబంధించిన
- కిట్టెల్, సాంప్రదాయక యూదుల వివాహాల్లో వరుడు ధరించే ఒక తెలుపు రంగు అంగీ. కిట్టెల్ను చుపా దిగువ మాత్రమే వేసుకుంటారు. దీనిని రిసెప్షన్ ముందు తీసివేస్తారు.
- టోపోర్, ఒక రకమైన శృంగాకార తలపాగా.
- సాయంత్రకాలపు వస్త్రాలు
- నలుపు రంగు టై (UKలో "విందు జాకెట్" అని; USలో తరచూ ఒక
- సంప్రదాయేతర "టుక్సెడో" రకాలు (రంగు జాకెట్లు/టైలు, "వివాహ వస్త్రాలు")
- తెలుపురంగు టై (UKలో ధరించే "సాయంకాలపు వస్త్రం" ; అత్యంత సంప్రదాయకమైన సాయంకాలపు వస్త్రధారణ)
- షెర్వాణి, దక్షిణాసియాలో ధరించే ఒక పొడవాటి కోటు మాదిరి వస్త్రం.
- స్కాండినేవియా వధువులు ధరించే వివాహ కిరీటం
- వివాహ మేలిముసుగు
- పెళ్లి బట్టలు
- లంగా ఓనీ, హిందూమతానికి చెందిన పెళ్లికాని తెలుగమ్మాయిలు ధరించే రెండు విడి వస్త్రాలకు సంబంధించిన సంప్రదాయక వస్త్రధారణ.
- గాలి వాద్యం మరియు ఒక రకం పియానోతో పలు వాద్యాలు ఉంటాయి. వాదనగా జెరీమియా క్లార్క్ ఒక ప్రొఫెషనల్గా వాయించిన ప్రిన్స్ ఆఫ్ డెన్మార్క్స్ మార్చ్ మరియు స్తుతి కీర్తనలుగా హెన్రీ పర్సెల్ యొక్క "ట్రంపెట్ ట్యూన్" మరియు జాన్ స్టాన్లీ యొక్క "ట్రంపెట్ వాలంటరీ"లు చక్కటి గుర్తింపు పొందాయి.
- జార్జ్ ఫ్రీడరిక్ హ్యాండెల్ ఎంపికలు, బహుశా అతి ముఖ్యంగా ఒక కీర్తనగా అతని వాటర్ మ్యూజిక్ నుంచి ఎంపిక చేసిన "ఎయిర్" మరియు ఒక స్తోత్రంగా "అల్లా హార్న్పైప్" ప్రసిద్ధిగాంచాయి.
- రిచర్డ్ వేగనర్ యొక్క లోహెన్గ్రిన్ నుంచి "బ్రైడల్ కోరస్", తరచూ ఒక కీర్తనగా ఉపయోగించబడింది. ఇది సాధారణంగా "హియర్ కమ్స్ ది బ్రైడ్"గా సుపరిచితం. రిచర్డ్ వేగనర్ యూద దేక్షణ,[8] కలిగి ఉన్నవాడుగా చెప్పబడుతుంది. ఫలితంగా, బ్రైడల్ కోరస్ తరచూ యూదుల వివాహాల్లో ఉపయోగించబడేది.
- జోహన్ పాచెల్బెల్కి చెందిన కెనాన్ ఇన్ D అనేది ఒక ప్రత్యామ్నాయ కీర్తన.
- షేక్స్స్పియర్ ప్రదర్శన ఎ మిడ్సమ్మర్ నైట్స్ డ్రీమ్ కోసం ఫెలిక్స్ మెండెల్సన్ యొక్క అనుషంగిక సంగీతానికి సంబంధించిన "వెడ్డింగ్ మార్చ్" ఒక కీర్తనగా ఉపయోగించబడింది.
- చార్లెస్-మేరీ విడర్ యొక్క సింఫోనీ ఫర్ ఆర్గాన్ No. 5 నుంచి తీసుకున్న "టొకాటా" ఒక కీర్తనగా ఉపయోగించబడింది.
- ఓడె టు జాయ్ యొక్క భాగాలు, లడ్విగ్ వన్ బీథోవెన్కు చెందిన నైన్త్ సింఫోనీ నాలుగో ఉద్యమం.
- వివాహ రిసెప్షన్లలో, 1950లకు చెందిన స్విస్ ఊంపా పాట అమెరికాలో ది చికెన్ డాన్స్ గా సుపరిచితమైన డెర్ ఎంటెన్టాంజ్ అనేది రిసెప్షన్ నృత్య సంగీతంలో ముఖ్యమైన భాగంగా మారింది.
- వధువు కుటుంబం పెళ్లికి పిలవాలనుకున్న అతిథులకు వారి చిరునామాను రాసి, జంట తరపున వారికి ఆహ్వానాలు పంపుతుంది. ఒకవేళ జంట మధ్య-వయస్కులైతే వారు కూడా వారి తరపున ఆహ్వానాలు పంపవచ్చు. ఆహ్వానం వివాహ కార్యక్రమం కోసమా మరియు/లేదా రిసెప్షన్ కోసమా మరియు/లేదా రిసెప్షన్ వద్ద సాయంత్రం ఏర్పాటు చేసిన విందు కోసమా అనేది ఆహ్వానించే వారు స్పష్టంగా పేర్కొంటారు.
- పెళ్లి రోజుకు ముందుగా అతిథులు వారి కానుకలను వధువు స్వగృహానికి పంపుతారు. ప్రత్యామ్నాయంగా, ఒక డిపార్ట్మెంట్ స్టోర్లో కానుకల జాబితాను జంట నమోదు చేస్తుంది. సదరు స్టోర్ తర్వాత వాటిని సాధారణంగా వధువు తల్లిదండ్రుల ఇంటికి లేదా రిసెప్షన్ జరిగే వేదిక వద్దకు చేరుస్తుంది.
- చర్చి, రిజిష్టరు కార్యాలయం లేదా కొండ పైభాగాన వంటి నచ్చిన ప్రదేశాల్లో వివాహ తంతు జరుగుతుంది. ఈ విషయంలో ఇంగ్లాండ్కు స్కాట్లాండ్ విలక్షణంగా ఉంటుంది. ఇంగ్లాండ్లో పూర్వ-ఆమోదిత ప్రభుత్వ ప్రదేశాల్లోనే వివాహాలు జరుగుతుంటాయి. పలు కార్యక్రమాలు మిట్ట మధ్యాహ్నం పూట జరుగుతాయి. సాధారణంగా అవి సుమారు అర గంటలో ముగుస్తాయి. అదే సమయంలోనే జంట మరియు ఇద్దరు సాక్షులు పెళ్లి షెడ్యూలుకు అంగీకరిస్తారు. సాధారణంగా, సాక్షులు తోడిపెళ్లికొడుకు మరియు ప్రధాన తోడిపెళ్లికూతురు.
- కొత్తగా పెళ్లైన జంట సన్నాయిల శబ్దం వినడం ద్వారా కార్యక్రమం నుంచి నిష్క్రమించవచ్చు.
- ఈ పెళ్లి తంతు తర్వాత వివాహ విందు (రిసెప్షన్) ఉంటుంది. సాధారణంగా ఇది మరో చోట ఉంటుంది.
- ఈ వివాహ విందు ప్రవేశం మార్గం వద్ద మొదలవుతుంది. వివాహానికి వచ్చిన అతిథులు గతాన్ని చెబుతూ, వారికి వారుగా పరిచయం చేసుకుంటారు.
- అతిథులు మరియు పెళ్లి పార్టీ జరుగుతున్నప్పుడు మామూలుగా ఒక పానీయం అందించబడుతుంది. కొన్నిసార్లు ఈ పానీయం ఆల్కాహాలు యేతర ప్రత్యామ్నాయం కలిపిన విస్కీ లేదా వైన్గా ఉంటుంది.
- తోడిపెళ్లికొడుకు మరియు వధువు యొక్క తండ్రి వ్యక్తిగత అభిప్రాయాలు, కథల ద్వారా వధూవరుల చేత తాగిస్తారు. ఇక శ్రేయోభిలాషులు సాధారణంగా హాస్యభరితంగా ఉంటారు. తర్వాత వరుడు అతని వధువు తరపున స్పందిస్తాడు. చాంపేన్ (తెల్లద్రాక్షా సారా) సాధారణంగా తాగడానికి ఏర్పాటు చేస్తారు.
- ఇక భోజనాలప్పుడు ఎప్పుడూ నృత్యం ఉంటుంది. స్కాట్లాండ్లో ఇది తరచూ ఒక céilidh రూపాన్ని సంతరించుకుంటుంది. అంటే ప్రత్యక్ష సంప్రదాయక సంగీతానికి జంటలు మరియు బృందాలు అనధికారిక సంప్రదాయక స్కాటిష్ నృత్యం చేసే ఒక రాత్రి. తొలుత వధూవరులు తర్వాత విందులో పాల్గొన్నవారు చివరగా అతిథులు నృత్యం చేస్తారు.
- కేకు కోసే కార్యక్రమం జరుగుతుంది. కేక్ కట్టర్ను వధూవరులిద్దరూ కలిసి పట్టుకుని, వివాహ కేకు మొదటి ముక్కను కోస్తారు.
- బహుమతులను రిసెప్షన్ వద్ద (తెరిచి) చూడరు. వాటిని కొద్ది సమయానికి ముందుగా కానీ లేదా కొన్నిసార్లు రిసెప్షన్ వద్ద వాటిని చూపిస్తారు లేదా సమయానికి ముందుగా అతిథులు ఒకవేళ బహుమతులను పంపకపోతే, వధూవరులు వాటిని ఇంటికి వెళ్లిన తర్వాత, తీసి చూసుకోవచ్చంటూ, రిసెప్షన్ వద్ద ఉంటే బల్లపై వాటిని ఉంచుతారు.
- తెలుపురంగు అడవి పొద రెమ్మ సాధారణంగా అదృష్టం కోసం బొత్తా రంధ్రానికి ధరించబడుతుంది.
- వరుడికి ఇది తప్పనిసరి నిబంధన. అలాగే వివాహ పార్టీలోని పలువురు పురుషులు మరియు అతిథులు సూటులు కూడా వేసుకునే వీలున్నప్పటికీ, ఒక రకమైన కుచ్చు లంగాలు ధరించాలి. కుచ్చు లంగాలు మరియు హైల్యాండ్ డ్రెస్ (స్కాటిష్ వస్త్రధారణ)ను ఈ పని కోసం తరచూ అద్దెకు తీసుకొస్తుంటారు [అనుఖనం అవసరం].
- సాధారణంగా పెళ్లికి ఒకటి రెండు నెలల ముందు అతిథేయుడు అతిథులకు ఆహ్వానాలు పంపుతాడు. కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత మరియు వ్యక్తిగత అర్థాన్ని తెలిపే విధంగా సాధ్యమైనంత వరకు చిరునామాలు చేతితో రాసి, ఆహ్వానాలు పంపుతుంటారు. భారీ సంఖ్యలో ఉండే ఆహ్వానాలు యాంత్రికంగా పునరుత్పత్తి కావొచ్చు. నగిషీలు చెక్కడం (ఎన్గ్రేవింగ్) అనేది గతంలో అందుబాటులో ఉన్న అత్యధిక నాణ్యతను ఇచ్చే ముద్రణ పరిజ్ఞానం. ఇది వివాహ ఆహ్వాన సంప్రదాయంతో ముడిపడింది. ఆహ్వానం అందుకోవడం అనేది ఆహ్వానితుడిపై తప్పకుండా అంగీకరించడం లేదా ఆహ్వానాన్ని తిరస్కరించడం మరియు జంటను అభినందించడం తప్ప మరే ఇతర బాధ్యత ఉండదు.[20]
- కొత్త జంటకు బహుమతి ఇవ్వడం అనేది సాంకేతికంగా ఎవరి ఇష్టం వారిది. అందువల్ల పెళ్లికి హాజరైన దాదాపు అతిథులందరూ వారికి నచ్చిన విధంగా చేస్తారు.
- తోడిపెళ్లికూతుళ్ల దుస్తులు, పుష్పాలు, ఆహ్వానాలు మరియు అలంకరణల మొదలుకుని అన్నీ సరిపోయే విధంగా ఒక కలర్ స్కీమ్ ఎంపిక చేయబడుతుంది. నిజానికి ఈ విధంగా తప్పక చేయాల్సిన అవసరం లేదు.
- వివాహ కార్యక్రమం ఎక్కడైనా జరగొచ్చు. అయితే తరచూ చర్చి, ప్రభుత్వ భవనం లేదా బాహ్య వేదికను ఎంపిక చేసుకుంటారు. ఈ కార్యక్రమం జంట యొక్క మతపరమైన సంప్రదాయాల ద్వారా లేదా అవి లేకుండా నిర్వహించబడవచ్చు. అతి సాధారణ మత-యేతర (ఆధ్యాత్మిక) రూపం బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్స్ లోని ఒక మామూలు ఆంగ్లికన్ కార్యక్రమం నుంచి వచ్చింది. ఇది సంగీతం లేదా ప్రసంగాల ద్వారా తరచూ పొడగించబడుతున్నప్పటికీ, దీనిని పది నిమిషాల లోపే చేయొచ్చు. దీని సంక్షిప్తత వల్ల ఆలస్యంగా వచ్చే అతిథులు కార్యక్రమం మొత్తాన్ని వీక్షించే అవకాశం కోల్పోతారు.
- అమెరికన్ వధువులు సాధారణంగా ప్రత్యేకించి, వారి మొదటి పెళ్లిలో ఒక తెలుపు, సగం తెలుపు, వెండి లేదా ఇతర లేత రంగుల దుస్తులు ధరిస్తారు.[21] పశ్చిమంలో నలుపు రంగు విచారానికి సూచించే రంగు కావడం చేత దానిని కొందరు గట్టిగా వ్యతిరేకించినప్పటికీ, వధువులు వారికి నచ్చిన రంగును ఎంపిక చేసుకోవచ్చు.[22]
- కొత్త జంట వివాహాన్ని ముగించుకున్న సందర్భంగా కొన్నిసార్లు సంతానాన్ని తెలుపుతూ వారిపై వండని బియ్యం లేదా రంగు కాగితాలను చల్లుతారు. బియ్యాన్ని తిన్న పక్షులు కుప్పకూలిపోతాయనే తప్పుడు అయితే విస్తృతంగా ప్రచారంలో ఉన్న కల్పితగాథ వల్ల కొందరు వ్యక్తులు, చర్చిలు లేదా కమ్యూనిటీలు పక్షుల ఆహారాన్ని ఎంపిక చేసుకుంటారు.[23] బియ్యం మరియు పక్షుల ఆహారం తెచ్చిన అయోమయం కారణంగా ఆధునిక జంటలు తరచూ బుడగల మేఘాల్లోకి నెట్టబడుతారు.[24]
- వివాహ పార్టీ ద్వారా ఈ సమయంలో అతిథులు వరుసక్రమంలో నిల్చుని పలకరించుకోవడం లేదా తర్వాత వివాహ రిసెప్షన్ వద్ద ఇతరులను పలకరించడం జరుగుతుంది. తద్వారా వివాహ కార్యక్రమానికి వచ్చిన వారందరినీ ప్రతి ఒక్క అతిథి పలకరించినట్లవుతుంది.
- వచ్చిన అతిథులు మరియు వివాహ పార్టీ సందర్భంగా పానీయాలు, చిరుతిండ్లు లేదా ఒకవేళ భోజనం, ప్రత్యేకంగా సుదీర్ఘమైన రిసెప్షన్లలో ఏర్పాటు చేస్తారు.
- తరచూ తోడిపెళ్లికొడుకు మరియు/లేదా తొడిపెళ్లికూతుళ్లు కొత్త జంటను వ్యక్తిగత అభిప్రాయాలు, కథలు మరియు శ్రేయోభిలాషుల ద్వారా అభినందిస్తారు. ఇతర అతిథులు కొన్నిసార్లు వారి సొంత పొగడ్తలను అనుసరిస్తారు. దీనిని పురస్కరించుకుని సాధారణంగా చాంపేన్ (తెల్లద్రాక్షా సారా)ను అందిస్తారు.
- వివాహ కేకును కోయడంలో కొత్త జంట ఒకటిగా కలిసి కత్తిని పట్టుకుంటుంది. అందులోని మొదటి ముక్కను కోసి, వారిద్దరూ పరస్పరం తినిపించుకుంటారు. కొన్ని ఉప-సంస్కృతుల్లోనైతే, ఉద్దేశపూర్వకంగా ఇద్దరూ వారి ముఖాలపై పరస్పరం కేకును పూసుకుంటారు. దీనిని కొన్నిచోట్ల అసహ్యమైనదిగా భావిస్తారు.[25][26][27]
- ఒకవేళ నృత్యం ప్రతిపాదించబడితే, ఇద్దరూ కలిసి కొద్దిసేపు నర్తిస్తారు. కొన్నిసార్లు మరో నిబంధన కూడా అనుసరించబడుతుంది. అంటే ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల్లో ఒకరితో కలిసి నర్తిస్తారు. తర్వాత సంభవనీయంగా వివాహానికి వచ్చిన ఇతర సభ్యులతో కలిసి నర్తిస్తారు. ప్రత్యేకించి, తల్లి/తనయుడు మరియు తండ్రి/తనయ నృత్యానికి అనువుగా ప్రత్యేక పాటలను జంట ఎంపిక చేసుకుంటుంది. కొన్ని ఉప సంస్కృతుల్లో నగదు నృత్యం ఉంటుంది. ఇందులో వధూవరుల్లో ఒకరితో కలిసి అతిథులు నర్తించాల్సి ఉంటుంది. ఇందుకు వారికి కొంత సొమ్ము ఇస్తారు. అతిథులు జంటకు బాకీ పడతారనే విషయం కారణంగా, ఈ ఆచారం ప్రధాన పాశ్చాత్య రివాజుకు విరుద్ధంగా ఉన్నందున ఇది అనేక సామాజిక వర్గాల్లో మర్యాదలేనిదిగా పరిగణించబడుతోంది.[28]
- ఇరవయ్యో శతాబ్దం మధ్యలో, రిసెప్షన్ సమయంలో ఒక వధువు ఆమె పూలగుత్తిని ఆమె భుజంపై నుంచి గుమిగూడిన అవివాహిత యువతులపై విసరడం సాధారణమైపోయింది. అయితే మూఢవిశ్వాసం కారణంగా, దానిని పట్టుకున్న యువతి తర్వాత పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా వరుడు కూడా వధువు యొక్క మోకాలి పట్టీని అవివాహిత యువకులపై విసురుతాడు. దానిని పట్టుకున్న యువకుడు పూలగుత్తిని పట్టుకున్న యువతి కాలికి కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికీ పలు వర్గాల్లో సాధారణమై ఉన్న, ఈ ఆచారాలు (ప్రత్యేకించి రెండోది) 21వ శతాబ్దంలోనూ ఆచరించబడుతున్నాయి.[29]
- కార్యక్రమానికి ముందు, జంట ఒక రాతపూర్వక కెటుబా (వివాహ ఒప్పందం)ను పూర్తి చేస్తుంది. అందులో పరస్పర బాధ్యతలు మరియు విడాకులకు సంబంధించిన పరిస్థితులు పొందుపరచబడి ఉంటాయి. కెటుబా పై ఇద్దరు సాక్షులు సంతకాలు చేస్తారు. తర్వాత చుప్పా కింద అది చదవబడుతుంది.
- వధూవరుల జంట ఒక వివాహ వస్త్రం (చుప్పా) దిగువ పెళ్లి చేసుకుంటుంది. ఇది వారి కొత్త ఇంటిని తెలుపుతుంది. ఒక చిన్న వస్త్రం లేదా ఇతర వస్తువుతో తయారు చేయబడిన చుప్పా నాలుగు గుంజలకు కట్టబడుతుంది లేదా ఒక ప్రార్థనా శాలువా (తల్లిట్)ని నలుగురు కుటుంబసభ్యులు లేదా మిత్రులు జంటపై పట్టుకుంటారు.
- తర్వాత జంట వారి యొక్క తల్లిదండ్రులతో కలిసి చుప్పాకు వెళుతుంది. అవసరమైతే ఇతర కుటుంబసభ్యులతో కలిసి వారు చుప్పా దిగువ నిల్చుంటారు.
- ఏడు దీవెనలు లభిస్తాయి. వధూవరులు మరియు వారి కొత్త ఇంటిని ఆశీర్వదిస్తారు.
- ఈ జంట ఒక గ్లాసెడు వైన్ను కలిసి తాగుతుంది.
- కొన్ని వివాహాల్లో పరస్పరం పరిశుద్ధులమయ్యామని జంట ప్రకటించవచ్చు, మరియు/లేదా ఇతర ప్రమాణాలను పునరావృతం చేయడం మరియు ఉంగరాలు మార్చుకోవడం చేస్తుంది.
- పూర్వాచార మరియు సంప్రదాయక యూదుల వివాహాల్లో వధువు చుప్పా దిగువ మాట్లాడదు. ఉంగరాన్ని మాత్రమే తీసుకుంటుంది. వధువు కుడి చూపుడు వేలికి ఉంగరాన్ని తొడుగుతూ వరుడు ఈ విధంగా అంటాడు, "Harei at mekudeshet li k'dat Moshe V'Yisrael"- "చూడు, నువ్వు [అందువల్ల] నా కోసం మోసెస్ చట్టం మరియు ఇజ్రాయెల్ ద్వారా పరిశుద్ధం చేయబడ్డావు". వధువు మౌనం మరియు ఉంగరాన్ని స్వీకరించడం పెళ్లికి ఆమె అంగీకారాన్ని తెలుపుతాయి. కార్యక్రమంలోని ఈ భాగం కిడ్డుషిన్ అని పిలుస్తారు. వరుడు ఒక విలువైన వస్తువును వధువుకు ఇవ్వడం పెళ్లి చెల్లుబాటుకు అవసరం.
- అనేక సమతావాది వివాహాల్లో వధువు మాటల ద్వారా స్పందిస్తుంది. తరచూ వరుడు ప్రతిగా ఉంగరం ఇస్తాడు. అప్పుడు వచ్చే సాధారణ స్పందన "ani l'dodi, v'dodi li" (నేను నా ప్రియమైనది, నాకు ప్రియమైనది నాది)
- పూర్వాచార వివాహాల్లో, వరుడు ఇలా అంటాడు:
- వరుడు ఒక గ్లాసును కాలికింద వేసి, పగులగొట్టడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.
- ఈ జంట వారి మొదటి క్షణాలను ఒక పురుషుడు మరియు భార్యగా ఏకాంతం (వివాహ అతిథులు మరియు మరెవ్వరూ హాజరుకాకుండా)గా గడుపుతారు. ఈ చెదర్ యిచుడ్ - "ఏకాంత గది (లేదా 'అఖండత్వం')" చట్టపరంగా వివాహ బంధాన్ని బలోపేతం చేస్తుంది. అందువల్ల అవివాహిత మహిళలు సంప్రదాయకంగా అపరిచిత పురుషుడితో ఒంటరిగా ఉండరు.
- ఈ కార్యక్రమం తర్వాత ఒక సూదత్ మిట్జ్వా , వివాహ విందు, మరియు ఆటపాటలు ఉంటాయి.
- వివాహ విందు ముగింపు సమయంలో బిర్కత్ హమాజన్ (భోజనం తర్వాత ఒయ్యారాలు పోవడం) ఉంటుంది. అదే విధంగా ఏడు వివాహ ఆశీర్వాదాలు కూడా ఉంటాయి.
ఇండోనేసియా లో సుందనీస్ పెండ్లి.
ఈజిప్ట్ ఆస్వాన్ దగ్గర నూబియన్ పెండ్లి.
మిన్స్క్, విక్టరి కట్టడం దగ్గర పెండ్లి శుభకార్యం.
2006 ఈస్ట్ టిమర్ పెండ్లి లో ఎథినిక్ హక్క ప్రజలు.
నపుపు మరియు తెలుపు దుస్తులు ధరించిన జపనీస్ పెళ్లి కూతురు మరియు పెళ్లి కొడుకు.
ఒక కొత్త పెళ్లి కూతురు పుష్ప గుచ్చం ను తన భుజాల పైనుండి ఏగారేస్తుండగా.
కెనడా మానిటోబా, విన్నిపెగ్ లో ఫిలిపినో పెండ్లి- పచ్చ వివాహం
- వివాహ వ్యూహకర్త
- ఆఫ్గన్ వివాహం
- ఐస్లాండిక్ వివాహాలు
- అయ్యర్ వివాహం
- మాప్ వివాహం
- పర్ష్యన్ వివాహం
- పంజాబీ వివాహ సంప్రదాయాలు
- సంప్రదాయక వియత్నమీస్ వివాహం
- ఉక్రెయినియాన్ వివాహ సంప్రదాయాలు
- ఇస్లాంలోని పెళ్లి మరియు వివాహ సంప్రదాయాలు
- భారతీయ వివాహ ఫోటోలు
- వ్యక్తిగత వివాహ వెబ్సైటు
- వివాహ ప్రమాణాలు
- పెళ్లి ఫోటోలు
- పెళ్లి వీడియో
- హనీమూన్
- బ్రహ్మచర్యం
- పవిత్రత
- ఆధ్యాత్మిక వివాహం
- స్వలింగ వివాహాలపై మతపరమైన వాదనలు
- బ్రహ్మచారుల పార్టీ
- వివాహ ప్రకటనలు
- నిశ్చితార్ఠం
- వివాహ సంబంధ జల్లులు
- వధువు అపహరణ
- వధువు వెల
- వధువు కార్యక్రమాలు
- వంట పదార్థాల బల్ల
- భరణం
- నిర్బంధ వివాహం
- మేయియాన్
- వివాహపూర్వ వాదన
- రిహార్సల్ విందు
- షాదీ
- మగ లేడి మరియు ఆడ లేడి
- పెళ్లిళ్ల రకాలు
- వివాహ వార్షికోత్సవం
- వివాహ విందు
- Category:Marriage, unions and partnerships by country
- Category:Marriage
- Category:Wedding
- పెండ్లి పదాల పదకోశం
- ↑ ఇక్కడికి దుముకు:1.0 1.1 ఓట్నిస్, సెలె మరియు ప్లేక్, ఎలిజబెత్ (2003). సిన్ద్రిల్ల డ్రీమ్స్: ది అల్లుర్ అఫ్ ది లావిష్ వెడ్డింగ్ , పే.31. కాలిఫోర్నియా యునివారసిటీ ముద్రణ, బెర్క్లి.
- పైకి దూకు↑ http://www.wowowow.com/post/judith-martin-white-weddings-49808
- పైకి దూకు↑ హొవార్డ్, వికి (2006). బ్రైడ్స్ Inc.: అమెరికన్ వెడ్డింగ్స్ అండ్ ది బిజినెస్ అఫ్ ట్రెడిషన్ , పే. 34. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ప్రెస్, ఫిలడెల్ఫియా.
- పైకి దూకు↑ హొవార్డ్, వికి (2006). బ్రైడ్స్ Inc.: అమెరికన్ వెడ్డింగ్స్ అండ్ ది బిజినెస్ అఫ్ ట్రెడిషన్ , పే. 61. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ప్రెస్, ఫిలడెల్ఫియా.
- పైకి దూకు↑ "Kilts: tightly woven into Scots culture". Scotsman. 2005-02-10. Archived from the original on 2007-02-02. Retrieved 2007-04-16.
- పైకి దూకు↑ "The Scottish Kilt". Visit Scotland. Retrieved 2007-04-16.
- పైకి దూకు↑ Jim Murdoch. "Scottish Culture and Heritage: The Kilt". Scotsmart. Retrieved2007-04-16.
- పైకి దూకు↑ బ్రిటాన్నికా ఆర్టికిల్: రిచార్డ్ వాగ్నర్
- పైకి దూకు↑ "African Wedding". African Holocaust Society. Retrieved 2009-01-04.
- పైకి దూకు↑ లండన్ వెడ్డింగ్ http://www.veilandtrain.com/veilandtrain_blog/how-can-i-have-a-real-east-end-wedding/
- ↑ ఇక్కడికి దుముకు:11.0 11.1 [13] ^ ఓల్మెర్ట్, మైకెల్ (1996). మిల్టన్స్ టీత్ అండ్ ఓవిడ్స్ అంబరిల్లా: క్యూరియూజర్ & క్యూరియూజర్ అడ్వెంచర్స్ ఇన్ హిస్టరీ, పే.48-49. సైమన్ & షుస్టెర్, న్యూయార్క్. ఐఎస్బీఎన్ 0-43-956827-7.
- పైకి దూకు↑ క్రుచ్జత వ్య్జ్వోలేనియా జ్లొవిఎక
- పైకి దూకు↑ Lepiej łyknij wody [Gazeta Wyborcza - DUżY FORMAT] Witold Szabłowski
- పైకి దూకు↑ brollopstorget.se > vigselakten (the wedding ceremony) Cite: I Sverige säger vanligvis inte prästen till när paret får kyssa varandra vilket de gör i de anglosaxiska länderna. Antagligen är det för att kyssen egentligen inte är tillhör svensk vigseltradition, men numera är det så starkt förknippat med vigseln att den svenska traditionen får stå åt sidan. మార్స్ 22, 2010న గ్రహింపబడినది]
- పైకి దూకు↑ brollopstorget.se > vigselakten (పెళ్లి శుభకార్యం) Cite: Det vanligaste nuförtiden i Sverige är att brud och brudgum går in i kyrkan tillsammans. మార్స్ 22, 2010న గ్రహింపబడినది]
- పైకి దూకు↑ కింకో, ఇటో (మార్చ్ 9, 2000) పెళ్ళిళ్ళతో ఆధునిక జపాన్: ఆచారకాండ చిత్రణం లో లింగము, వ్యక్తి, మరియు సమాజం. బ్లాక్వేల్ పుబ్లిషింగ్, EBSCOhost నుంచి 29, జనవరి 11 2009న సేకరించబడినది
- పైకి దూకు↑ లెబ్ర, T, సుగియామా (1984). జపనీస్ వొమెన్: కన్స్ట్రైన్ట్ మరియు ఫుల్ఫిల్మెంట్. హోనోలులు యునివారసిటీ అఫ్ హవాయి ప్రెస్, నెట్ లైబ్రరీ నుండి జనవరి 10, 2009న పొందబడినది
- పైకి దూకు↑ జపాన్ లో పాశ్చాత్య పద్దతిలో పెళ్లిళ్ళు
- ↑ ఇక్కడికి దుముకు:19.0 19.1 19.2 19.3 19.4 19.5 19.6 19.7 19.8 గోల్డ్ స్టైన్-గిడోని, O (2000, మార్చ్). ది ప్రొడక్షన్ అఫ్ ట్రెడిషన్ అండ్ కల్చర్ ఇన్ ది జపనీస్ వెడ్డింగ్ ఏంట్రప్రైస్. టేలర్ & ఫ్రాన్సిస్, 65, EBSCOhost నుంచి జనవరి 10, 2009న సేకరించబడినది.
- ↑ ఇక్కడికి దుముకు:20.0 20.1 మిస్ మన్నేర్స్ గైడ్ ఫర్ ది టర్న్-అఫ్-ది-మిల్లినియం, జుడిత్ మార్టిన్, 1990, పే.647, ISBN#0-671-72228-X
- పైకి దూకు↑ మిస్ మన్నేర్స్ గైడ్ టు ఏక్ష్క్రుసియాటింగ్లి కరెక్ట్ బెహేవ్యర్: కొత్తగా సవరించిన జుడిత్ మార్టిన్, 2007, పే. 414, ISBN 0-393-05874-3
- పైకి దూకు↑ Martin, Judith (1999). Miss Manners on weddings. New York: Crown Publishers. pp. 142–143. ISBN 0-609-60431-7.
- పైకి దూకు↑ అగైన్స్ట్ ది గ్రైన్
- పైకి దూకు↑ Post, Peggy (2006). Emily Post's wedding etiquette. London: Collins. p. 360. ISBN 0-06-074504-5.
- పైకి దూకు↑ Martin, Judith (1999). Miss Manners on weddings. New York: Crown Publishers. p. 22.ISBN 0-609-60431-7.
- పైకి దూకు↑ Martin, Judith (2005). Miss Manners' guide to excruciatingly correct behavior. New York: W.W. Norton & Co. p. 419. ISBN 0-393-05874-3.
- పైకి దూకు↑ Post, Peggy (2006). Emily Post's wedding etiquette. London: Collins. p. 344. ISBN 0-06-074504-5.
- పైకి దూకు↑ మిస్ మన్నేర్స్ గైడ్ ఫర్ ది టర్న్-అఫ్-ది-మిల్లినియం, జుడిత్ మార్టిన్, 1990, పే. 580
- పైకి దూకు↑ మిస్ మన్నేర్స్ గైడ్ ఫర్ ది టర్న్-అఫ్-ది-మిల్లినియం, జుడిత్ మార్టిన్, 1990, పే. 638
- పైకి దూకు↑ మిస్ మన్నేర్స్ గైడ్ ఫర్ ది టర్న్-అఫ్-ది-మిల్లినియం, జుడిత్ మార్టిన్, 1990, పే.587, ISBN#0-671-72228-X
- పైకి దూకు↑ మిస్ మన్నేర్స్ గైడ్ టు ఏక్ష్క్రుసియాటింగ్లి కరెక్ట్ బెహేవ్యర్: కొత్తగా సవరించిన జుడిత్ మార్టిన్, 2007, పే. 435, ISBN 0-393-05874-3
- పైకి దూకు↑ మిస్ మన్నేర్స్ గైడ్ ఫర్ ది టర్న్-అఫ్-ది-మిల్లినియం, జుడిత్ మార్టిన్, 1990, పే.643, ISBN#0-671-72228-X
- పైకి దూకు↑ Smith, Peter (2000). "Marriage". A concise encyclopedia of the Bahá'í Faith. Oxford: Oneworld Publications. pp. 232–233. ISBN 1-85168-184-1.
- పైకి దూకు↑ హొలీ స్పిరిట్ చర్చ్ లో చేస్తున్న పెండ్లి ఏర్పాట్లు
- పైకి దూకు↑ హిందూ వివాహ చట్టం
- పైకి దూకు↑ "Guide to the Jewish Wedding". Retrieved 2008-07-03.
- పైకి దూకు↑ "Nissuin: The Second of the Two Ceremonies". Retrieved 2008-07-03.
- పైకి దూకు↑ "Understanding the Jewish Wedding". Retrieved 2008-07-03.
- పైకి దూకు↑ "Ceremony: Jewish Wedding Rituals". Retrieved 2008-07-03.
- పైకి దూకు↑ "Marriage in Jewish Art". Retrieved 2008-07-03.
- పైకి దూకు↑ Reuters.com, మే 12, 2009 "డెస్టినేషన్ వెడ్డింగ్స్ సీ గ్రోత్ డిస్పైట్ రిస్సిషన్", మే 25, 2010న సేకరించబడినది.
వికీపీడియా నుండి
|
|
ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల
నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ
అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే
అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి
వ్యాసాన్ని వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో చేర్చండి.
|
|
|
వివాహం (పెళ్లి) అనేది ఒక కార్యక్రమం. ఈ పెళ్లి తంతు ద్వారా లేదా ఒక సత్రంలో ఇద్దరు వ్యక్తులు ఒక్కటవుతారు.
వివాహ సంప్రదాయాలు మరియు ఆచారాలు అనేవిసంస్కృతులు, జాతులు, మతాలు, దేశాలు మరియు సామాజిక వర్గాలలో చాలా వరకు
భిన్నంగా ఉంటాయి. అనేక వివాహ మహోత్సవాల్లో వధూవరుల జంట పరస్పరం వివాహ ప్రమాణాలు
చేసుకోవడం, కానుకలు (ఉంగరాలు తొడగటం, ప్రతీకాత్మక వస్తువులు, పుష్పాలు, నగదు
ఇవ్వడం) సమర్పించడం మరియు వివాహానికి సంబంధించిన ప్రకటనను పురోహితుడు బహిరంగంగా
వెల్లడించడం జరుగుతుంటాయి. ప్రత్యేక వివాహ దుస్తులు (పెళ్లి బట్టలు) తరచూ
ధరిస్తుంటారు. కొన్నిసార్లు ఈ ఉత్సవం తర్వాత పెళ్లి విందు (రిసెప్షన్-పెళ్లి
తర్వాత మగ పెళ్లివారు ఇచ్చే విందు) ఉంటుంది. ఈ వేడుక సందర్భంగా కొందరు ఐచ్ఛికంగా
పాటకచేరి ఏర్పాటు మరియు ప్రార్థనలు చేయడం లేదా పవిత్ర గ్రంథాలు లేదా సాహిత్యం
నుంచి మంత్రాలు పఠించడం జరుగుతుంది.
విషయ సూచిక
అసంఖ్యాక సంస్కృతులు సంప్రదాయక
పాశ్చాత్య ఆచారమైన శ్వేత వివాహంను అవలంభించాయి. ఇందులో వధువు తెలుపు రంగు
దుస్తులు మరియు మేలిముసుగు ధరిస్తుంది. ఈ సంప్రదాయం విక్టోరియా మహారాణి వివాహం
ద్వారా బాగా ప్రాచుర్యం పొందింది. విక్టోరియా రాణి శ్వేత గౌనును ఎంపిక చేసుకోవడం
దుబారా ఖర్చు అని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే లింగ పవిత్రతను స్పష్టంగా
తెలియజేసే ఆమె విలువల ద్వారా అది ప్రేరణ పొంది ఉండొచ్చు.[1] ఆధునిక శ్వేత వివాహ సంప్రదాయంలో ఒక మహిళ యొక్క ద్వితీయ లేదా
తదుపరి వివాహానికి తెలుపు రంగు దుస్తులు మరియు మేలిముసుగు అనేవి అసాధారణ ఎంపికలు.
అయితే తెలుపు గౌను లింగ పవిత్రతను సూచిస్తుందనే అభిప్రాయం దూరమైంది. జుడిత్
మార్టిన్ వంటి శిష్టాచార రచయితలు దీనిని ప్రమాదకరమైనదిగా విమర్శించారు.[2]
వివాహ ఉంగరాల వినియోగం అనేది
ఐరోపా మరియు అమెరికాల్లోని సంప్రదాయక వివాహాల్లో చాలాకాలంగా భాగంగా ఉంది. అయితే ఈ
సంప్రదాయానికి సంబంధించిన మూలం మాత్రం స్పష్టం కాలేదు. విక్కి హోవార్డ్ వంటి
చరిత్రకారులు ఈ సంప్రదాయం యొక్క పురాతన ధర్మంపై విశ్వాసం చాలా వరకు ఒక ఆధునిక
నవకల్పన అని అభిప్రాయపడ్డారు.[3] "రెండు ఉంగరాల" కార్యక్రమం కూడా ఒక ఆధునిక
సంప్రదాయమే. 20వ శతాబ్దం వరకు కూడా వరుడి పెండ్లి మేళం కన్పించేది కాదు.[4]
వివాహం తర్వాత తరచూ రిసెప్షన్ (పెండ్లి
తర్వాత వరుడు ఏర్పాటు చేసే విందు కార్యక్రమం) ఉంటుంది. ఇందులో కొత్తగా పెళ్లి
చేసుకున్న జంటకు అభినందనలు తెలపడం, భార్యాభర్తలుగా వారి మొదటి నృత్యం మరియు వివాహ
కేకును కోయడం వంటి ఆచారాలు ఉంటాయి.
బ్రాహ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక
వనం జ్వాలా నరసింహారావు
"వివాహం"
ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని, ధర్మ
బద్ధం చేయడానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం
ప్రాతిపదికగా, అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా
రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య
నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు
మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై, సమాజానికి మేలు చేసే
దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం".
దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు.
వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి, భవిష్యత్ దంపతులుగా, కష్ట-సుఖాలను సమంగా
పంచుకుంటూ, జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా
తెలియపర్చుకోవడమే పరిణయం.
"పెళ్ళి చూపుల" సాంప్రదాయం
పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో, ఇరు
పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన "పెళ్లి పెద్దలు" సంధాన కర్తలుగా
వ్యవహరించి, కాబోయే వియ్యంకుల మధ్య రాయభారాలు చేసి, ఒప్పించి, కార్యక్రమానికి
నాంది పలుకుతారు. "పెళ్ళి చూపుల" సాంప్రదాయం ప్రకారం అబ్బాయికి చెందిన
వారు బంధు-మిత్ర-సపరివార సమేతంగా అమ్మాయి ఇంటికి వెళ్ళి, అమ్మాయిని చూస్తారు.
వధూవరులు పరస్పరం నచ్చాక, ఇరువురి ముఖ్య బంధువులు వరుడి ఇంట్లో సమావేశమవుతారు.
పరస్పర సంప్రదాయాలు-కుటుంబ పద్ధతులు-ఆచార వ్యవహారాలు చర్చించుకుంటారు. వరకట్న
నిషేధం లాంటివి అమల్లో వున్నప్పటికీ, సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రులు
కట్న కానుకలు, ఇచ్చి-పుచ్చుకోవడాలు, లాంఛనాలు, ఆభరణాలు లాంటివి మాట్లాడుకున్న
తరువాత, అన్నీ కుదిరాక, నిశ్చితార్థపు తేదీ నిర్ణయించుకుంటారు.
నిశ్చితార్థం
వివాహంలో ముఖ్యమైన ఘట్టాలలో మొదటిది వాగ్ధానం. అంటే: పెళ్ళి
ఖాయపరచుకోవడం (నిశ్చితార్థం). తర్వాత వర-వరణం. అంటే: వరుడిని లాంఛనప్రాయంగా
అంగీకరించడం. నిశ్చితార్థానికే మరోపేరు "నిశ్చయ తాంబూలం". వైదిక
మంత్రాల మధ్య వివాహ ప్రక్రియకు పెద్దల ఆశీస్సులు తీసుకోవడానికే ఈ కార్యక్రమం.
అందరికీ ఆమోదయోగ్యమైన శుభ ముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి
ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించిన తదుపరి, వధూవరుల తల్లి-తండ్రులు లగ్న
పత్రికలు, తాంబూలాలు మార్చుకుంటారు. పెళ్ళి ఒప్పందం లాంటి ఈ వేడుక వధువు
ఇంటిలోగాని, వారేర్పాటుచేసుకున్న వసతి గృహంలోగాని జరుగుతుంది. దీన్నే ఇప్పుడు
"ఎంగేజ్ మెంట్" అంటున్నారు. కొందరు ఇటీవలి కాలంలో ఈ తంతును పెళ్లికంటే
ఘనంగా జరుపుకుంటున్నారు. నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు
మార్చుకోవటంతో సగం పెళ్ళి జరిగినట్టు గానే భావిస్తారు. సాంప్రదాయ బద్ధంగా,
వధూవరుల తలిదండ్రుల మధ్యన ఇచ్చి-పుచ్చుకోవడాలు అందరి ఇళ్లల్లో ఒకే రకంగా వుంటాయి.
తాహతును బట్టి కొంచెం మార్పులు-చేర్పులు వుండొచ్చు. ఇరుపక్షాల వాళ్ళు
మరిచిపోవడానికి ఆస్కారం లేకుండా, అరమరికలు లేకుండా, ఒక కాగితం మీద
ఇచ్చి-పుచ్చుకోవడాలకు సంబంధించిన వివరాలన్నీ రాసుకోవడం కూడా సంప్రదాయమే.
ఆడ పెళ్లివారిచ్చేవి- మగ పెళ్లివారిచ్చేవి
సాధారణంగా ఆడ పెళ్లివారిచ్చేవి-విధిగా ఇవ్వాల్సినవి: స్నాతక
ద్రవ్యాలు, వరుడి ధోవతులు, మధు-పర్కాలు (వరుడుకి ఇవ్వాల్సిన బట్టలు), ఉత్తర
జంధ్యాలు, భటువు, కాళ్లుగడిగే పళ్లెం-బిందెలు, కల్యాణ వేదికపై వరుడిని కూచోబెట్టే
చిన్న బల్ల, వివాహంలో వివిధ సందర్భాలలో (స్థాళీపాకం, నాగవల్లి, సదశ్యం,
అప్పగింపులు, మేజువాణి లాంటివి) వరుడికి పెట్టాల్సిన బట్టలు (ధోవతులు, పట్టు
బట్టలు, సూట్, పాంట్-షర్ట్ లు లాంటివి), వరుడివైపు బంధువులకు పెట్టాల్సిన బట్టలు,
అప్పగింతల బట్టలు, పెళ్ళైన తర్వాత మగ పెళ్ళివారింట్లో గృహప్రవేశం సందర్భంగా-సత్యనారాయణ
వ్రతమప్పుడు వధూ-వరులకు పెట్టవలసిన బట్టలు, ఆడ బిడ్డలకు-అత్తగారికి
ఇవ్వదల్చుకున్న లాంఛనాలు, పెళ్ళి కూతురుకు ఇచ్చే సారె (సారె పెట్టెలో పెట్టాల్సిన
వస్తువులు-ఏభై ఒక్క కొబ్బరి చిప్పలు, ఐదు రవికె గుడ్డలు, రెండుంపావు కిలోల
శనగ-సున్నిపిండి, కిలోంబావు పసుపు-అందులో సగం కుంకుమ, చీరె-ధోవతులు, ఐదు రకాల
తీపి పదార్థాలు) ముఖ్యమైనవి.
సాధారణంగా మగ పెళ్లివారిచ్చేవి-విధిగా ఇవ్వాల్సినవి: స్నాతకంలో
బావమరిదికి పెట్టాల్సిన బట్టలు, పెళ్ళి కూతురుకు పెట్టాల్సిన పట్టు చీరెలు-ఇతర
చీరెలు, నగలు-ఆభరణాలు, నల్లపూసలు, పుస్తె (ఒకటి పుట్టింటి వారు, ఇంకొకటి
అత్తగారింటి వారు ఇవ్వాలి), మెట్టెలు, ముత్తవుతల్లి (వధువు అమ్మమ్మ) కిచ్చే
కట్నం, వధువు తల్లి కడుపు చీరె-తండ్రికి బట్టలు, ప్రధానపు వుంగరం లాంటివి.
ముహూర్త నిశ్చయం
వధూవరుల తారా బలం-చంద్ర బలం చూసి ముహూర్తం నిశ్చయిస్తారు.
"పెళ్లినాటి ప్రమాణాలు" భవిష్యత్ లో దంపతులు తు. చ తప్పకుండా అమలు
చేయాలంటే "ముహూర్త బలం" ముఖ్యమని హిందువుల నమ్మకం. నిశ్చితార్థంలో
ప్రధానంగా విఘ్నేశ్వరుడి పూజ వుంటుంది. వివాహ ప్రక్రియ ఆసాంతం విఘ్నాలు లేకుండా
చూడమని ఆయన్ను పూజించడం ఆనవాయితి. నిశ్చితార్థానికి ముందు బంధువుల
సమక్షంలో-పరోక్షంలో వధూవరుల తల్లి-తండ్రుల మధ్య కుదిరిన ఇచ్చి-పుచ్చుకునే ప్రతి
చిన్న అంశం ఒక కాగితం మీద రాసుకోవడం కూడా సాంప్రదాయంలో భాగమే. ఇదంతా
"ఆచారం-పద్ధతి". పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతోంటే పెళ్లి సరంజామా కొనడం
అనేది ఇరు పక్షాల వారికి కూడా పెద్దపని. పట్టుచీరలు, బంగారు ఆభరణాలు, నూతన
వస్తువులు.. .. ఎన్నో కొంటారు. నిర్ణయించబడిన ముహూర్తానికి వరుని తరపువారూ, వధువు
తరపువారూ వారి వారి కులాచారానుసారం "శుభ లేఖలు"గా పిలువబడే
ఆహ్వానపత్రికలు ముద్రించుకుంటారు. మంగళ సూచకంగా లేఖకు నాలుగు వైపులా పసుపు
పూస్తారు. బంధుగణాన్ని పిలుచు కోవడం పెళ్లిళ్లలో సర్వ సాధారణం. ఎక్కడెక్కడో ఉంటూ,
అరుదుగా కలిసే చుట్టపక్కాలతో సహా బంధువులందరూ కలుసుకోగలిగే "సామాజిక ఏర్పాటు"
పెళ్ళిళ్లు. ఆ కలయికలకు వేదికగా పెళ్ళి వారి ఇల్లు (కల్యాణ మంటపం) మారిపోతుంది.
ఎంత శ్రద్ధ తీసుకుని, అందరికీ "శుభ లేఖలు" పంపించే
ఏర్పాటుచేసినప్పటికీ, ఆఖరు నిమిషంలో, ఒక్కోసారి ముఖ్యమైన వారితో సహా కొందరిని
మరిచిపోవడం సహజంగా జరుగుతుంది. వాళ్లకు కోప-తాపాలు కూడా వస్తాయి. కాకపోతే
వచ్చినంత త్వరగా తగ్గిపోతాయి కూడ. ఇవన్నీ సర్వసాధారణంగా ప్రతి
పెళ్లిలోనూ-ప్రతివారింటిలోనూ జరిగే మామూలు విషయాలే. ఆ చిరు కోపాలు రాకుంటే పెళ్ళి
శోభ రానట్లే.
"స్నాతకం"
పెళ్లిరోజుకు ఒకరోజు ముందర "స్నాతకం" అనే ముఖ్యమైన
కార్యక్రమం జరుపుకోవడం ఆచారం. పెళ్ళి కుమారుడి ఇంటిలో గాని, కళ్యాణ మండపంలో గాని
లేదా విడిదిలో గాని పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర
పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ది కోసం బ్రాహ్మణులు
వరుడితో గోత్ర ప్రవరలు చేయిస్తారు. స్నాతకం అనే ఈ "సంస్కారం",
ప్రధానంగా, వరుడిని "బ్రహ్మచర్యం" నుండి "గృహస్థాశ్రమం"
స్వీకరించడానికి సిద్ధంచేస్తున్న కార్యక్రమం. గురువు (ఇక్కడ పురోహితుడు) ఆదేశంతో-అంగీకారంతో
"గృహస్థాశ్రమం" స్వీకరించే ఏర్పాటిది. ఆ సమయంలో గురువు చేయాల్సిన హిత
బోధ తైత్తిరీయోపనిషత్తులోని "సత్యాన్న..." అన్న ఒక శ్లోక రూపంలో
వుంటుంది. "సత్యం విషయంలోను, ధర్మం విషయంలోను, తెలివితేటల విషయంలోను,
పొరపాటు పడవద్దు" అన్న ఆదేశం అది. తల్లిని, తండ్రిని, అతిథిని దేవుడులా
భావించాలని చెప్తారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా జీవించమని, దానం చేసేటప్పుడు
శ్రద్ధగా చేయమని, తాహతుకు మించి దానం చేయొద్దనీ-ఇంతకంటె ఎక్కువ దానం
చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నానని భావించమనీ బోధిస్తాడు పురోహితుడు.
పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని-వారనుసరించిన మార్గాన్ని ఎంచుకోమని
అంటూ, "వరుడికి శుభం కలుగుగాక" అని ఆశీర్వదించి గురువు వరుడిని
గృహస్థాశ్రమానికి సిద్ధం చేస్తాడు. హిందూ వివాహ సంప్రదాయ పద్ధతిలో భారతీయ ఆలోచనా
విధానాన్ని తెలియచేస్తాడు పురోహితుడిక్కడ. స్నాతకానికి "సమా వర్తనం"
అన్న పేరు కూడా వుంది. సమా వర్తనమంటే, తిరిగి రావడమని అర్థం. విద్యాభ్యాసం పూర్తి
చేసుకొని, గురువు హిత బోధతో పాదయాత్ర చేస్తూ తిరిగి రావడాన్నే సమా వర్తనం అంటారు.
కాశీ యాత్ర, హోమ కార్యాలు నిర్వర్తించి, దండాన్ని ధరించి, గొడుగు పట్టుకొని కాశీ
యాత్రకు బయలుదేరే ఘట్టం సాంప్రదాయంలో మరో ముఖ్యమైన ఆచారం. కాశీ ప్రయాణం - బాజా
భజంత్రీల మద్య వరుడు గొడుగు పట్టుకొని, చేత్తో కర్ర పుచ్చుకొని, కాళ్లకు పావు
కోళ్లు ధరించి, మెడలో పసుపు బట్టను వేసుకొని, సన్యాసం స్వీకరించేందుకు, కాశీకి
పోతున్నానని చెప్పి బయలు దేరుతాడు. వధువు సోదరుడు వచ్చి "అయ్యా,
బ్రహ్మచారిగారూ! మీ కాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసుకొని
గృహస్థుగా జీవించండి" అని చెప్పి బొట్టు పెట్టి,బెల్లం (తీపి పదార్థం)
నోటికి రుచి చూపించి, నూతన వస్త్రాలను ఇచ్చి వెనుకకు తీసుకొని వస్తాడు.
కాశీ యాత్ర
కాశీ యాత్ర ఘట్టం స్నాతకంలో చాలా సరదాగా జరిగే కార్యక్రమం. తన శేష
జీవితం ఇక కాశీలో గడపాలని భావిస్తున్నానని, దానికి బంధు-మిత్రుల అనుజ్ఞ కావాలని
వరుడు కోరతాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం సరైందికాదని, గృహస్థాశ్రమం
స్వీకరించి, ధర్మ భద్ధంగా ఇంద్రియ సుఖాలను అనుభవించి, పరిపూర్ణమైన వైరాగ్యం
కలిగిన తర్వాతనే భార్యా సమేతంగా వానప్రస్థాశ్రమంలో ప్రవేశించాల్సిందిగా
పురోహితుడు (గురువు) హితవు పలుకుతాడు. ఇక పెళ్ళి కూతురు వైపునుంచి వచ్చిన వారు
(బావ మరిది-మేన మామ-తాత గారు లాంటి వారు) "బంగారు ఆభరణాలతో అలంకరించబడిన వారి
"అమ్మాయి" నిచ్చి వివాహం చేద్దామనుకుంటున్నామని, అగ్ని సాక్షిగా అమెను
వివాహమాడమని, ముందుగా తమ ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని వరుడికి నచ్చచెప్పి,
కాశీ యాత్ర ఆలోచనను విరమింపచేసే ఘట్టం ఇది. చాలా కోలాహలంగా పెళ్ళికి "తరలి
పోయే ముందర" జరిగే సరదా కార్యక్రమం ఇది. ఇలా స్నాతకం వ్రతాన్ని పూర్తి
చేసుకొని, వరుడి బంధు-మిత్రులందరు వధువు గృహానికి (వసతి గృహానికి) బయలుదేరుతారు.
బయలుదేరే ముందు, మంగళ స్నానాలు చేయడం, అలంకరించు కోవడం, పల్లకి లాంటి వాహనాలు
సిద్ధం చేసుకోవడం మామూలే. బయలుదేరే ముందర, శుభకార్యానికి బయలుదేరుతున్నామని,
వెనక్కు పిలవడం – నిందించడం - దగ్గడం, తుమ్మడం లాంటివి లేకుండా వుండాలన్న అర్థం
వచ్చే మంత్రాన్ని చదువుతారు.
పెళ్ళికొడుకును-పెళ్ళికూతురును చేయడం
పెళ్ళికి ముందర ఒక మంచి రోజున గానీ, స్నాతకం-అంకురార్పణల రోజున గానీ
పెళ్ళికొడుకును-పెళ్ళికూతురును చేయడం ఆచారం. మంగళ స్నానాలతో ఆ ఉదయం కార్యక్రమం
మొదలవుతుంది. వధూ-వరుల ఇళ్లలో, ఉదయం తెల-తెలవారుతుండగానే, మంగళ వాయిద్యాల మధ్య
ఇంటి ముందర మామిడి ఆకులతో తోరణం కట్టే కార్యక్రమం ముందుగా జరుగుతుంది. వధువుకు,
కన్యా దాత దంపతులకు, తోటి పెళ్ళి కూతురుకు (వధువు సొంత చెల్లెలు గాని, వరుసకు
చెల్లెలు గాని), తెల్లవారక ముందే, ముత్తైదువలు బొట్టు పెట్టి, మాడుపై నూనె అద్ది,
హారతిచ్చి, మంగళ స్నానాలకు సిద్ధం చేస్తారు. అలానే వరుడికి, తల్లి-తండ్రులకు,
తోటి పెళ్ళికొడుకుకు (వరుడి సొంత తమ్ముడు గాని, వరుసకు తమ్ముడు గాని) కూడా
జరుగుతుంది. స్నాతకం చేసుకున్న నాడే, లాంఛనంగా అక్కడ కన్యా దాత ఇంట్లో, వధువుని
"పెళ్ళికూతురు" చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ముందు-వెనుకల కూడా
జరగొచ్చు. అంకురార్పణగా పిలిచే ఆ వేడుకకు కన్యా దాత దగ్గరి బంధువులందరూ వస్తారు.
నవ ధాన్యాలను మట్టి మూకుళ్లలో పుట్ట మన్నులో కలిపి మొలకెత్తే విధంగా అమర్చడాన్ని
"అంకురార్పణ" లో చేస్తారు. స్నాతకం చేసుకున్న రోజునే మగ పెళ్లివారు ఆడ
పెళ్ళివారి వూరికి తరలి పోతారు. ఒక్కోసారి అక్కడకు పోయి స్నాతకం చేసుకుంటారు.
విడిది మర్యాదలు
మగ పెళ్ళి వారు విడిదికి చేరుకోగానే, అప్పటికే వారికొరకు ఎదురు
చూస్తున్న ఆడ పెళ్లి వారు, "ఎదురు కోలు" పలికే ఆచారం సరదాగా-సందడిగా
జరుపుకునే మరో వేడుక. విడిదిలో ఏర్పాట్లన్నీ పూర్తి చేసి (సబ్బులు, పేస్టులు,
బకెట్లు, తుండు గుడ్డలు, వేడి నీళ్లు లాంటివి) ముందు (హాలులో) భాగంలో పెద్ద
తివాచీ లాంటిది పరిచి ఎదురు చూస్తుంటారు ఆడ పెళ్ళి వారు. మేళ-తాళాలతో ఆహ్వానించి
కాబోయే అత్తగారు, మామ గారు, వారి సమీప బంధువులు ఎదురుకోలలో భాగంగా, విడిదిలోకి
ప్రవేశించే ముందర కాళ్లు కడుక్కోవడానికి మగ పెళ్ళి వారందరికీ నీళ్లిస్తారు.
పెళ్ళికొడుకు ఆ పనిని బావమరిదితో చేయిస్తారు. ఈ కాళ్లు కడగడమనేది రెండు-మూడు
పర్యాయాలు జరిపే వ్యవహారం. ఆ తర్వాత అందరికీ కాఫీ-పలహారాలిచ్చి మర్యాదలు చేసి,
స్నానాలు ముగించుకొని సిద్ధంగా వుంటే, భోజనాలకు తీసుకెళ్తామంటారు. లేదా అక్కడే
ఏర్పాటు చేస్తారు. వివాహం ముహూర్తం నాడు పెళ్లికి ముందు-పెళ్ళిలో-పెళ్లైన తర్వాత
చేయాల్సిన కార్యక్రమాలెన్నో వున్నాయి. తెలుగు వారి పెళ్ళిళ్లలో ఉండే సందడి,
సంతోషం ఎంత మోతాదులో వుంటుందో ఎవరూ చెప్పలేరు. సకుటుంబ పరివార సమేతంగా, బాజా
భజంత్రీల నడుమ, సంతోషంగా జరిగే ఆ కళ్యాణ మహోత్సవం అందరి జీవితాలలో ఒక మరవలేని
సంఘటన. కొందరు కల్యాణ మండపాలను వాడితే మరికొందరు వాడరు. సాధారణంగా పల్లెటూర్లలో
కొబ్బరి ఆకుల పందిరి వేయడం వలన మండపం ఆవశ్యకత తగ్గింది. పట్టణాలలో టిప్ టాప్
పందిరి మండపాలు తప్పని సరిగా వాడటం జరుగుతుంది.
గౌరీ పూజ-వర పూజ- మధు పర్కం
ఒక వైపు వధువు గౌరీ పూజ, మరో వైపు వరుడున్న విడిదిలో వర పూజకు
సన్నాహాలు మొదలవుతాయి. హిందూ సంప్రదాయం ప్రకారం వధువుని
"లక్ష్మి,పార్వతి,సరస్వతి"ల ఉమ్మడి రూపంగా భావిస్తారు. పచ్చదనంతో
లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి ప్రతిరూపంగా వధువుని అలంకరిస్తారు. ఇక వరుడిని
త్రిమూర్తుల దివ్యస్వరూపంగా, విధాత చూపిన విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు
సిద్ధమైన సిద్ధ పురుషుడుగా భావిస్తారు. వధువుకు నలుగు స్నానం చేయించి,
పెళ్ళికూతురుగా అలంకరించి, కళ్యాణం బొట్టు దిద్ది, పాదాలకు పారాణిని పూసి, పూల జడ
వేసి, నూతన వస్త్రాలను కట్టించి (పట్టు చీరె) "గౌరీ పూజ" కు
తీసుకెళ్తారు. గౌరీ పూజకు వధువుని సిద్ధం చేస్తూనే, వర పూజ కొరకు విడిదికి
వెళ్తారు ఆడ పెళ్ళి వారు. కన్యా దాత మేళ తాళాలతో, పానకం బిందెలతో, కొత్త బట్టలతో
వచ్చి మగ పెళ్ళి వారికి స్వాగతం పలికే వేడుక ఇది. పానకం వరుడికి ఇచ్చి రుచి
చూపించి తరువాత బంధువులందరికీ ఇస్తారు. వరపూజలో భాగంగా, ఆడ పెళ్ళి వారు-వారి వైపు
బంధువులు వచ్చి, వివాహం చేసుకోవడానికి రమ్మని మగ పెళ్ళివారిని ఆహ్వాని్స్తారు.
వరపూజలోనే ఇరువైపువారు, ఒకరినొకరు లాంఛనంగా ఆహ్వానించు కోవడానికి
"శుభలేఖలు" మార్చుకుంటారు. వరపూజ కార్యక్రమం జరుగుతుండగానే, కన్యా దాత
ఇంట్లో, వధువు గౌరీ పూజ సమాంతరంగా కొనసాగుతుంటుంది. మగ పెళ్లివారందరు కన్యా దాత
ఇంటికి చేరుకునే సమయానికి, వధువు గౌరీ పూజ ఇంకా కొనసాగుతూనే వుంది. ఇది
ఆచారం-సాంప్రదాయం. బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమాన్ని పొందేందుకు కన్యా
వరణానికి వచ్చే వరుడికి ఎదురేగి "నాయనా నా కుమార్తెను భార్యగా స్వీకరించి
కలకాలం వర్ధిల్ల” మని కన్యా దాత దీవించే కార్యక్రమంతో వివాహ మండపం వద్ద జరగబోయే
వేడుక మొదలవుతుంది. హిందూ వివాహ సంప్రదాయం ప్రకారం, "నారాయణ స్వరూపుడైన
వరుడికి" పాద ప్రక్షాళన లాంటివి జరిపించి, కన్యా దాత ఆతిధ్యం ఇస్తారు.
దీనినే "మధు పర్కం" అని పిలుస్తారు. మధుపర్కం: మధువు అంటే తేనె.
కుమార్తెకు భర్తగా వరుడి ఎంపిక తరువాత అతను వధువు తల్లి-తండ్రికి
సంప్రదాయాన్ననుసరించి పుత్ర సమానుడౌతాడు. వివాహానంతరం "మధుపర్కం" అంటే
తీయటి పానీయం అని అర్ధం. మధు పర్కాలుగా ఇచ్చిన నూతన వస్త్రాలను ధరించి వరుడు
వివాహ వేదిక మీద జరగాల్సిన వేడుకకై వేచి వుంటాడు. వరుడు ఆ పనిలో వున్నప్పుడు,
తర్వాత కార్యక్రమం జరిపించడానికి, కన్యా దాత వరుడు నాన్న గారిని తీసుకొని వధువు గౌరీ
పూజ చేస్తున్న చోటుకెళ్తారు.
గోత్రం-ప్రవర
గౌరీ పూజ జరిగే చోట ఒక్క సారి, లాంఛనంగా, ఇరు పక్షాల వారి
గోత్రం-ప్రవర చెప్పే కార్యక్రమం, పురోహితుల చాతుర్యాన్ని బట్టి అత్యంత
ఆసక్తికరంగా-విన సొంపుగా వుంటుంది. "గోత్రం" అంటే వంశం,
"ప్రవర" అంటే ఆ వంశం మూల పురుషుల సమాచారం. మీ అమ్మాయిని, మా అబ్బాయికి
ఇచ్చి వివాహం జరిపించమని వరుడి తండ్రి, కన్యా దాతను కోరడమే ఈ వేడుక ముఖ్య
ఉద్దేశం. "చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శ్శుభం భవతు-…. …. ….
త్రయార్షేయ ప్రవరాన్విత యజుర్వేదినే, తైత్తిరీయ శాఖాధ్యాయినే, ఆపస్తంబ సూత్రిణే,
….. …. శర్మణో నప్త్రే, …. … శర్మణ పౌత్రాయ, … …. శర్మణ పుత్రాయ, .. … శర్మణే
వరాయ, భవదీయాం కన్యాం ప్రజాసహత్వ కర్మభ్యో వ్రణీమహే" ("మూడు ఋషులున్న
…… గోత్రం కలవాడూ, యజుర్వేదాన్ని అభ్యసించినవాడూ, ఆ వేదం ప్రకారం తన ఇంటి
కార్యక్రమాలను నడిపించేవాడూ, తైత్తరీయ శాఖను-ఆపస్తంబ సూత్రాన్ని అభ్యసించి
అనుసరించేవాడూ, … మునిమనుమడూ, …. మనుమడూ, …. పుత్రుడూ అయిన … అనే వరుడికి మీ
కూతురునిచ్చి వివాహం చేయమని అడగడానికి వచ్చాం") అని అడుగుతాడు. ఇలా వంశం
వివరాలు చెప్పడం వల్ల కన్యా దాత చివరివరకూ ఆలోచించుకునే అవకాశం వుందింకా. ఇవేవీ
తెలియకపోతే (అందరి సమక్షంలో), ఫలానావారి పిల్లవాడిని చేసుకున్నాం-ఇప్పుడు
అనుభవిస్తున్నాం అని భవిష్యత్లో అనవచ్చు. కన్యా దాత, వరుడి వివరాలు ముత్తాత తరం
దగ్గర నుండి విన్న తర్వాత, ఆ సంబంధం తనకి ఇష్టమైతే, వెంటనే తన వధువు (కూతురు)
వివరాలు కూడా చెప్పి అబ్బాయి తన కూతురుని చేసుకోమని అడుగుతాడు.
గంపలో వధువు-కాళ్లు కడగడం
గౌరీ పూజ దగ్గర గోత్రం-ప్రవరల వేడుక ముగిసిన పిదప, వధువు మేనమామలు
పెళ్ళి కూతురిని గంపలో కూర్చొబెట్టి వివాహ వేదిక పైకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా
చాలా సరదాగా వుంటుంది. ఇందులోనూ ఒకరకమైన సామాజిక స్పృహ కనిపిస్తుంది. తల్లి
తర్వాత మేనమామలు ముఖ్యమని తెలియచేయడమే దీని అర్థం. గంపలో ధాన్యం కూడా పోస్తారు.
కొబ్బరి బోండా మానసిక స్వచ్ఛతకు చిహ్నం. అలానే, అందులోని పీచులాగా, ఎల్లవేళలా
ఇరువురు విడిపోకుండా, అల్లుకు పోయి జీవిస్తామని-సత్ సంతానం కలవారమవుతామని సంకేతం
కూడ ఈ వేడుకలో వుందంటారు పెద్దలు. కళ్యాణ వేదిక పైన వున్న వరుడి కాళ్లు కడిగే
కార్యక్రమం, వివాహంలో, అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న మరో ముఖ్యమైన ఘట్టం.
కన్యాదాతేమో వయసులో పెద్ద-వరుడేమో చిన్నవాడు. అయినా కాళ్లు కడిగే ప్రక్రియ
వుందంటే దానికి సాంప్రదాయ బద్ధమైన అర్థం వుండి తీరాలి. కన్యా దాత వరుడి కాళ్ళు
కడుగుతున్నప్పుడు ఆయన తేజస్సు తరిగి పోకుండా పురోహితుడు ఒక మంత్రాన్ని
చెప్పుతాడు. "నా లోని తేజస్సు, శక్తి, కీర్తి, బలం సుస్థిరంగా
వుండుగాక" అన్న అర్థం వచ్చే మంత్రం అది. అది కన్యా దాత ఉచ్చరిస్తూ, ఇచ్చిన
"అర్ఘ్యాన్ని" (మంచి నీరు) స్వీకరిస్తాడు వరుడు. కన్యా దాత వరుడి
కాళ్ళు కడిగి నందువల్ల, చిన్నవాడైన వరుడు, తనలోని కాంతి తరిగిపోకుండా వుండేందుకు,
ఆచమనం చేసి, దానికి తగ్గ మంత్రాన్ని చదివిస్తారు. ఆచమనం చేస్తూ, వరుడితో, "
ఓ ఉదకములారా, మీరు నాకు గొప్ప కీర్తిని-పాడి పంటలను ఇచ్చి, అందరు ఇష్టపడేవాడిని
చేసి, రక్షించండి" అని చెప్పిస్తారు. వధువుని గంపలోనే వుంచి మహా సంకల్పంతో
ఆరంభించి, తర్వాత జరగాల్సిన వేడుక మొదలు పెట్తారు పురోహితులు. వధూవరులు
సాక్షాత్తు "లక్ష్మీ-నారాయణ స్వరూపులు" గా భావించుతారు కాబట్టి, ఆ
విధంగానే "లక్ష్మీ నారాయణుల కల్యాణం" లా జరిపించుతారు. "మహా
సంకల్పం" చెప్పడం, సృష్టి క్రమంతో మొదలుపెట్టి, పరమేశ్వరుడి
శక్తి-సామర్థ్యాలు అనంతమని-అచింత్యాలని, ఆయన అనుగ్రహంతోనే యావత్ సృష్టి జరిగిందని
కొనసాగింది. మానవుడి మేథస్సు ఊహించనలవికాని పరిమాణంలో వున్న ఈ జగత్తు, పరమేశ్వరుడి
ఆద్యంతాలు లేని రూపంలో ఒక అతి చిన్నదైందని పురోహితుడంటాడు. అఖిలాండ బ్రహ్మాండంలో,
అనేకానేక చిన్న-చిన్న గోళాలున్న ఖగోళంలోని అత్యంత సూక్ష్మమైన భూగోళంలో, భరత
ఖండంలో, మారు మూలనున్న మానవుడు, అణు పరిమాణంలో వున్న చిన్న భాగమని తెలియచేసే దే
మహా సంకల్పం. ఇది చెప్పడం ద్వారా, పరమాత్మ స్వరూపాన్ని ఎరుక పరిచి, మానవుడి
అహంకారాన్ని తగ్గించుకోమని, వినయ సంపదను పెంచుకోమని సూచించడం జరుగుతుంది.
మహా సంకల్పం
మహా సంకల్పం విశ్వ స్వరూపాన్ని, ఖగోళ స్థితిని చక్కగా వివరిస్తుంది.
భూమండలాన్ని పరిపాలించిన షోడశ మహారాజులు, షట్చక్రవర్తులు, సప్త ద్వీపాలు, నవ
వర్షాలు, నవ ఖండాలు, దశారణ్యాలు, యాభై కోట్ల విస్తీర్ణం గల జంబూ ద్వీపం, అందులో
భరత వర్షం-భరత ఖండం, దానిలో ఈ కన్యాదానం ఎక్కడ చేస్తున్నది కన్యా దాత
పేర్కొంటాడు. అలాగే బ్రహ్మ కాలమాన ప్రకారం యాభై సంవత్సరాలు పూర్వార్థం గడవగా,
యాభై ఒకటవ సంవత్సరంలో, మొదటి మాసంలో, మొదటి పక్షంలో, మొదటి పగటిలో బ్రహ్మకు
ప్రాణాయామ కాలం ప్రస్తుతం జరుగుతున్నట్లు చెప్పి తొమ్మిది కల్పాలలోని శ్వేత వరాహ
కల్పంలో, పద్నాలుగు మన్వంతరాలలో ఏడవదైన వైవస్వత మన్వంతరంలో-శాలివాహన శకంలో-ఇరవై
ఎనిమిదవ మహా యుగంలో-కలియుగంలో-ఫలానా సంవత్సరంలో-ఫలానా మాసంలో-ఫలానా తిది రోజున, ఈ
సుముహూర్త సమయంలో శ్రీ లక్ష్మీనారాయణ ప్ర్రీతి కోసం సర్వాలంకార భూషితైన ఈ కన్యను
దానం చేస్తున్నాను అని కన్యా దాత చెప్పే సంకల్పం ఇది. ఈ కన్యాదానం వల్ల తనకు
బ్రహ్మ లోకంలో నివసించే యోగ్యత సిద్ధించాలని, అగ్ని,స్తోమ, వాజపేయాది యాగాలు
చేసిన పుణ్య ఫలం లభించాలని, తనకు వెనుక- ముందు పది తరాల వాళ్ళు బ్రహ్మ లోకంలో
నివసించాలని కన్యా దాత సంకల్పం చేస్తాడు.
కన్యాదానం
ఇక ఆ తర్వాత, "కన్యా దానం" తంతు, అంటే,
ముహూర్తం సమయం దగ్గరపడుతున్నదని అర్థం. "కన్యాం కనక సంపన్నాం
కనకాభరణైర్యుతాం! దాస్వామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగీషియా" !! అన్న వాక్యాలు పురోహితుడి నోటి వెంట వస్తాయి. దీని అర్ధం-"ఈమె
బంగారం వంటి మనస్సు కలది. కనకం వంటి శరీర చాయ కలది. శరీరమంతా ఆభరణాలు కలిగినది. నా
పిత్రాదులు సంసారంలో విజయం పొంది శాశ్వత ప్రాప్తి పొందినట్టు శృతి వలన విన్నాను. నేనూ
ఆ శాశ్వత బ్రహ్మలోకప్రాప్తి పొందేందుకు విష్ణురూపుడైన నీకు నా పుత్రికను
కన్యాదానం చేస్తున్నాను" అని కన్యా దాత అంటారు. ఇంకా ఇలా చెప్పాలి కన్యా దాత:
" సమస్త ప్రపంచాన్ని, అఖిలాండ బ్రహ్మాండాలను భరించే శ్రీ మహావిష్ణువు-పంచభూతాల-సర్వ
దేవతల సాక్షిగా, పితృదేవతలను తరింపచేసేందుకు, ఈ కన్యను దానం చేస్తున్నాను. సౌశీల్యం
కలిగి, బుద్ధిమంతుడి వైన నీకు, ధర్మార్థ కామాలు సిద్ధించేందుకు, సాలంకృత
సాధ్వియైన ఈ కన్యను సమర్పించుకుంటున్నాను". ఇలా అంటూ, మామ గారు (కన్యా దాత)
(వరుడి) చేతిలో నీళ్లు పోసి మరో మాటంటారు. "నీకు దానం చేసినప్పటికీ, ఈ కన్య
నా కుమార్తే సుమా!" అని. ఇలా అంటూనే, "ధర్మేచ, అర్థేచ, కామేచ, ఏషా నాతి
చరితవ్యా" అని ప్రతిజ్ఞ చేయిస్తారు కన్యా దాత వరుడితో. దీనికి సమాధానంగా,
"నాతి చ రామి" అని వరుడితో చెప్పించాలి. సుముహూర్తం వచ్చేస్తున్నదనె
దీనర్థం.
"జీల కర్ర- బెల్లం"
వధూ-వరులను కళ్యాణ వేదికపై, తూర్పు-పడమర
ముఖంగా కూచోబెట్టి, మధ్య ఉత్తర-దక్షిణ ముఖంగా తెరను అడ్డం పెట్టి, ఇరువురి చేతికి
"జీల కర్ర- బెల్లం" కలిపిన ముద్దను ఇస్తాడు పురోహితుడు. పెళ్ళిచూపుల
కార్యక్రమం పూర్తి అయిన పిదప, అమ్మాయి-అబ్బాయిల జాతకాల ననుసరించి జ్యోతిష్యంలో
అనుభవమున్న పండితులతో పెళ్ళికి తగిన ముహూర్తం నిర్ణయించ బడుతుంది. వారు
నిర్ణయించిన ముహూర్తానికి వరుడు-వధువు ఒకరి తలపై ఇంకొకరు "జీలకర్ర-బెల్లం"
పెట్టడం జరుగుతుంది. నిజానికిదే సుముహూర్తం (జీల కర్ర-బెల్లం శిరస్సుపై వుంచడం). మంగళ
వాయిద్యాలు మోగిస్తుంటే, పురోహితుడు మంత్రాలు చదువుతుంటే, గౌరీ దేవిని
ధ్యానించుకుంటూ వధువు, వరుడు ఏక కాలంలో నిర్ణయించిన ముహూర్తానికి ఒకరి శిరస్సు
మీద మరొకరం (బ్రహ్మ రంధ్రం మీద) జీల కర్ర-బెల్లం కలిపిన ముద్దను వుంచుకుంటారు. సుముహూర్త
కాలంలో పెద్దల ఆశీర్వాదాన్ని పొందుతారు. పురోహితుడి తర్వాత, తల్లి-తండ్రులతో
మొదలయ్యి, పెద్దలందరూ అక్షితలు చల్లుతారు దంపతులు మీద. జీల కర్ర-బెల్లం ముద్దను
వధూవరులు పెట్టుతున్న సమయంలో, పురోహితుడు చదివిన మంత్రానికి, "వరుణుడు, బృహస్పతి,
మీకు శాశ్వతమైన స్థానాన్ని ఇచ్చెదరు గాక ! అగ్ని
దేవతలు మిమ్ములను దీవించెదరు గాక ! పంచభూతాలు
స్థిరంగా వుండు గాక ! ఈ సుముహూర్తం మీకు శుభ ముహూర్తం అగుగాక !" అని అర్థం వస్తుంది. జీల కర్ర-బెల్లం
మిశ్రమంలో పరస్పరాకర్షణ వుంటుందని మన పెద్దలు చెప్పడమే కాకుండా, శాస్త్రజ్ఞులు
కూడా అంగీకరించారు. ఇక వధూవరులమైన మేమిద్దరం, ఆ తర్వాత, సకల దేవతలకు నమస్కరించి,
"నూతన దంపతులమైన మా ఇరువురి ప్రేమానుబంధం చాలా గొప్పది. మా బంధాన్ని
పితృదేవతలు కూడా ఆశీర్వదించారు. వారి ఆశీస్సులతోనే మేం భార్యా-భర్తలం అయ్యాం. ఈ
శుభ సమయంలో బంధువులైన మీరందరూ ఆనందంగా వుండండి. వధువు బంధువులు కొద్దిగా మానసిక
ఆందోళనకు గురికావడం సహజమే" అని మంత్రాల ద్వారా పురోహితుడు అనిపిస్తాడు. ఇక
ఇక్కడినుంచి మాంగల్య ధారణ తంతు మొదలవుతుంది.
మాంగల్య ధారణ-తలంబ్రాలు
వివాహం అయినప్పటి నుంచీ, మహిళలు "మంగళ
సూత్రం" ధరించడం భారతీయ సంప్రదాయం-హిందువుల ఆచారం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళి
నాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం అనాదిగా వస్తున్నది. మంగళ సూత్రం అనే
శబ్దం సంసృతం నుండి పుట్టింది. సంసృతంలో 'మంగళ' అంటే శోభాయమానం అని, శుభప్రదం అనీ
అర్ధాలున్నాయి. సూత్రం అంటే తాడు ఆధారమైందని అని అర్థం. సాధారణంగా మంగళసూత్రాన్ని
సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన
తొమ్మిది లేదా పదకొండు దారాలతో (లేదా ఎవరెవరి ఆచారం ప్రకారం వారి పద్ధతిలో) తాళిని
తయారు చేస్తారు. మంగళ సూత్ర ధారణకు ముందు, మేనమామ గారు పెట్టిన "మధు పర్కం
చీరె" ను, వధువుతో ధరింపచేస్తారు. వధూవరులు ఇద్దరూ మధుపర్క ధారణతో మంగళ
సూత్ర ధారణ కార్య క్రమానికి సిద్ధమవడం ఆచారం. సమస్త శుభాలకు, మంగళ ప్రదమైన
కర్మలకు నిలయమైంది కాబట్టి, దీనికి, మంగళ సూత్రం అని పేరొచ్చింది. మంగళ సూత్రాలకు
గౌరీ దేవి అనుష్టాన దేవత. దీన్నే "శత మానములు" అని కూడా అంటారు. బంగారంతో
చేయబడ్తాయివి. రెండు సూత్రాలలో (శత మానములు) ఒకటి అత్తింటి వారు, ఇంకోటి
పుట్టింటి వారు చేయించడం ఆచారం. మంగళ వాయిద్యాలు మారుమోగుతుంటే, పురోహితుడు ""మాంగల్యం
తంతునానేనా మమజీవన హేతునా !
కంఠే మిద్నామి సుభగే త్వం జీవ
శరదాం శతం !!""
అని చదువుతుంటే, వరుడితో మంగళ
సూత్రాన్ని, వధువు మెడలో ధారణ చేయించుతారు, పురోహితుడు మూడు ముళ్లు వేయమంటారు. మూడు
ముళ్లంటే, మూడు లోకాలకు, త్రిమూర్తులకు, సత్వ-రజ-తమో గుణాలకు సంకేతం. చదివిన
మంత్రానికీ అర్థముంది-"ఓ సుందరీ ! ఈ మంగళ
సూత్రాన్ని, నీ మెడలో కడుతున్నాను. ఇది సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. నా జీవితం
దీనిపైనే ఆధారపడి వుంది. నీవు శతాయుర్ధాయం కలదానివిగా వుండు" అని. మంగళ
సూత్ర ధారణ అవుతూనే వేద పండితులు ఆశీర్వదించుతారు. "శతమానం భవతి, శతాయుః
పురుష !" అనే మంత్రాన్నీ చదువుతారు. అందుకే, వీటికి "శత
మానములు" అని పేరొచ్చింది. పుట్టినింటికి, మెట్టినింటికి గౌరవ మర్యాదలు-పరువు
ప్రతిష్టలు స్త్రీల వలనే లభిస్తాయి. పుట్టింట్లో పెరిగి, అత్తగారింటికి చేరి, బరువు-బాధ్యతలు
స్వీకరించిన స్త్రీకి పుట్టిల్లు-అత్త గారిల్లు రెండు కళ్ల లాంటివి. ఉభయ వంశాలకు
మంచి కీర్తిని చేకూర్చి పెట్టగలను అని తెలియ చేసేందుకే రెండు సూత్రాలను మహర్షులు
నిర్ణయించారని హిందువుల నమ్మకం. భర్త సుఖ దుఃఖాలు తనవేనని, పుట్టింటి-అత్తింటి
వారి మంచి-చెడులు తనవేనని, ధర్మ మోక్షాలు-అర్థ కామాలు తన సంబంధం ద్వారా భర్తకు
లభింప చేయనున్నానని, సంపదకు-సంతానానికి తనే కారణమవుతాననే విషయాలు ఎల్లవేళలా
గుర్తుండే విధంగా ప్రవర్తించడానికి మంగళ సూత్రాలను వధువు ధరిస్తుందని హిందువుల
నమ్మకం. మాంగల్య ధారణ అనంతరం అత్యంత కోలాహలంగా-ఇరువైపు బంధుమిత్రుల మధ్య పోటీలాగా
జరిగే తంతు వధూ-వరులు "తలంబ్రాలు" పోసుకోవడం. ఎందుకంటే, వధూవరులుతో
పాటు, బంధుమిత్రులకు కూడా చక్కటి వినోదాన్ని-ఆనందాన్ని కలిగించే కార్యక్రమం ఇది. మంగళ
సూత్ర ధారణ పూర్తైన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకోవడం హిందూ
సాంప్రదాయం. దీనిని అక్షతా రోహణం అని కూడా అంటారు కొందరు. 'క్షత' అంటే విరుగునది-'అక్షత'
అంటే విరగనిది. అంటే, "వివాహ బంధం" విడదీయరాని బంధం కావాలని భావం.
"తలన్+బ్రాలు" అంటే తల నుండి క్రిందికి జారేవి అని కూడా అర్థం. అర్థాలు
ఏవైనా, ఇదొక ఆనంద ప్రదమైన ఆచారం. వధూవరుల గృహస్థా శ్రమ జీవితం శుభప్రదంగా, మంగళ
ప్రదంగా వుండాలని "మంగళ ద్రవ్యాలతో" చేయించే పవిత్రమైన వైదిక ప్రక్రియ
ఇది. పసుపు-బియ్యం-నెయ్యి-ఆవు పాలు అనే మంగళ ద్రవ్యాలతో ఈ తంతు జరిపిస్తారు. కన్యను
దానం చేస్తున్నానని పలికేవాడు అగ్ని. తథాస్తు అనే వాడు వాయువు. దంపతులు చాలా
బాగున్నారని అనే వాడు చంద్రుడు. ఇవన్నీ నిజమే అని వంత పలికే వాడు-ఆనందించే వాడు
సూర్యుడు. ఇవన్నీ అర్థం వచ్చే రీతిలో పురోహితుడు చెపుతున్న మంత్రాల మధ్య, వరుడి
చేతితో కొబ్బరి చిప్పలో తీయించిన తలంబ్రాలు వధువు తలపైన మొదలు పోయిస్తారు. "నీవలన
నాకు సంతానం అభివృద్ధి చెందుగాక" అని వరుడితో అనిపించుతారు. దానికి వధువు
సమాధానం చెప్పకుండా, అంగీకార సూచకంగా, పురోహితుడు చెప్పిన పద్ధతిలో, వరుడి లాగనే
తలంబ్రాలు తీసుకొని, వరుడి శిరస్సుపై పోస్తుంది. మొదటిసారి అలా పోస్తున్నప్పుడు,
"పుట్టబోయే సంతానానికి పాల కొరకు" అన్న అర్థం వచ్చే రీతిలో, "నా
పశు సంపద అభివృద్ధి చెందుగాక" అని వధువుతో అనిపించుతారు. దీనికి అంగీకార
సూచకంగా వరుడు తలంబ్రాలు పోయాలి. ఇలా మూడు పర్యాయాలు ఇలాంటి అర్థస్ఫూర్తిగల
మంత్రాల చదువుతుంటే, వధూవరులు తలంబ్రాలు పోసుకుంటారు. చివరికి అదొక పోటీలాగా ఒకరి
శిరస్సుపై మరొకరు పోసుకోవడం ఇటీవలి కాలంలో ఆచారంగా మారింది. తలంబ్రాల పళ్లెం
ఎత్తి శిరస్సుపై కుమ్మరించడం కూడా పరిపాటై పోయింది. ఈ తంతు ముగిసిన తర్వాత,
"బ్రహ్మ ముడి" వేడుక జరుగుతుంది. వధువు చీరె కొంగు అంచును, వరుడి
ఉత్తరీయం అంచుకు కలిపి ముడివేస్తారు. బ్రాహ్మణుల ఆశీర్వచనాలను దంపతుల కొంగులలో
ముడి వేయడం అనే భావన వుందిందులో. ఇకనుంచి, ఇరువురు కలిసి-మెలిసి అన్ని
కార్యక్రమాలు నిర్వహించాలని, "ఇంటి యజమానురాలు" గా అన్ని బాధ్యతలు
స్వీకరించి, నీ ఇంటిని నువ్వే చక్కదిద్దు కోవడానికి రమ్మని, వేద మంత్రాల ద్వారా
వధువుని కోరుతాడు వరుడు.
స్థాళీపాకం-సప్తపది-నాగవల్లి-సదశ్యం
తలంబ్రాల కార్య క్రమం, బ్రహ్మ ముడి వేయడంతో
ఇక వధూవరులను వివాహ వేదిక పైనుంచి కిందికి దింపుతారు. సాధారణంగా గౌరీ పూజ
జరిపించిన చోటనో, లేకుంటే మరో అనువైన స్థలంలోనో, హోమం ఏర్పాటు చేసి స్థాళీపాకం
వేడుక జరిపిస్తాడు పురోహితుడు. ఇందులో భాగంగా హోమం దగ్గర అన్నం వండించే పని, ఆ
తర్వాత సప్తపది వుంటుంది. వివాహంలో సప్తపది అతి ముఖ్యమైన ఘట్టం. పరమ పావన మూర్తి
అగ్నిహోత్రుడి సాక్షిగా, అగ్నిహోత్రుడి చుట్టూ, పాణి గ్రహణం తర్వాత వధూవరులిద్దరు,
వధువు కుడి కాలి అడుగుతో ఆరంభించి, ఏడు అడుగులు వేయిస్తారు. దీనిని సప్తపది అని
అంటారు. వధువుతో కలిసి ఏడడుగులు వేస్తూ వరుడు, ఏడు కోరికలను వివరిస్తాడు. అనంతరం
వధువు తన అంగీకారాన్ని తెలియ పరుస్తుంది. ఇది గృహస్థా శ్రమ స్వీకారానికి పరమావధి.
సప్తపది పూర్తైన తర్వాతనే, వధువు గోత్రం-ప్రవర-ఇంటి పేరు, వరుడి గోత్రం-ప్రవర-ఇంటి
పేరు గా మారుతుంది. వధూవరులు కలిసి అడుగులు వేస్తున్నప్పుడు, భారతీయ-హిందూ
సాంప్రదాయ వివాహ విధానాన్ని, అందులోని గొప్పదనాన్ని విశదపరిచే మంత్రాన్ని
చదువుతారు. అందులో, "ఓ చిన్నదానా ! నీవు నన్ను
అనుసరించి నడువు. నీవు నడిచేటప్పుడు శ్రీ మహా విష్ణువు, మొదటి అడుగులో అన్నాన్ని-ఐశ్వర్యాన్ని,
రెండవ అడుగులో శారీరక-మానసిక బలాన్ని, మూడవ అడుగులో మంచి పనులు చేయాలన్న
సంకల్పాన్ని-ఉత్తమ కర్మనూ-శ్రద్ధనూ, నాలుగవ అడుగులో కర్మ ఫలాన్నీ-సుఖాన్నీ-ఆనందాన్నీ,
ఐదవ అడుగులో పశు సమృద్ధినీ-ధన ధాన్యాలనూ, ఆరవ అడుగులో మంచి సంతానాన్నీ, ఏడవ
అడుగులో ఇద్దరి ఆధ్యాత్మిక చింతనకు తగు రక్షణను మనకు కలిగించుగాక" అన్న
అర్థం స్ఫురిస్తుంది. వధువును అగ్నికి తూర్పునకుగానీ, ఉత్తరం నకుగానీ, ఏడు
మంత్రాలతో, ఏడు అడుగులు నడిపించుతున్న వరుడితో జపం-హోమం చేయించుతారు. ఇక్కడే
చెప్పిన మరో మంత్రంద్వారా వధూవరులిద్దరు, ఇకనుంచి స్నేహితులం అన్న అర్థం కూడా
వుంటుంది. "మన ఇద్దరం స్నేహితులం. నీవు నాతో ఏడడుగులు నడవడంతో మన ఉభయులకు
మైత్రి కలిగింది. నీ చేతిని నేనెప్పుడూ విడవను-నన్ను నీవు కూడా విడవవద్దు. మంచి
మనస్సుతో అన్నోదకాలను స్వీకరించి ఆరోగ్యంగా ఐశ్వర్యాన్ని అనుభవించుదాం. పరస్పరం
చర్చించుకొని కుటుంబ పనులను నెరవేరుద్దాం. అనుకూల దంపతులమై సంసార యాత్ర
కొనసాగించుదాం. నువ్వు భూమివి-నేను ఆకాశాన్ని. నువ్వు వాక్కువు-నేను మనస్సును. నేను
చేసే ధర్మ కార్యాలకు నీ సహకారం కావాలి. యోగ్యమైన సంతానాన్ని-సంపదను మనం ఇద్దరం
కలిసి అనుభవించుదాం" అని దానర్థం. " రాత్రి గాని, పగలు గాని, ఎల్ల
వేళలా సుఖ సంతోషాలతో నువ్వుండాలి నీకు ఎటువంటి ఇబ్బందీ కలగరాదు. సుమంగళివై-సత్
సంతానంతో గృహలక్ష్మివై, అభివృద్ధి చెందాలి" అని రక రకాలుగా అనునయించే
మాటలివి. సప్తపది తర్వాత మరో ముఖ్యమైన వివాహ వేడుకలు, నాగవల్లి-సదశ్యం. ఆ తర్వాత
అప్పగింతల కార్యక్రమం. సదశ్యంలో బ్రాహ్మణులకు కానుకలు, వధూవరులకు బట్టలు పెట్టే
కార్యక్రమం వుంటుంది. నాగవల్లిలో పెళ్లి కూతురుకు భర్తతో కాలి మెట్టెలు తొడిగించే
కార్యక్రమం, గుచ్చిన నల్లపూసల తాడును వధువు మెడలో కట్టించే కార్యక్రమం
జరిపించుతారు. నల్ల పూసలతాడును కూడా మూడు ముళ్లు వేయించుతారు. ఇక వధూవరులతో కలిసి
సమీప బంధుమితృల కోలాహలం మధ్య "భుజం బంతి భోజనాల" హడావిడి వుంటుంది. వధూవరులిద్దరిని
పక్క-పక్కన కూచోబెట్టి, వెండి కంచాలలో ఇరువురికీ భోజనాలు వడ్డించి, వరుసకు బావా-మరదళ్లలాంటి
వారి వేళా-కోళాల మధ్య భోజన చేయడం ఆరంభించుతారు అందరూ. మధ్యలో పాటలు, వధూవరులు
ఒకరి కంచంలోది మరొకరి కంచంలో వుంచడం, పక్క వారందరూ తినమని బలవంతం చేయడం అక్కడ
జరిగే వేడుక. ఉంగరాలు తీయడమనే "ప్రధానాంగుళీయకం" వేడుకలో మూత కురుచగా
ఉండే చిన్న బిందెలో పాలూ, నీళ్ళూ పోసి, దానిలో మెట్టెలు, ఒక బంగారు ఉంగరాన్ని
వేసి పురోహితుడు చెప్పగానే గభాలున దానిని తీయడానికి వధూవరులు ప్రయత్నించే
తంతుంటుంది. వుంగరం దొరికిన వారు వేరొకరికి తొడుగుతారు. చూడటానికి సరదాగా
కన్పించే ఇది కేవలం అప్పటిదాకా పరిచయం లేని వదూవరులకు స్పర్శ తాలూకు
సాన్నిహిత్యాన్ని తెలియచేయడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం. ఇక్కడా బంధుమితృల
కోలాహలం చోటుచేసుకుంటుంది. ఆ కాసేపు అది ఇరు పక్షాల వారి మధ్య ఒక నిజమైన పోటీలా
జరుగుతుంది.
అప్పగింతలు-గృహ ప్రవేశం
కన్యా దాత ఇంట్లో జరిగే వేడుకల్లో "అప్పగింతలు"
కార్యక్రమం అన్నింటిలోకి చివరిది-ఉద్వేగ భరితమైంది. సాధారణంగా పెళ్లి జరిగిన
రోజున అర్థరాత్రి దాటింతర్వాత అప్పగింతల మంత్రంతో మొదలవుతుంది కార్యక్రమం. అయితే
ఇటీవలి కాలంలో, వసతి గృహాల్లో పెళ్ళిళ్లు జరుపుకోవాల్సిన పరిస్థితుల్లో,
వాళ్లిచ్చిన వేళకు మించి అక్కడ వుండడం కుదరనందున, అన్నీ ఆ టైంలోపల
జరిపిస్తున్నారు. వధూవరులకు చూపాల్సిన "అరుంధతి" నక్షత్రాన్ని కూడా
పట్ట పగలు చూపించి "కనబడిందా?" అని అడుగుతున్నాడు పురోహితుడు.
కనబడిందని జవాబిస్తున్నారు వధూవరులు. భజంత్రీలు అప్పగింతల పాట పాడుతుంటే, పెళ్ళి
పీటపై వధువును మధ్యలో కూర్చుండ బెట్టి, పాలలో చేతిని ముంచిన తర్వాత అప్పగింతల
తంతు జరుగుతుంది. అప్పగించిన పెద్దలందరికీ బట్టలు పెట్టే తంతుంటుంది. వధువు రెండు
చేతులను పాలలో ముంచి వరుని చేతిలో పెట్టి అప్పగించాలి. అప్పగించుతూ:
"అష్టవర్షాభవేత్ కన్యా, పుత్రవత్ పాలితా మయా, ఇదానీం తవ దాస్యామి, దత్తా
స్నేహేన పాలయా" అంటాడు కన్యా దాత. అంటే, "పుత్రుడితో సమానంగా పెంచిన
ఎనిమిది సంవత్సరాల వయసున్న ఈ కన్యను నీకిస్తున్నాను. నీవు ఈమెను ప్రేమాభిమానాలతో
కాపాడు." అని దాని అర్థం. అదే మంత్రం చదువుతుంటే, అదే అర్థం వచ్చేలా,
అత్తమామలు వరుడి ప్రక్కన కూర్చుని వుంటే, వారికి కూడా వధువు రెండు చేతులు పాలలో
ముంచి వారి చేతులో అద్ది, "మీ పుత్రిక వలె కాపాడాలి" అని అప్పగిస్తారు.
బహుశా అప్పగింతల ద్వారా, పెళ్లికూతురును అత్తవారింటి వైపు బంధువులందరికీ పరిచయం
చేయడం కొరకు, ఈ వేడుకను జరిపిస్తుండవచ్చు. అప్పగింతల ముందర "వడి కట్టు"
వధువుకు కట్టు తారు. వడి కట్టులో శేరుంబావు బియ్యం, వెండి గిన్నె, కొబ్బరి చిప్ప
వుంచుతారు. అప్పగింతల కార్యక్రమంలో వధువును అప్పగించే ముందర, "బొమ్మ"ను
అప్పగించడమనే, చిన్న వేడుక జరిపారు. ఒక మంచం మీద జంఫఖానా పరిచి, జాకెట్ గుడ్డతో
ఊయలలాగా చేసి, అందులో ఈ చెక్క బొమ్మను నిదురిస్తున్న భంగిమలో వుంచుతారు. వధూవరుల
కొంగులను కలిపి, అందులో ఎర్ర నీరు ఊయలలోంచి పడే విధంగా పోస్తారు. వధువుతో వరుడికి
ఆ బొమ్మనిప్పించి, తాను పనిమీద వున్నాననీ, బొమ్మ రూపంలో వున్న వాళ్ల పాప-బాబును
జాగ్రత్తగా చూస్తుండమనీ అనిపిస్తారు. అలా మూడు సార్లనిపించిన తర్వాత, ఆడబిడ్డకు ఆ
పనిని అప్పగించుతారు. ఆడ బిడ్డకు బొట్టు పెట్టి, చీరె ఇచ్చి, బొమ్మను చేతిలో
వుంచుతారు. ఇదయిన పిదప, అయిదుగురు దంపతులకు వధూవరులతో, (దంపత) తాంబూలాలు
ఇప్పించుతారు. పెద్దలందరికీ వీరిరువురితో దండాలు పెట్టిస్తారు. ఈ అప్పగింతలు
చేసేవారికి, చూసే వారిలో చాలామందికి కంట తడిపెట్టిస్తుందనడంలో అతిశయోక్తి కాదు.
ఇన్నాళ్లుగా పెంచి పోషించిన కూతురు తమను విడిచి అత్త వారింటికి వెళుతుందని ఆమెను
వదలి వుండాలే అనే బాధ కన్నవారికి కలగడం సహజం. అప్పగింతల కార్యక్రమం అనంతరం,
పెళ్ళికూతురును లోపటికి తీసుకునిపోయి, పెరుగు అన్నం పెట్టి, దేవుడికి దండం
పెట్టించి, బయట ఇంటి సింహద్వారం దగ్గర తల్లి కడుపుపై మజ్జిగతో అద్దించి, గడపకు చేతులతో
కొట్టించుతారు. ఇవన్నీఅయ్యాక విడిది గృహ ప్రవేశానికి పంపుతారు. ఇక అంతటితో కన్యా
దాత ఇంటినుంచి ముందు జరగాల్సిన వేడుక, విడిదికి-అక్కడినుంచి పెళ్లికొడుకు ఇంటికి
మారుతుంది. హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే
కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని
మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి
అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని
ఒకటిగా కలిపి ఉంచుతుంది.
"టుక్సెడో" అని పిలుస్తుంటారు. 6:00
p.m. తర్వాత ధరించడానికి ఇది సంప్రదాయకంగా
శ్రేష్ఠం. అయితే ప్రత్యేకించి, అమెరికా సంయుక్తరాష్ట్రాల్లో దీనిని పగటిపూట
ధరించడం కూడా కన్పిస్తుంది).
పాశ్చాత్య వివాహాల్లో వాయించే సంగీతంలో విడిది గృహానికి నడచి
వెళుతున్నప్పుడు సాగే ఒక ఊరేగింపు పాట (ఉదాహరణకు, పెళ్లి మేళం మరియు రిసెప్షన్
నృత్య సంగీతం సహా) ఉంటుంది.
![]() |
మెనూ
0:00
|
|
|
|
|
It has been suggested
that this section be split into a new article
titled Wedding customs by
country. (Discuss) Proposed
since March 2010.
|
ఇరు వర్గాల మధ్య పెళ్లికి
విజ్ఞప్తి చేసే వరుడు తరపున ఒక మధ్యవర్తిని పంపడం ద్వారా వివాహ తంతు మొదలవుతుంది.
ఆ ప్రకారం ఇరు వర్గాలు కలుసుకునేందుకు సమయాన్ని నిర్ణయించుకోవడం మరియు పెళ్లిపై
ఒక తీర్పు ఇవ్వబడుతుంది. వివాహానికి ముందే అంగీకారాన్ని తెలుపుతూ కట్నం (ጧሎሽ) ఇవ్వడం జరుగుతుంది. పెళ్లి
రోజున, వరుడు మరియు ముగ్గురు లేదా నలుగురు "సన్నిహితులు" (ሚዜ) భార్య ఇంటికి వెళతారు. అక్కడ (కాబోయే)
భార్య కుటుంబం మరియు స్నేహితులు కార్యాక్రమానుసారంగా ఇంటి యొక్క ప్రవేశాన్ని
అడ్డగిస్తారు. సహచరులు తప్పకుండా గట్టిగా పాడుకుండా, ఇంటిలోకి చొచ్చుకుని
ప్రవేశిస్తారు. మొదటి సన్నిహితుడు పరిమళాన్ని తీసుకుని, ఇంటిలోపల ప్రతిచోటా
వెదజల్లుతాడు.[9]
పిగ్మీ నిశ్చితార్థాలు ఎక్కువ నిడివిని కలిగి ఉండవు. సంబంధిత ఇరు
కుటుంబాలు పరస్పర సందర్శన ద్వారా ఒక అంతిమ నిర్ణయానికి వస్తారు. వరుడు తనకు
కాబోయే అత్తమామల వద్దకు ఒక దుప్పిని గానీ లేదా కొన్ని బాణాలను కానుకగా
తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అతని పరివారం మరియు అతని కొత్త తల్లి తల్లిదండ్రులతో
పాటు నివశించే విధంగా వధువును తీసుకెళతాడు. అతని ఏకైక బాధ్యత అతని భార్య సోదరుడు
లేదా పురుష దాయాదిని మనువాడేందుకు సిద్ధంగా ఉండే అతని బంధువర్గంలోని ఒక అమ్మాయిని
గుర్తించడం. ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను పోషించగలనని అతను భావిస్తే, అదనపు
సతీమణులను పొందవచ్చు.
See also: Egyptian
Wedding
అరబ్ ప్రపంచంలోని క్రైస్తవమత
వివాహాలు పాశ్చాత్య వివాహాలతో సారూప్యతను కలిగి ఉన్నప్పటికీ, అరబ్బు దేశాల్లోని
ముస్లిం వివాహాలు ముస్లిం సంప్రదాయాల ద్వారా ప్రభావితమయ్యాయి. ముస్లిం
వివాహాలు వధూవరులకు షేక్ మరియు అల్-కితాబ్ (పుస్తకం) ఇవ్వడం ద్వారా మొదలవుతాయి. వధూవరులిద్దరూ
పరస్పరం ఇష్టపడకపోతే వివాహం అనేది ఇస్లాం మతం ప్రకారం, చెల్లదు. అప్పుడప్పుడు పెళ్లికి ముందు వరుడు
వధువు ఇంటికి వెళ్లేలా ప్రోత్సహించబడతాడు (ఇస్లాం మత ప్రవక్త మహ్మద్ చెప్పిన అనేక అహాదిత్ లలో సూచించిన విధంగా). అయితే
ఇరువురి మధ్య చర్య యొక్క పవిత్రతను తెలిపేలా ఈ సందర్శనలకు ఒక పెద్ద దిక్కును
పంపడం జరుగుతుంది. వివాహ శుభకార్యాలు మరియు రిసెప్షన్లలో పాల్గొనే పురుషులు మరియు
మహిళలు వారి వారి ప్రాంతాల వారీగా విభజించబడతారు.
బెంగాలీ వివాహాలు బంగ్లాదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ల్లోని ముస్లిం మరియు హిందూ పెళ్లిళ్లు
రెండింటినీ తెలుపుతాయి. ముస్లిం మరియు హిందూ పెళ్లిళ్లు వాటి విలక్షణమైన మతపర
సంప్రదాయాలను కలిగి ఉన్నప్పటికీ, బెంగాలీ ప్రజలలో మతపరమైన పెళ్లిళ్లలో అనేక
సాధారణ సాంస్కృతిక ఆచారాలు కన్పిస్తాయి.
సంప్రదాయక చైనీస్ వివాహం అనేది ఇరు కుటుంబాల మధ్య ముందస్తు ఏర్పాట్ల
ద్వారా జరిగే పెళ్లికి సంబంధించిన చైనా సమాజాల్లోని ఒక కార్యక్రమ సంబంధిత
సంప్రదాయం. చైనీస్ సంస్కృతిలో భావనాత్మక ప్రేమను అనుమతిస్తారు. అత్యధిక మంది
సాధారణ పౌరులు ఏకపత్నీవ్రతులుగా ఉండాలనే నిబంధన కూడా ఉంది. జేగంటలు మరియు
పిల్లనగ్రోవి తరహా పరికరాలు కలిగిన వాద్యకారుల బృందం వరుడి ఇంటికి వెళ్లే వధువు
సమూహాన్ని అనుసరిస్తుంది. వివాహ విందులో కూడా అదే విధమైన సంగీతం ఉంటుంది. వధువు
నివాసప్రాంతాన్ని బట్టి, టీ సెరిమోనీ లేదా వివాహ పురోహితుడి వినియోగం వంటి విభిన్న
సంప్రదాయాలు చైనీస్ వివాహాల్లో కన్పిస్తాయి. ఆధునిక కాలాల్లో, చైనీస్ జంటలు
"అందమైన ఫోటోలు" తీసుకోవడానికి ఫోటో స్టూడియోలకు వెళ్లి, అనేక రకాల
గౌన్లు మరియు వివిధ నేపథ్యాల్లో పోజిలివ్వడం జరుగుతోంది.
కొన్ని సంప్రదాయాలు దక్షిణ చైనా ప్రాంత ప్రజలకు మాత్రమే ప్రత్యేకంగా
ఉన్నప్పటికీ, అనేక ప్రాంతీయ చైనీస్ వివాహ సంప్రదాయాలు ప్రధాన చైనీస్ వివాహ
సంప్రదాయాలను అనుసరిస్తున్నాయి. పలు దక్షిణ చైనీస్ వివాహాల్లో, వధువు విలువ వరుడి
యొక్క ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. తరచూ వధువు యొక్క విలువకు ఎక్కువగా
డిమాండ్ లేనప్పుడు ఉపయోగించే, "కన్యాశుల్కం" (కూతురి విక్రయం) లేదా
వధువు ఆలోచన ఒక శైలి కాదు. వధువు విలువ చాలా కాలం వరకు బంగారు ఆభరణాలు, అందమైన
దుస్తులు లేదా డబ్బు, వధువు శీలవతి అని సూచించే ఒక కాల్చిన పంది రూపంలో ఉండేది.
పెళ్లి కానుకలను వృద్ధ జంటలు లేదా కొత్తగా పెళ్లైన వారి కంటే పెద్ద జంటలు
బహుకరిస్తాయి. కుటుంబసభ్యుల్లో చిన్నవారు తేనీరును అందిస్తారు.

ఇంగ్లాండ్ బ్రిస్టల్, లో పెండ్లి రథం
వధువు తెలుపురంగు పెళ్లి
దుస్తులను ధరించే పాశ్చాత్య సంప్రదాయం విక్టోరియా శకం నుంచి శీలాన్ని కాక
పవిత్రతను తెలిపే విధంగా ఆచరణలోకి వచ్చింది. "తెలుపురంగు వివాహ" సంప్రదాయంలో,
ఒక వితంతువు లేదా విడాకులు తీసుకున్న మహిళ రెండో పెళ్లి చేసుకునేటప్పుడు
తెలుపురంగు దుస్తులు మరియు మేలిముసుగును తప్పనిసరిగా ధరించాలని భావించరు. ఎక్కువగా ప్రొటెస్టంట్ మరియు కేథలిక్ భావాల నుంచి
వచ్చిన పాశ్చాత్య వివాహాల యొక్క ప్రత్యేకమైన సంప్రదాయాలు "శ్వేత వివాహం"లో
వివరించబడ్డాయి.
వివాహం తర్వాత తరచూ వివాహ విందు ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో దీనిని
'వివాహ అల్పాహారం'గా పిలుస్తుంటారు. ఇందులో ఒక అతిపెద్ద వివాహ కేకు పంచబడుతుంది.
పాశ్చాత్య సంప్రదాయాల్లో జంటను దీవించడం, కొత్తగా పెళ్లైన వారు తొలి నృత్యం చేయడం
మరియు కేకు కోయడం ఉంటాయి. ఒక వధువు వివాహానికి విచ్చేసిన ఇతర పెళ్లికాని యువతుల
సమూహంపై ఒక పూలచెండును విసురుతుంది. దానిని పట్టుకున్న యువతి తర్వాత వివాహం
చేసుకోవాలని లోక పురాణం చెబుతోంది. అదే విధంగా వరుడు వధువు యొక్క మోకాలి పట్టీని
పెళ్లికాని యువకుల సమూహంపై విసురుతాడు. ఇక్కడ కూడా దానిని పట్టుకునే వ్యక్తి
తర్వాత పెళ్లి చేసుకోవాల్సి ఉంటుందని చెప్పబడుతోంది.
వివాహ అల్పాహారం సందర్భంగా
వివాహంలో తమ వంతు పాత్రను పోషించిన కుటుంబంలోని ప్రతి ఒక్కరూ హాజరవుతారు. కొత్తగా
పెళ్లైన వధూవరులు కలిసి అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. చట్టపరంగా వివాహ బంధంతో
వారిద్దరూ ఒక్కటయ్యారన్న విషయాన్ని అది తెలుపుతుంది. బ్రేక్ఫాస్ట్ (అల్పాహారం) అనే
పదం వివాహ కార్యక్రమానికి ముందు ఉపవాసం ఉండటం అనే అతి పురాతన సంప్రదాయం నుంచి
పుట్టింది. అందువల్ల వివాహ అల్పాహారం అంటే 'ఉపవాసాన్ని దూరం చేయడం'. ఆధునిక వివాహ
అల్పాహారం గురించి చెప్పాలంటే, అతిథులకు భోజనాలు వడ్డించడం. ఇది సంప్రదాయక
కబాబులు, బఫేలు లేదా 'ఈస్ట్ ఎండ్'లోని లండన్ వెడ్డింగ్[10] విషయంలో ప్రాంతీయ విందులు ఉంటాయి..
మరో విక్టోరియన్ సంప్రదాయంగా, వధువులు వడ్డించే సమయంలో "కొంత
పాత, కొంత కొత్త, కొంత అరువు తెచ్చుకున్నది, కొంత నీలం"ను ధరించడం లేదా
మోసుకెళ్లడం చేయాలి. ఈ విధంగా చేయడం అదృష్టంగా భావించబడుతుంది. తరచూ ఈ అన్ని
ప్రమాణాలను సరితూగే విధంగా వధువు ఒక్క వస్తువును మాత్రమే పొందడానికి
ప్రయత్నిస్తుంది. అంటే అరువుకు ఒక నీలిరంగు రుమాలను తీసుకోవడం. అది "ఆమెకు
కొత్తది". అయితే అది ఆమె అమ్మమ్మ అరువుకు ఇప్పిస్తుంది (అందువల్ల అది పాతది
అవుతుంది). ఈ సంప్రదాయానికి అదనంగా సౌభాగ్యాన్ని తీసుకురావడానికి ఒకరి కాలిజోడులో
నాణేన్ని ధరించడం.
ఈ మొత్తాన్ని దిగువ పద్యం రూపంలో పేర్కొనడం జరిగింది:
కొంత పాత, కొంత కొత్త,
కొంత అరువు తెచ్చుకున్నది,
కొంత నీలిరంగు కలిగినది,
లండన్లో హెడ్సర్ హౌస్,
స్టోక్ పార్క్, లీడ్స్ క్యాసిల్ కొన్ని ముఖ్యమైన మరియు ఉపయోగిస్తున్న వివాహ
వేదికలు.
ఫ్రాన్స్లో ప్రభుత్వ
పెళ్లిళ్లకు మాత్రమే చట్టపరమైన గుర్తింపు ఉంటుంది (laïcité విధానం వల్ల).
సాధారణంగా పెళ్లిళ్లు టౌన్ హాలు (ప్రభుత్వ భవనం)లో మేయర్ (లేదా మరో ప్రభుత్వ
సేవకుడు అతడు/ఆమె తరపున పాల్గొంటాడు) జరిపిస్తారు. వివాహ కార్యక్రమం జరిగే
పట్టణంలో భార్యాభర్తలవుతున్న వారిలో కనీసం ఒక్కరైనా ఉండి తీరాలి. అయితే ఎక్కువ
మంది మతపరమైన వివాహాన్ని కూడా ఆశించే నేపథ్యంలో, ప్రభుత్వ పెళ్లి ముగిసిన తర్వాత
వెంటనే అది కూడా నిర్వహించబడుతుంది. మతపరమైన వివాహాలకు మక్కువ చూపని జంటలకు టౌన్
హాళ్లు అత్యంత విస్తృతమైన కార్యక్రమానికి తరచూ అవకాశం కల్పిస్తాయి.
ఒకవేళ రెండు కార్యక్రమాలు వేర్వేరుగా
జరిగితే, ప్రభుత్వ పెళ్లికి సాధారణంగా కుటుంబ సన్నిహితులు మరియు సాక్షులు
హాజరవుతారు. ప్రభుత్వ కార్యక్రమం పూర్తి కాగానే, కొత్త జంట livret de famille అనే ఒక పుస్తకంను అందుకుంటుంది. ఇందులో ఒక వివాహ ధ్రువీకరణ నకలు
నమోదు చేయబడి ఉంటుంది. ఇదొక అధికారిక పత్రం. జంటకు తప్పక పిల్లలు ఉంటే, ప్రతి
శిశువు జనన ధ్రువీకరణ పత్రాన్ని livret de famille లో కూడా
నమోదు చేయాలి. ఫ్రాన్స్లో ప్రభుత్వం చేయించే వివాహం ఉచితం.
చిన్న ఫ్రెంచ్ పట్టణాల్లో, వరుడు పెళ్లిరోజున వధువును ఆమె ఇంటి వద్ద
కలుసుకోవచ్చు. పెళ్లి జరగనున్న ప్రదేశానికి ఆమెకు తోడుగా వెళ్లొచ్చు. వివాహ
మండపానికి జంట వెళుతున్నప్పుడు పిల్లలు రహదారి వెంట తెలుపురంగు రిబ్బన్లను
ఏర్పాటు చేస్తారు. ఆమె వెళుతుండగా వరుడు దానిని కత్తిరిస్తాడు.
మండపం వద్ద క్యారీ గా పిలిచే ఒక సిల్కు పందిరి దిగువ వేసిన
రెండు ఎరుగు రంగు వెల్వెట్ కుర్చీలపై వధూవరులు కూర్చొంటారు. వారు మండపం నుంచి
బయటకు వస్తున్నప్పుడు వారు నడిచే దారి వెంట పచ్చని ఆకులు మరియు పుష్పాలు
చల్లుతారు. కొన్నిసార్లు పిల్లలు పోగుచేసుకునే విధంగా చిన్న నాణేలను కూడా
విసురుతారు.
చేతయు డి హత్తోన్చతల్ దగ్గర సాంప్రదాయక ఫ్రెంచ్ పెండ్లి సంబరాలు
రిసెప్షన్ వద్ద, Coupe de Mariage గా పిలిచే ఒక కాల్చిన కప్పును తప్పకుండా ఉపయోగిస్తారు. కాల్చిన
పదార్థాన్ని ఇచ్చే ఈ సంప్రదాయం యొక్క మూలం ఫ్రాన్స్లో గుర్తించబడింది. ఆరోగ్యవంతమైన
జీవితం పొందాలని కోరుతూ, అక్షరాలా, కాచ్చిన ఒక చిన్న ముక్కను జంట వైన్లో
వేస్తారు. "కాల్చిన ఆ ముక్క" కోసం జంట తమ గ్లాసును పైకెత్తే సంప్రదాయం
నేడు పాశ్చాత్య సంస్కృతిలో సాధారణమైపోయింది.
కొన్ని జంటలు వివాహ కేకుకు బదులుగా ఒక క్రాక్యూమ్బౌచ్ పంపకాన్ని ఎంచుకుంటాయి. ఈ అంత్య ఖాద్యం (భోజనం తర్వాత తినే తీపి
పదార్థం) క్రీము అంటించిన మరియు ముదర పాకం చల్లిన పఫ్లుగా ఉంటాయి.
అట్టహాసంగా జరిగే వివాహంలో, కార్యక్రమాన్ని రాత్రి బాగా పొద్దుపోయే
వరకు కొనసాగించే అలపాటు ఉంది. రిసెప్షన్ తర్వాత, పెళ్లికి హాజరైన వారు కొత్తగా
పెళ్లైన వారి యొక్క గవాక్షం వెలుపల గుమిగూడటం మరియు వంట పాత్రలను వాయించడం
చేస్తారు. దీనిని షివారీ అని పిలుస్తారు. తర్వాత వారు జంట యొక్క సత్కారం మేరకు,
మరింత పానీయం సేవించడానికి వారు గృహంలోకి ఆహ్వానించబడతారు. అటు తర్వాత కొత్త జంట
భార్యాభర్తలుగా వారి మొదటి రాత్రిని గడపడానికి ఒంటరిగా విడిచిపెట్టబడతారు. ఈ
సంప్రదాయం ప్రత్యేక సందర్భాలను జరుపుకునే విధంగా ఫ్రాన్స్ అంతటా వ్యాపించింది. ఈ
ప్రత్యేకమైన వంగిన ఖడ్గాలను లియాన్ (కత్తులుకటారులకు సంబంధించిన ఫ్రెంచ్
స్థావరం)లోని హస్తకళా నిపుణుల వద్ద కొనుగోలు చేసేవారు.
వివాహానికి రెండు లేదా మూడు
రోజుల ముందు, జంట వారి కొత్త ఇంట్లో క్రీవతి (గ్రీకు భాషలో పరుపు అని) అని పిలిచే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. క్రీవతి
కార్యక్రమంలో, పెళ్లైన జంట మిత్రులు మరియు బంధువులు వేస్తారు. అలాగే జంట సౌభాగ్యం
మరియు సంతానాన్ని ఆకాంక్షిస్తూ వారి కొత్త పరుపుపై బాలలు డబ్బును వేస్తారు. ఈ
సంప్రదాయం తర్వాత, మామూలుగా వారు విందు భోజనాలు మరియు సంగీత విభావరిలో మునిగి
తేలుతారు.
సాధారణంగా పెళ్లి జరిగే శనివారం రోజున, అంటే శుక్రవారం లేదా ఆదివారం
కూడా జరగొచ్చు, వివాహ తంతు ముగిసేంత వరకు వధువును వరుడు చూడలేడు. సాధారణంగా
ఆలస్యంగా వచ్చే వధువు కోసం వరుడు మామూలుగా చర్చి వద్దకు వచ్చి, వేచి ఉంటాడు.
పుష్ప గుచ్ఛాలను వారు పరస్పరం మార్చుకున్న తర్వాత వారి వివాహం జరుగుతుంది. ఈ
సందర్భంగా వారి సన్నిహితులు పెళ్లి ఉంగరాలను మరియు కిరీటాలను జంటకు అందిస్తారు.
జంట ఒకే గ్లాసు (సంప్రదాయాన్ని అనుసరించి, ఒకటి లేదా మూడు గుక్కల చొప్పున
మార్చుకుని తాగుతారు) లోని రెడ్ వైన్ను సేవిస్తుంది. సంప్రదాయక మతపరమైన భావనలో
ఇది "సమ్మేళనం" కాదు. అయితే జీవితాన్ని పంచుకోవడమని అర్థం. వివాహ
కార్యక్రమం ముగింపు సమయంలో, అంటే కొత్తగా పెళ్లైన జంట చర్చిని వీడుతుండటంతో,
అతిథులు సంతోషం మరియు సంతానంను ఆకాంక్షిస్తూ బియ్యం మరియు పుష్పాలను
వెదజల్లుతారు. ప్రత్యేక అతిథులు అంటే సన్నిహితులు మరియు కుటుంబసభ్యులు జంట నుంచి
ఒక కానుకగా చక్కెర పూసిన బాదాలు (సంప్రదాయబద్ధంగా బేసి సంఖ్యలో ఉంటాయి. సాధారణంగా
ఏడు లేదా ఐదు) స్వీకరిస్తారు. గ్రీకు కార్యక్రమాలు ఎక్కువగా సంప్రదాయకమైనవి.
వివాహ కార్యక్రమం తర్వాత, సాధారణంగా మరుసటి రోజు ఉదయం వరకు వివిధ
రకాల ఆహార పదార్థాలు, పానీయాలు మరియు పాటకచేరి మరియు నృత్య ప్రదర్శనలతో కూడిన
అట్టహాసమైన పార్టీని జంట అతిథులకు ఇస్తుంది. ఈ వివాహ పార్టీ సాధారణంగా
కొద్దిసేపటి తర్వాత వచ్చే జంట కోసం వేచి ఉండే అతిథులను ఆహ్వానించడం ద్వారా
మొదలవుతుంది. నృత్యాలు చేయడం మరియు వివాహ కేకు ముక్కలను తినడం ద్వారా వారు ఈ
పార్టీని ప్రారంభిస్తారు. పార్టీలోని ఒక సందర్భంలో, వారు సంప్రదాయక జీబెకికో
(వరుడు) మరియు సిఫ్టిటిల్లి (వధువు) కూడా నృత్యం చేసే విధంగా చేస్తారు.
గ్రీసులోని పలుచోట్ల, అంటే
సంప్రదాయక పెళ్లిళ్లు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో, సాధారణంగా వారు సంప్రదాయక
సంగీతంను మాత్రమే వాయించడం మరియు స్థానిక ఆహారం మాత్రమే భుజించడం చేస్తారు. ఉదాహరణకు
సైక్లేడ్స్ ప్రాంతంలో, వారు సంప్రదాయక పాస్టెలి (నువ్వులతో కూడిన ఘన తైలం)ను
మరియు క్రీట్ ప్రాంతంలో మేకతో అన్నం వండుతారు. అనేక సంప్రదాయక వివాహాల్లో, గ్రీకు ఈస్టర్ ఉత్సవం
మాదిరిగా పందులు, మేకలు లేదా గొర్రెలు వంటి జంతువులను ఉడకబెడుతారు. చర్చి
కార్యక్రమానికి ముందు, ప్రాంతాన్ని బట్టి, ప్రత్యేకించి చిన్న ప్రాంతాల్లో, సాధారణంగా
వధూవరుల మిత్రులు మరియు బంధువులు, సంప్రదాయక వాద్యపరికరాలను వాయిస్తూ వారి వెంట
వేర్వేరుగా వెళతారు.
ఒక సాధారణ గ్రీకు వివాహంలో సాధారణంగా 100 మందికి పైగా అతిథులు
(అయితే సాధారణంగా 250-500 మధ్య ఉంటారు) పాల్గొంటారు. వారు మిత్రులు,
తోబుట్టువులు, అవ్వలుతాతలు, అత్తమామలు, ప్రథమ లేదా ద్వితీయ దాయాదులు, ఇరుగుపొరుగు
వారు మరియు సహచరులు ఉంటారు. మరోవైపు కొత్త జంటకు ఎప్పుడూ పరిచయం లేని వారు కూడా
పెళ్లికి అతిథులుగా హాజరవడం మామూలే. అందుకు కారణం పెళ్లికి ఎవరిని పిలవాలన్నది
జంట కాకుండా వారి తల్లిదండ్రులు నిర్ణయించడం. సంప్రదాయకంగా, వివాహ కార్యక్రమానికి
మొత్తం గ్రామమే హాజరవుతుంది. అందువల్ల తల్లిదండ్రులు వారి సొంత పిల్లల పెళ్లికి
వారి మిత్రులు మరియు వారి పిల్లలను చాలా తరచుగా ఆహ్వానిస్తుంటారు.
అనేక ఇతర సంప్రదాయాలు వాటి ప్రాంతీయ ప్రదేశాలకు స్థానికంగా ఉన్నాయి.
వధువు దుస్తులకు డబ్బును అంటించడం ఒక ముఖ్యమైన సంప్రదాయం. ఈ సంప్రదాయం గ్రీసులోని
ఒక ప్రాంతంలో పుట్టింది. ఇది పెళ్లి కానుకలకు ఒక ప్రత్యామ్నాయం వంటిది. అయితే ఇది
ఇటీవల విస్తృతమయింది.
ఇటలీలోని కొన్ని
ప్రాంతాల్లో, సెరినేడ్ (ఒక రకమైన సంగీత విభావరి)గా పిలవబడే ఒక పార్టీ వధువు ఇంటి
వెలుపల వరుడు చేత నిర్వహించబడుతుంది. అతని కుటుంబం మరియు మిత్రులు రావడం మరియు
వధువు కోసం వేచి ఉంటారు. ఆమె వచ్చేంత వరకు తమకు తాముగా సంతోషంగా గడుపుతారు. తర్వాత
వధువును ఆకర్షించడం కోసం వరుడు పాడుతాడు. అతను పాట పాడగానే పార్టీ ముగుస్తుంది.
పెళ్లి రోజున, వరుడి తరపు బంధువులు "చర్చి ఎక్కడుంతో వధువు
మరిచిపోయి ఉండొచ్చు" అని చెప్పడం ద్వారా అతన్ని ఆటపట్టించడానికి శతవిధాలా
గట్టిగా ప్రయత్నిస్తారు.
నిశ్చితార్థపు ఉంగరం కోసం
వధువుకు వరుడి కుటుంబం కట్నం ఇవ్వడం అనేది కూడా సంప్రదాయంగా వస్తోంది. తర్వాత నిర్వహించే
రిసెప్షన్కు అతిథులను తమ ఇంటికి ఆహ్వానించాల్సిన బాధ్యత వధువు కుటుంబానిది.
ఇటాలియన్ పెళ్లిళ్లలో పచ్చ రంగు చాలా ముఖ్యమైనది. ఇటలీలో కొంత నీలం
అనే సంప్రదాయం కొంత పచ్చ ద్వారా మార్చబడింది. ఈ రంగు పెళ్లైన జంటకు శుభం
చేకూరుస్తుంది. మేలిముసుగు మరియు తోడిపెళ్లికూతుళ్లు కూడా ఇటాలియన్ వివాహంలో
ముఖ్యమైనవి. ఈ సంప్రదాయం పురాతన రోమ్లో ప్రారంభమయింది. అప్పట్లో వధువును ఎలాంటి
పిశాచాలు (దయ్యాలు) ఆవరించకుండా ఆమెను దాయడానికి మేలిముసుగును ఉపయోగించేవారు.
దుష్టశక్తులు అయోమయానికి గురయ్యేలా వధువు ధరించిన మేలిముసుగు వంటి దానినే
తోడిపెళ్లికూతుళ్లు కూడా ధరించేవారు.
వివాహ కార్యక్రమం నుంచి
వెళ్లిపోయే తిరస్కృత మద్దతుదారులపై వధువులు గింజలు విసిరే పాత రోమ్ సంప్రదాయం
ఉంది.[11]
భోజనానంతర అల్పాహారం తర్వాత నృత్యాలు చేయడం, కానుకలు సమర్పించడం
జరుగుతాయి. తర్వాత చివరగా అతిథులు వెళ్లడం మొదలుపెడతారు. దక్షిణ ఇటలీలో, అతిథులు
వెళ్లేటప్పుడు, వధూవరులకు వారు చేతినిండా డబ్బులు ఇస్తారు. అందుకు ప్రతిగా వారు
ఒక పెళ్లి సాయం లేదా ఒక చిన్న ప్రశంగా చెప్పే బాంబోనీర్ను అందిస్తారు.
పోలిష్ వివాహాల్లో, కార్యక్రమాలు
రెండు లేదా మూడు రోజుల పాటు కొనసాగుతాయి. గతంలో, నిశ్చితార్థ కార్యక్రమాన్ని
కాబోయే వరుడు సంప్రదాయబద్ధంగా కుటుంబాన్ని ఒకచోట చేర్చే విధంగా నిర్వహించేవాడు. ఆ
సందర్భంగా అతను ఎంచుకున్న యువతిని అతన్ని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. ఇటీవల
కాలంలో ఈ సంప్రదాయం మారిపోయింది. నేడు నిశ్చితార్థం అనేది చాలా వరకు
వ్యక్తిగతమైనదిగానూ మరియు సన్నిహితమైనదిగా మారింది. తర్వాత నిర్వహించే విందు
పార్టీ పెళ్లి చేసుకోవడంపై జంట నిర్ణయం గురించి సన్నిహిత కుటుంబసభ్యులకు
తెలపడానికి ఒక చక్కటి మార్గంగా ఇప్పటికీ ఉంది.
పోలాండ్లోని కొన్ని ప్రాంతాల్లో, పెళ్లికి అతిథులను వ్యక్తిగతంగా
వెళ్లి ఆహ్వానించే సంప్రదాయం ఇప్పటికీ సమర్థించబడుతోంది. పలు యువ జంటలు వారి
తల్లిదండ్రులతో పాటు కలిసి, పెళ్లి ఆహ్వానాలను వ్యక్తిగతంగా అందజేయడానికి వారి
కుటుంబం మరియు మిత్రులను కలుస్తారు.
పాత సంప్రదాయం ప్రకారం, వివాహ కార్యక్రమానికి ముందుగా వరుడు అతని
తల్లిదండ్రులతో కలిసి వధువు ఇంటికి వస్తాడు. అప్పుడు తల్లిదండ్రులు మరియు వారితో
వియ్యం అందుకుంటున్న వారు ఇద్దరూ యువ జంటను ఆశీర్వదిస్తారు. జంట కలిసి చర్చిలోకి
ప్రవేశిస్తుంది. ఇద్దరు సాక్షులు మరియు తల్లిదండ్రులతో కలిసి దైవపీఠం వద్దకు
వెళుతుంది. పోలాండ్లో వధువు దైవపీఠం వద్దకు నడచివెళ్లడం లేదా వివాహంలో
తోడిపెళ్లికూతుళ్లు మరియు తోడిపెళ్లికొడుకులు ఉండటం చాలా వరకు అసాధాణమైన విషయం.
జంటతో పాటు ఇద్దరు సాక్షులు ఉంటారు. ఒక పురుషుడు (సాధారణంగా వరుడి తరపు వ్యక్తి)
మరియు ఒక మహిళ (సాధారణంగా వధువు తరపు వ్యక్తి). వారు కుటుంబసభ్యులు లేదా
సన్నిహితులై ఉంటారు.
పోలిష్ వధువు సంప్రదాయకంగా తెలుపురంగు దుస్తులు మరియు మేలిముసుగును
ధరిస్తుంది. మరోవైపు వరుడు సాధారణంగా బాణం మాదిరి టైతో ఉండే సూటు మరియు వధువు
పుష్ప గుచ్ఛాన్ని పోలి ఉండే బొత్తా రంధ్రంలో ఒక పుష్పాన్ని ధరిస్తాడు. కార్యక్రమ
సమయంలో, పెళ్లి ఉంగరాలు పరస్పరం మార్చుకుంటారు. భార్యాభర్తలిద్దరూ వాటిని వారి
కుడిచేతికి తొడుక్కుంటారు. ఈ తంతు ముగిసిన వెంటనే కుటుంబ సన్నిహితులు మరియు
అతిథులందరూ చర్చి ముందు ఒక వరుసలో నిలబడి, కొత్తగా పెళ్లి చేసుకున్న జంటకు
శుభాకాంక్షలు తెలుపడం మరియు జీవితమంతా ప్రేమానురాగాలతో జీవించమని దీవిస్తారు.
కొత్త జంట చర్చిని వీడిన తక్షణమే అదృష్టం వరించాలంటూ వారిపై బియ్యపు వర్షాన్ని
కురిపించడం లేదా వారు తీసుకునే విధంగా అతిథులు వారి కాళ్ల వద్ద నాణేలు వేస్తారు.
కొత్త జంటకు ఉత్తమ మరియు సౌభాగ్యవంతమైన భవిష్యత్తు ఉండాలని ఇలా చేస్తారు.
అతిథులందరూ జంటకు ముద్దులు, ఆలింగనాలు మరియు పుష్పాలు ఇవ్వడం
పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ రిసెప్షన్ (విందు కార్యక్రమం)కు బయలుదేరుతారు.
రిసెప్షన్కు వెళ్లే దారిలో కొత్త జంటకు "ప్రవేశ ద్వారాలు" ఏర్పాటు
చేయడం పోలాండ్లో ఒక సంప్రదాయం. వాటి ద్వారా ప్రవేశించేటప్పుడు
"ద్వారపాలకుల"కు జంట కొంత వొడ్కాను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇది గత
సంప్రదాయాన్ని తప్పుదోవపట్టించే విధంగా ఉందని చెప్పబడుతోంది. నిజానికి
"ప్రవేశ ద్వారాలు" వధువు అనాథ అయితేనే ఏర్పాటు చేస్తారు. అతిథుల నుంచి
"ద్వారపాలకులు" సేకరించిన డబ్బును వధువుకు ఆమె కట్నం (ఒక అనాథ
సాధారణంగా పేదరికంలో ఉంటుంది) వలే అందజేస్తారు.
రొట్టె మరియు ఉప్పులతో కొత్త జంటను తల్లిదండ్రులు రిసెప్షన్కు
ఆహ్వానిస్తారు. రొట్టె సౌభాగ్యాన్ని, ఉప్పు జీవిత ఆపదను సూచిస్తాయి. యువ జంట
ఎప్పుడూ ఆకలి బాధ పడరాదని మరియు ప్రతినిత్యం ఎదురయ్యే ఆపదలను వారు ఒకటిగా కలిసి
ఎదుర్కోవడాన్ని తెలుసుకోవాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తారు. ఆఖరి అతిథి
వెళ్లేంతవరకు, అంటే మరుసటి రోజు ఉదయం వరకు, ఈ వివాహ సంబరం కొనసాగుతుంది (వధూవరులు
మాత్రం ఉంటారు).
పోలాండ్లో, హ్యూమన్ లిబర్టీస్
క్రూసేడ్[12][13] వంటి ఉద్యమాలు లేదా వెడ్డింగ్ ఆఫ్ ది వెడ్డింగ్స్ (మత్తుపానీయాలు
లేకుండా పెళ్లి చేసుకున్న జంటల వార్షిక సమావేశం) మధ్యపానరహిత వివాహ మహోత్సవాలను
ప్రోత్సహిస్తాయి.
లౌటరీ అనేవారు సంప్రదాయక పాటలు
పాడే సంగీత విద్వాంసులు. వారి సంగీతం అట్టహాసమైన రొమానియా పెళ్లిళ్ల యొక్క రూపును ఆవిష్కరిస్తుంది. లౌటరీ వివాహ
కార్యక్రమాల్లో మార్గదర్శకులుగా కూడా వ్యవహరిస్తారు. అలాగే సుదీర్ఘ, మధ్యపాన
సేవనంతో మునిగితేలిన పార్టీలో తలెత్తే ఏవైనా ఘర్షణలను నియంత్రిస్తారు. సుమారు 48 గంటల
సమయంలో ఇది చాలా వరకు భౌతికపరమైన తీవ్రరూపును దాల్చుతుంది.
కనీసం మధ్యయుగ కాలానికి ముందునాటి సంప్రదాయాన్ని అనుసరించి, ఈ వివాహ
కార్యక్రమాల ద్వారా వచ్చిన సొమ్మును పలువురు లౌటరీలు వారి మిత్రులు మరియు
కుటుంబాలకు పెళ్లి తర్వాత కొద్దిరోజుల పాటు భారీ విందులపై వెచ్చిస్తారు.
ప్రభుత్వ భవనంలో ఈ పెళ్లి ప్రారంభమవుతుంది. అక్కడ
వధూవరులు వారి సన్నిహితులు మరియు బంధువుల సమక్షంలో అక్షరాలా ఒక్కటవుతారు. ఆ
తర్వాత, వారు వధువు ఇంటికి వెళతారు. అక్కడ లౌటరీ బృందం "Ia-ți mireasă
ziua bună" (సే గుడ్బై, బ్రైడ్)
వంటి పాటలను ఆలపిస్తుంది. అదే విధంగా వధూవరులు మరియు వారి తల్లిదండ్రులు పెళ్లికి
చేస్తున్న లాంఛనప్రాయ ఏర్పాట్లలో పాల్గొంటారు (తోడిపెళ్లికొడుకు మరియు
తోడిపెళ్లికూతురు ఒక పువ్వును వారి ఛాతీలపై ఉంచుతారు. వరుడి యొక్క టైని సిద్ధం
చేయడం, అతనికి గొరగడం మరియు వధువుకు మేలిముసుగును ధరించడం చేస్తారు. ఇవన్నీ కూడా
మేలిముసుగు ముక్కలు మరియు పుష్పాలతో అలంకరించిన ఒక పెద్ద అద్దం ముందు జరుగుతాయి. ఈ
అద్దం వరుడి నుంచి వధువును వేరుగా చూపిస్తుంది). తర్వాత వారు చర్చికి వెళతారు. అక్కడ
మతపరమైన కార్యక్రమం నిర్వహించబడుతుంది. తదనంతరం విందు జరిగే ఒక రెస్టారెంట్కు
వెళతారు.
ప్రవేశద్వారం వద్ద కొత్తగా పెళ్లి చేసుకున్న
జంట అతిథులను పలకరించి, ఆహ్వానిస్తుంది. అలాగే గ్లాసెడు మధ్యాన్ని వారు ఇవ్వడం
మరియు లౌటరీ "Marș de
intampinare" (మీటింగ్
మార్చ్)ను ఆలపించడం జరుగుతాయి. అతిథులంతా వచ్చిన తర్వాత జంట కలివిడిగా మాట్లాడటం
మొదలుపెట్టడం మరియు నర్తించడం చేస్తుంది. అటు తర్వాత వంటవాళ్లు ”Dansul găinii” (కోడి నృత్యం: వారు బాగా కాల్చిన కోడిని
తయారు చేయడం మరియు దానిని అలంకరించడం చేస్తారు. అలాగే దానితో వారు ఆడతారు. అప్పుడు
తోడిపెళ్లికొడుకు కోడి ధర ఎంతంటూ వారితో బేరమాడతాడు)ని చేస్తారు. మరో సంప్రదాయం
వధువును అపహరించడం. కొత్తగా పెళ్లైన వారి మిత్రులు కొందరు వధువుపై పందెం కాస్తారు.
అయితే వరుడు మాత్రం ఎలాంటి అప్రమత్తతను కనబరచడు. దాంతో ఆమెను ఎక్కడో ఒక చోటుకు, సాధారణంగా
ఒక క్లబ్కు తీసుకెళతారు. తర్వాత వరుడు బలవంతంగా వధువు ధరను బేరమాడి, చెల్లించడానికి
ప్రయత్నిస్తాడు. అయితే వధువు తమ వద్ద ఉందంటూ "నేరగాళ్లు" ఆధారం (ఒక
కాలిజోడు, ఆమె మెడహారం మొదలైనవి) చూపేంత వరకు అతని ప్రయత్నం కొనసాగిస్తాడు. సాధారణంగా
"దొంగలు" పానీయాలు అడుగుతారు. ఇదంతా ఒక కొలిక్కి వచ్చాక, వధువును వారు
తిరిగి వివాహ మండపానికి తీసుకొస్తారు. ఇలా చేసినందుకు శిక్షగా వారు నిర్బంధంగా
నర్తించాల్సి వస్తుంది.
యువ ఇంగ్లీష్ జంటలు పెళ్లి
చేసుకునే ప్రదేశంగా స్కాట్లాండ్ను చెప్పుకోవచ్చు. ఎందుకంటే, స్కాట్లాండ్లో,
చట్టపరంగా పెళ్లి చేసుకోవడానికి తగిన వయసుంటే వధూవరులకు వారి తల్లిదండ్రుల అనుమతి
అవసరముండదు.(16). అదే ఇంగ్లాండ్లోనైతే ఇద్దరిలో ఎవరైనా ఒకరికి 16 లేదా
17 ఏళ్ల వయసుంటే, అప్పుడు తల్లిదండ్రుల అనుమతి అవసరం. అందువల్ల స్కాట్లాండ్, ప్రత్యేకించి
గ్రీట్నా గ్రీన్ వద్ద ఉన్న కమ్మరివాళ్లు, సాధారణంగా ఇంగ్లాండ్లో నివశించే 18 ఏళ్ల
లోపు జంటలు లేచిపోవడానికి ఒక ప్రసిద్ధ ప్రాంతంగా మారింది. గ్రీట్నా గ్రీన్
ప్రస్తుతం యేటా వందలాది పెళ్లిళ్లకు వేదికవుతోంది. ఇది స్కాట్లాండ్లోని మూడో
అత్యంత ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రదేశం.
సంప్రదాయాలు
కరబంధనం అనేది ఒక వివాహ
సంప్రదాయం. ఇందులో వధూవరుల చేతలను ఒకటిగా కడుతారు. ఇది పురాతన సెల్టిక్ సంప్రదాయం
ఆధారంగా వచ్చిందని మరియు "ముడి బంధనం" అనే వాక్యం ద్వారా ప్రేరణ
పొందిందని చెబుతుంటారు. "కరబంధనం" పట్ల విక్కా మరియు డ్రూయిడిజం (పురోహితులకు
సంబంధించినది) వంటి సెల్టిక్-ఆధారిత మతపరమైన మరియు ఆధ్యాత్మిక సంప్రదాయాల
అభ్యాసకులు మక్కువ చూపారు.[ఆధారం కోరబడింది]
స్వీడిష్ చర్చి వివాహంలో, ఆంగ్లో-సాక్సాన్
సంప్రదాయాలకు విరుద్ధమైన రీతిలో, జంట పరస్పరం ముద్దు పెట్టుకునేంత వరకు
పురోహితుడు సాధారణంగా నోరు తెరవడు. ముద్దు సంప్రదాయబద్ధంగా స్వీడిష్ వివాహ
సంప్రదాయాలకు సంబంధించింది కాకపోవడం అందుకు కారణం కావొచ్చు. అయితే సాపేక్షకంగా
ఇటీవలి కాలంలో ఇది పెళ్లితో ముడిపడింది.[14]
స్వీడిష్ వివాహాల్లో, వధువు
వెంట ఆమె తండ్రి తోడుగా వెళ్లడం కాకుండా వధూవరులు సాధారణంగా దైవపీఠం వద్దకు నడచి
వెళతారు.[15]
సాధారణంగా పెళ్లి సమయంలో వరుడు ఇతర
పురుషులతో పాటు బరోంగ్ టాగలాగ్ ధరిస్తాడు. అయితే ఈ రోజుల్లో సంపన్నులు టుక్సెడో
వంటి పాశ్చాత్య వస్త్రధారణ పట్ల మక్కువ చూపిస్తున్నారు. ఒకే ఏడాదిలో సుకోబ్ గా
పిలిచే ఇద్దరు తోబుట్టువులు, సాధారణంగా సోదరీమణులు పెళ్లిళ్లు చేసుకోవడం
అంగీకరించరు. ఎందుకంటే అలా చేసుకోవడం అరిష్టంగా భావిస్తారు. మరికొందరు వివాహ
ఉంగరాలను కింద పడవేయడం అరిష్టంగా పేర్కొంటారు (ఇది సాధారణంగా ఉంగరాలను తీసుకొచ్చే
వ్యక్తి తొడుక్కునే వారు వాటి పట్ల జాగ్రత్తగా ఉంటారా లేదా అనే విషయాన్ని స్పష్టం
చేసుకోవాల్సి ఉంటుంది). కాగితపు బిల్లుల రూపంలో డబ్బు కొన్నిసార్లు వధూవరుల
దుస్తులకు వారి మొదటి నృత్యం సమయంలో గుచ్చుతారు.
భారతదేశ వివాహాలు ప్రాంతం, మతం
మరియు ఇతర అనేక అంశాల ఆధారంగా ఐదు నిమిషాల నుంచి పలు రోజుల వరకు జరుగుతాయి. భారతదేశ
సంస్కృతి యొక్క వైవిధ్యం కారణంగా వివాహ శైలి, కార్యక్రమం మరియు సంప్రదాయాల పరంగా
వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలు, మతాలు మరియు కులాల్లో గొప్ప తేడా కన్పిస్తుంది. భారతదేశంలోని
క్రైస్తవులు సాధారణంగా కొంతవరకు పాశ్చాత్య వివాహ కార్యక్రమాన్ని అనుసరిస్తాయి. అయితే
భారతదేశ హిందువులు, ముస్లింలు జైనులు మరియు సిక్కులు పాశ్చాత్య సంస్కృతికి భిన్నమైన దానిని
అనుసరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో, సంప్రదాయక పెళ్లి రోజుల సమయంలో, తిలకం దిద్దే కార్యక్రమం (వరుడి
నుదుటిపై తిలకం దిద్దుతారు) ఉంటుంది. వధువు చేతులు మరియు పాదాలను హెన్నా (మెహెంది అని పిలుస్తారు) అలంకరించే కార్యక్రమం కూడా ఉంటుంది. వీటితో
పాటు మహిళల సంగీతం
(సంగీతం మరియు నృత్యం) మరియు
అనేక ఇతర పూర్వ వివాహ కార్యక్రమాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో అనుసరించే మరో
ముఖ్యమైన కార్యక్రమం "హల్దీ" ప్రోగ్రామ్. ఇందులో వధూవరులు పసుపు
ముద్దను పూసుకుంటారు (దీనినే నలుగు అంటారు). స అందరూ తప్పక వధూవరులకు ఈ పసుపును
పూస్తారు. కొన్ని ప్రాంతాల్లో, సముచిత పెళ్లి రోజున వరుడు మరియు అతని మిత్రులు, బంధువులు బరాత్ గా పిలిచే ఊరేగింగు ద్వారా
పాడుతూ, ఆడుతూ పెళ్లి మండపానికి వస్తారు. తర్వాత జంట మతాన్ని బట్టి, వివాహానికి
పవిత్రతను చేకూర్చడానికి మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. వరుడు సంప్రదాయక షెర్వాణి లేదా పంచె లేదా పాశ్చాత్య దుస్తులు లేదా
ఇతర స్థానికంగా లభించే దుస్తులు ధరించవచ్చు. కొన్ని ప్రాంతాల్లో, అతని ముఖం సెహ్రా గా పిలిచే పూలతో తయారు చేసిన ఒక
చిన్న-తెర ద్వారా కప్పబడుతుంది. కొన్ని ప్రాంతాల్లో, వధువు (హిందూ లేదా ముస్లిం) ఎప్పుడూ
ఎరుగురంగు దుస్తులను తప్ప తెలుపురంగువి ధరించదు. ఎందుకంటే, భారతదేశ సంస్కృతిలో
తెలుపురంగు వైధవ్యాన్ని సూచిస్తుంది. దక్షిణ మరియు తూర్పు రాష్ట్రాల్లో వధువు
సాధారణంగా ఎరుపురంగు చీరను కట్టుకుంటుంది. అయితే ఉత్తర మరియు మధ్య రాష్ట్రాల్లో
ప్రధాన వస్త్రంగా లెహెంగా అని పిలిచే ఒక స్కర్ట్-బ్లౌజ్ మరియు మేలిముసుగును
చెప్పుకోవచ్చు. శాస్త్రోక్తంగా పెళ్లి జరిగిన తర్వాత వధువు ఆమె భర్తతో కలిసి
వెళుతుంది. వధువు తరపు బంధువులకు ఇది చాలా బాధ కలిగించే కార్యక్రమం (దీనినే
అప్పగింతలు అని అంటారు). ఎందుకంటే, ఆమె తన భర్త కుటుంబంతో చేరుకునేందుకు బహుశా
ఆమె తన రక్త సంబంధీకులతో శాశ్వతంగా బంధాలు "తెంచుకుంటుంది". కేరళలోని
క్రైస్తవుల్లో వధువు కుటుంబంతో వరుడు వెళతాడు. పెళ్లి తర్వాత "రిసెప్షన్"
ఉంటుంది. ఇది వరుడి తల్లిదండ్రులు వారి ఇంటి వద్ద ఏర్పాటు చేస్తారు. కానుకలు
మరియు నగదు (చదివింపులు అని అంటారు)ను కొత్తగా పెళ్లైన జంటకు సాధారణంగా బంధువులు
సమర్పిస్తారు. వధువు తల్లిదండ్రుల నుంచి జంటకు ఇచ్చే సంప్రదాయక కట్నం నేడు అధికారికంగా చట్టరీత్యా
నేరం. బొద్దు పాఠ్యం
జపనీస్ సంప్రదాయాలు రెండు రకాలు.
అవి సంప్రదాయక షింటో కార్యక్రమాలు మరియు ఆధునిక పాశ్చాత్య తరహా కార్యక్రమాలు. ప్రతి
దానిలోనూ వధూవరుల జంట తొలుత వారి స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో దరఖాస్తు
పెట్టుకోవడం ద్వారా చట్టపరంగా వివాహం చేసుకోవాలి. తర్వాత వారికి నచ్చిన విధంగా
పెళ్లి చేసుకునేందుకు అధికారిక ప్రమాణ పత్రరచన అందజేయాలి. పెళ్లిచేసుకోవడానికి
ముందు రెండు రకాల భాగస్వామి ఎంపికలు ఉంటాయి. అవి జంట విషయంలో సంభవించవచ్చు. అవి (1) మియా లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లి,
మరియు (2) రెన్ యై లేదా ప్రేమ పెళ్లి.[16] జపనీస్ వధువు పై నుంచి కింది వరకు తెలుపురంగు దుస్తులే
ధరించాలి. అది ఆమె కన్య హోదాను దేవుళ్లకు తెలిపినట్లు కనబడుతుంది. రెండు రకాల
తలపాగా ఎంపికలు ఉన్నాయి. అవి ఒకటి, వాటాబోషి , ఇది ఒక తెలుపురంగు తలపాగా; మరొకటి
టిసునోకకుషి . ఇది వధువు
యొక్క అసూయ కొమ్ములను కప్పి ఉంచుతుంది. అంతేకాక ఒక చురుకైన మరియు విధేయత కలిగిన
భార్యగా ఉండాలనే వధువు యొక్క అభిమతాన్ని కూడా ఇది సూచిస్తుంది.

సంప్రదాయక జపనీస్ పెండ్లి శుభకార్యం
సంప్రదాయక జపనీస్ వివాహ
సంప్రదాయాలు (షిన్జెన్ షికి) ప్రకారం షింటో పుణ్యక్షేత్రంలో ఒక అట్టహాసమైన
కార్యక్రమం నిర్వహించబడుతుంది. జపనీస్ పెళ్లిళ్లు ఎక్కువగా ఆడంబరంగా ఉంటాయి. అయితే
కొన్నిసార్లు యువ తరాలు "అతిథుల రహిత పార్టీ" ద్వారా సంప్రదాయ పద్ధతి
వివాహాలను పక్కనపెట్టేందుకు మక్కువ చూపుతున్నాయి.[17] ఈ పరిస్థితిలో అతిథులు ప్రధానంగా కొత్త జంట మిత్రులు హాజరు
రుసుమును చెల్లిస్తారు.
ఇటీవలి ఏళ్లలో "పాశ్చాత్య
తరహా వివాహం" (క్రైస్తవ పెళ్లిళ్ల ద్వారా ప్రేరణ పొందింది) జపాన్లో అత్యధిక
మంది జంటల ఎంపికగా అవతరించింది.[18] దీనికి ఒక పరిశ్రమ అభివృద్ధి చెందింది. ఇది చర్చి
కార్యక్రమాల తర్వాత కొత్త జంటలకు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి
అంకితమయింది. జపనీస్ పాశ్చాత్య తరహా పెళ్లిళ్లు అనేవి సాధారణంగా ఒక ప్రార్థనాలయం (చిన్న
చర్చి)లో జరుగుతాయి. ఇది ఒక మామూలు లేదా అట్టహాసమైన కార్యక్రమంగా జరుపబడుతుంది. అప్పుడప్పుడు
ఒక హోటల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వివాహ ప్రార్థనాలయంలో పెళ్లిళ్లు
జరుగుతాయి.
కార్యక్రమానికి ముందు రిహార్సల్ ఉంటుంది. తరచూ ఈ రిహార్సల్ సమయంలో
వధువు తల్లి ఆమె మేలిముసుగును కిందకు దించుతుంది. అంటే ఒక తల్లి ఆమె కుమార్తెను
"మరొకరి చేతిలో పెట్టే ముందు" ఆమె చేసే చివరి పనిని ఇది తెలుపుతుంది.
అలాగే వధువు తండ్రి, ఎక్కువగా పాశ్చాత్య కార్యక్రమాల్లో మాదిరిగానే, ఆమెకు తోడుగా
దైవపీఠం నుంచి నడిపించుకుంటూ ఆమె విడిది గృహానికి తీసుకెళతాడు.
రిహార్సల్ తర్వాత కార్యక్రమం ఉంటుంది. వివాహాన్ని జరిపించే
పురోహితుడు తరచూ ఒక పెళ్లి సిలువును లేదా కానాను ధరిస్తాడు. ఇది రెండు
ఇంటర్లాకింగ్ వివాహ ఉంగరాలను కలిగి ఉంటుంది. పవిత్ర వివాహ బంధం ద్వారా వధూవరుల
జంట జీవితాన్ని కలిసి పంచుకుంటుందనే విషయాన్ని ఇది తెలుపుతుంది. వధువు రావడానికి
ముందుగా పురోహితుడు సంక్షిప్త ఆహ్వానాన్ని తెలపడం మరియు పరిచయ కార్యక్రమాన్ని
నిర్వహిస్తాడు. వధువు ఆమె తండ్రి కాళ్లకు వంగి నమస్కారం చేయడంతో ఈ కార్యక్రమం
పూర్తవుతుంది. అందుకు ప్రతిగా తండ్రి కూడా వంగుతాడు.
తర్వాత కార్యక్రమం మొదలవుతుంది.
ఈ కార్యక్రమం జపాన్ భాష లేదా ఆంగ్లంలో లేదా చాలా వరకు రెండింటి కలయికతో
జరపబడుతుంది. తర్వాత ప్రొటెస్టంట్ కార్యక్రమం ఉంటుంది. ఇది సాధ్యమైనంత వరకు
ప్రశాంతంగా తప్ప మతపరమైన రీతిలో బాహాటంగా ఉండదు. సాధారణంగా బైబిలులోని 1 కొరింథియన్స్ 13వ భాగం
చదవబడుతుంది. దీని తర్వాత ప్రార్థన మరియు లఘు సందేశం ఉంటాయి. ఈ సందర్భంగా వివాహ
ప్రమాణాల (సీయకు ) పవిత్రతను వివరిస్తారు. వధూవరులు పరస్పరం ప్రమాణాలు చేసుకోవడం మరియు
ఉంగరాలు మార్చుకుంటారు. ప్రార్థనాలయంలోని రిజిష్టరులో సంతకాలు చేయడం మరియు కొత్త
జంట వెల్లడి జరుగుతాయి. దీని తర్వాత తరచూ సంప్రదాయక వివాహ ముద్దు ఉంటుంది. ఈ
కార్యక్రమం మరో భక్తిగీతం మరియు దీవెన ద్వారా ముగుస్తుంది.
రెండు రకాల కార్యక్రమాలైన షింటో
మరియు పాశ్చాత్య తరహా వివాహం కలయికతో ఒక సమకాలీన జపనీస్ వివాహంగా పిలిచే ఒక కొత్త
కార్యక్రమం అవతరించింది. సమకాలీన జపనీస్ వివాహాలు పలు రకాలుగా చేస్తారు. పెళ్లిరోజు
రాగానే, ఇందులో పాల్గొనేవారు ముస్తాబవడానికి బ్యూటీ పార్లర్ వెళుతారు. వధూవరులు
మరియు కార్యక్రమంలో పాల్గొనే ఇతరులను సంప్రదాయక జపనీస్ అలంకరణతో ముస్తాబు చేయడం
బ్యూటీ పార్లర్ బాధ్యత. వధువు వస్త్రధారణ చాలా ముఖ్యం. ఎందుకంటే పెళ్లిరోజున
వధువు పలుమార్లు వివిధ రకాల దుస్తులు మార్చుకుంటుంది. డిజైన్ సంక్లిష్టత వల్ల
వధువు వస్త్రధారణ అనేది కష్టతరంగానూ మరియు ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందువల్ల
వధువు వివాహానికి రెండు గంటల ముందు తప్పక రావాల్సి ఉంటుంది. వధువు అలంకరణలో ఒక
అట్టహాసమైన కిమోనో (వస్త్రం), భారీ మేకప్, టోపా (సవరం వంటిది) మరియు తలను కప్పి
ఉంచే వస్త్రం ముఖ్యమైనవి. వివాహ తంతుకు గంట ముందు అతిథులు మరియు వరుడు
బయలుదేరాల్సి ఉంటుంది.[19]
ప్రతి ఒక్కరూ సంప్రదాయక
వస్త్రధారణ పూర్తి చేసుకున్నాక, వధూవరులు పరస్పరం వేరై, విడిది గృహంలో వారి
సన్నిహితులను కలుసుకుంటారు. హాజరైన బంధువులు కుటుంబమంతా తీయించుకునే ఫోటోలో
కన్పిస్తారు. అంతేకాక వారు మతపరమైన కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. అందరూ
గుమిగూడే సమయంలో, కైజోయి (సహాయకుడు) అప్పుడు ఏమి జరగబోతుంది మరియు కార్యక్రమ
వివరాలు తెలియనందు వల్ల ఆ రోజు వారు ఏమి చేయాలి అనే విషయాలను వారికి తెలుపుతాడు.[19]
అతను చెప్పిన దానిని అందరూ
అవగతం చేసుకున్న తర్వాత, బంధువులు మరియు కార్యక్రమ భాగస్వాములు ఫోటో స్టూడియోకు
తీసుకెళ్లబడతారు. అక్కడ ప్రొఫెషనల్ ఫోటోలు తీయబడతాయి. వధూవరులు మరియు వారి
బంధువుల ఫోటోలు తీయడం పెళ్లి రోజున ప్రధానమైన కార్యంగా భావించబడుతుంది. కొత్త జంట
మరియు వారి కుటుంబం ఫోటోలు వారి సంభావ్య భవిష్యత్ను తెలిపే విధంగా
రూపొందించబడతాయి.[19]
సుదీర్ఘ ఫోటో సెషన్ తర్వాత
వధూవరులు మరియు ఇతరులు షింటో పుణ్యక్షేత్రానికి వెళుతారు. ఈరోజుల్లో, షింటో
పుణ్యక్షేత్రాన్ని సౌకర్యంగా ఉండేలా ఒక హోటల్లో ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ
అన్ని కార్యకలాపాలు జరుగుతాయి. కార్యక్రమాన్ని ఒక షింటో పూజారి (పురోహితుడు) నిర్వహిస్తాడు.
కార్యక్రమంలో, వధూవరులిద్దరూ పరిశుద్ధులవుతారు. అయితే ఈ కార్యక్రమం యొక్క
ముఖ్యమైన ఘట్టం వధూవరులు వివాహ సంబంధమైనసేక్ (ఒక రకమైన జపనీస్ మద్యపానం)ను పరస్పరం మార్చుకోవడంతో
జరుగుతుంది. దీనినే శాన్-శాన్-కు-డు అని కూడా అంటారు. పాశ్చాత్య సంప్రదాయానికి అదనంగా ఉంగరాలు
మరియు వివాహ ప్రమాణాలను పరస్పరం చేసుకోవడం కూడా జరుగుతాయి. మతపరమైన
కార్యక్రమానికి హాజరుకాని అతిథులు లాబీలో ఏర్పాటుచేసిన వీడియో స్క్రీనుల్లో ఈ
తంతును వీక్షించవచ్చు.[19]
పాశ్చాత్య తరహా సంప్రదాయాల
మాదిరిగా, వివాహ తంతు ముగిసిన వెంటనే రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షన్ అతిథులుగా
కుటుంబసభ్యులు, మిత్రులు మరియు సహచరులు హాజరవుతారు. సమయం మరియు స్థలాన్ని
విస్తరించాలన్న వివాహ పరిశ్రమ ప్రయత్నం కారణంగా, రిసెప్షన్ కచ్చితంగా రెండు
గంటల్లో ముగుస్తుంది. రిసెప్షన్లో నియమరహిత కార్యకలాపాలు ఉండవు. అయితే ఒక
కచ్చితమైన పద్ధతిలో కార్యక్రమాలు జరుగుతాయి. రిసెప్షన్లో వధువు మరియు వరుడు
ప్రత్యేక ఆర్భాటాలు, ప్రసంగాలు మరియు ఇతర ప్రదర్శనల ద్వారా నాటకీయంగా
ప్రవేశిస్తారు.[19]
రిసెప్షన్ అంతటా వధువు అతిథుల
దృష్టిని పూర్తిగా ఆకర్షిస్తుంది. ఎందుకంటే నాటకీయ ప్రవేశాల కోసం ఆమె రెండు మూడు
పర్యాయాలు మారుతుంది. ఇలా అన్ని నాటకీయ ప్రవేశాలతో వరుడు చివరకు వధువును
కలుసుకుంటాడు. ఉదాహరణకు తొలి ప్రవేశంలో వధూవరులు మరియు నకోడో జంట ఉంటారు. నకోడో అంటే "పెళ్లిళ్ల పేరయ్య"
లేదా ఒక "మధ్యవర్తి" అని అర్థం. దీనిని మామూలుగా భర్తను సూచించడానికి
వాడుతారు.నకోడో జంట పేరు పెళ్లి ప్రకటనపై
కన్పించడం ద్వారా వారు అలాంటి ఒక ముఖ్యమైన పాత్రను కలిగి ఉంటారు. నకోడో పని ప్రశాంతమైన పెళ్లికి
ప్రాతినిధ్యం వహించడం. ఈ రెండు జంటలు కన్పించగానే తెల్లటి పొగతో కూడిన మేఘం వంటి
ఒక ప్రత్యేక అనుభూతి వారిని చుట్టుముట్టుతుంది. ఏకకాలంలో, హాలులోని లైట్లు
కాంతివిహీనంగా మారుతాయి. మండపం యొక్క లైట్ల అలంకరణ అతిథులను ఆశ్చర్యపరిచే విధంగా
లేత గులాబి రంగులోకి మారుతుంది. వధూవరుల నాటకీయ ప్రవేశాల సమయంలో ఫోటోలు తీస్తారు.
ఫోటోలు తీసే కార్యక్రమం పూర్తయిన తర్వాత వారు వారి బల్ల వద్దకు వెళతారు.[19]
అప్పుడు కార్యక్రమాల
నిర్వాహకుడు కొత్తగా పెళ్లైన జంట మరియు వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతాడు.
తర్వాత అతడు/ఆమె నకోడో ను
పరిచయం చేస్తారు. అప్పుడు నకోడో ప్రారంభ ఉపన్యాసం మొదలుపెడుతాడు. తర్వాత మరిన్ని
ప్రసంగాలు ఉంటాయి. రిసెప్షన్ అనేది పక్కా ప్రణాళికతో రూపకల్పన చేయబడటంతో, లాంఛనప్రాయంగా
మరియు టూకీగా మాట్లాడాలనే ఆలోచన ఉపన్యాసకుల్లో మదిలో ఉంటుంది. ప్రసంగాలన్నీ
ముగిసిన తర్వాత వధూవరులు పాశ్చాత్య తరహా సంప్రదాయాలను అనుసరిస్తారు. అవి (1) కేకు
కోసే కార్యక్రమం మరియు (2)భార్యాభర్తలుగా కొత్త జంట నృత్యం.[19]
రిసెప్షన్లో తదుపరి ఘట్టం
విందు లేదా కన్పాయి . ఇది రిసెప్షన్ అర్థాన్ని
సూక్ష్మీకరిస్తుంది. ఈ సందర్భంగా అతిథులు సేదతీరడం, భోజనాలు చేయడం మరియు పానీయాల
సేవన చేస్తారు. ఆ తర్వాత బంధువులు, మిత్రులు మరియు సహచరులు అభినందనపూర్వక
ప్రసంగాలు ఇస్తారు. ఆ సమయంలో, వధువు ఆమె మొదటి దుస్తులను మార్చుకునేందుకు
వెళుతుంది. రిసెప్షన్ ముగిసేంత వరకు ఆమె దానినే ధరించి ఉంటుంది. మరోవైపు వరుడికి
కూడా బట్టలు మార్చుకునే అవకాశముంటుంది. అది పాశ్చాత్య వస్త్రధారణగా చెప్పే
టుక్సెడోగా ఉండొచ్చు. రాత్రి ముగింపు కల్లా, వధూవరులిద్దరూ వారి సంప్రదాయక జపనీస్
వస్త్రధారణ నుంచి పాశ్చాత్య తరహా ధారణకు మారుతారు.[19]
వారు చివరి దఫా దుస్తులు
మార్చుకున్న తర్వాత, కొత్త జంట కొవ్వొత్తి కార్యక్రమాన్ని చేపడుతుంది. ఇద్దరూ
పొడవాటి, వెలిగించని కొవ్వొత్తిని కలిగి ఉంటారు. దానిని వారి తల్లిదండ్రులు
కూర్చొని ఉన్న బల్ల వద్ద నుంచి వెలిగిస్తారు. తర్వాత జంట గది చుట్టూ వృత్తాకారంలో
చుడుతారు. వారి అతిథుల బల్లపై ఉంచిన కొవ్వొత్తులను వెలిగిస్తారు. ఒక్కసారి
కొవ్వొత్తులన్నీ వెలిగించబడిన తర్వాత, కొత్త జంట వారి బల్ల వద్దకు చేరుకుంటుంది. అక్కడ
స్మారక కొవ్వొత్తిగా పిలిచే దానిని వారు వెలిగిస్తారు.[19]
కొవ్వొత్తి కార్యక్రమాన్ని పూర్తి చేసే సమయానికి రెండు గంటల పరిమితి
మరికొద్ది సేపట్లో ముగుస్తుంది. దాంతో మిగిలిన కొద్ది నిమిషాల సమయంలో లఘు
ప్రసంగాలు, పాటలు, నృత్యాలు మొదలైనవి ఉంటాయి. రిసెప్షన్ ముగింపు సందర్భంగా
పుష్పాల బహుకరణ కార్యక్రమం ఉంటుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంట తమను
పెంచిపెద్ద చేసిన తల్లిదండ్రుల గొప్పదనాన్ని తెలుపుతూ వారికి పూలను
బహుకరిస్తుంది. అప్పుడు ఫోటోలు మరియు వీడ్కోలు చెప్పడంతో రిసెప్షన్ ముగుస్తుంది.
మాలే వివాహ కార్యక్రమం రెండు రోజుల పాటు
జరుగుతుంది. మొదటి రోజు అకాడ్ నిఖా కార్యక్రమం ద్వారా ఇది మొదలవుతుంది. వరుడు వివాహ ఒప్పందంపై
సంతకం చేయడం ద్వారా వధువుకు మాస్కావిన్ (కట్నం) ఇవ్వడానికి అంగీకరిస్తాడు. ఆ తర్వాత, బెరినాయి బెసార్
కార్యక్రమం సందర్భంగా వారి చేతులు హెన్నాతో అలంకరించబడతాయి. వధువు కేశాలు కూడా
అందంగా కత్తిరించబడటం లేదా ఆమె కనుబొమ్మలను మాక్ అందమ్గా పిలవబడే
బ్యూటీషియన్ అందమైన రీతిలో దిద్దుతాడు. రెండో రోజు, వధువు ఆమె కుటుంబంతో మరియు
సంగీత విద్వాంసులతో మిత్రులు ఉంటారు. వధువు ఇంటి వద్ద బంగా మంగార్ లేదా కొబ్బరి
పువ్వు తీసుకెళ్లబడుతుంది. ఇంటి వద్ద వారు అక్షింతలు (పసుపు అద్దిన బియ్యం) మరియు
సుగంధ పరిమళాలతో పలకరించుకుంటారు.
See also: Weddings
in the United States
అమెరికా
సంయుక్తరాష్ట్రాలలోని అనేక వివాహాలు ఇటాలియన్ పెళ్లి మాదిరిగా
అదే క్రమాన్ని అనుసరిస్తాయి. ఇది సంప్రదాయబద్ధంగా తెలుపురంగు వివాహాన్ని (దిగువ తెలిపిన వివాహ రకాలు కూడా చూడండి) అనుసరిస్తుంది. ఈ సంప్రదాయం
వధువు దుస్తుల యొక్క తెలుపు రంగు నుంచి వచ్చింది. అయితే ఇది ఒక సంపూర్ణ వివాహ
పద్ధతిని సూచిస్తుంది. ఆచారాలు మరియు సంప్రదాయాల్లో తేడాలుంటాయి. అయితే సాధారణ
కార్యక్రమాలను దిగువ పేర్కొనడం జరిగింది.
పెళ్లికి ముందు
పెళ్లిలో
వివాహ రిసెప్షన్లో
అతిథులను ఆహ్వానించడం వెనుక
ఉద్దేశం పెళ్లి మరియు ప్రమాణాల ద్వారా ఒక్కటైన జంటకు వారు సాక్ష్యంగా నిలుస్తారని,
వారి సంతోషం మరియు ఉత్సవంలో భాగస్వాములవుతారని. అతిథులు తమ వంతుగా ఏదో ఒక చిన్న
బహుమతినైనా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, పెళ్లైన జంటకు బహుమతుల ప్రదానం
అనేది ఐచ్ఛికమైనది. సముచిత సంప్రదాయానికి విరుద్ధంగా, అతిథులకు వినోద
కార్యక్రమాలు మరి విందులు ఏర్పాటు చేయడానికి ఖర్చవుతున్నందున అందుకు ప్రతిఫలంగా
అతిథులు అదే విధంగా ఖరీదైన బహుమతులు లేదా నగదు ఇవ్వాలని కొన్ని జంటలు మరియు
కుటుంబాలు అభిప్రాయపడుతుంటాయి.[30]
వధూవరుల జంట వారి పెళ్లికి
ముందుగా ఒక దుకాణంలో బహుమతుల పట్టీని అందజేస్తారు. గృహోపకరణాల జాబితాను
రూపొందించే విధంగా ఇది వారికి దోహదపడుతుంది. ఈ పట్టీలో సాధారణంగా పింగాణి, వెండి
సామానులు మరియు స్ఫటిక వస్తువులు, నేత వస్త్రాలు లేదా ఇతర దుస్తులు, కుండలు మరియు
పెనాలు మొదలైనవి ఉంటాయి. కొత్త జంట నిజంగా ఏమి
కోరుతుందనే విషయాన్ని అతిథులు తెలుసుకునేందుకు వస్తువులు నమోదు చేసిన పట్టీలు (రిజిష్ట్రీలు)
దోహదపడతాయి. ఈ సేవ తగినంత లాభదాయకంగా ఉంటుంది. విలాసవంతమైన దుకాణాల నుంచి రాయితీ
దుకాణాల దాకా ఉండే పలువురు రిటైలర్లు ఈ సదవకాశాన్ని అందిస్తున్నాయి. శిష్టాచారం
ప్రకారం, పట్టీ సమాచారాన్ని అతిథులు నేరుగా అడిగితేనే ఇవ్వాల్సి ఉంటుంది. దానిని
ఎప్పుడూ ఆహ్వానంలో చేర్చరాదు.[31] నగదు బహుమతులను మార్చే కార్యక్రమాలతో కూడిన పట్టీకి బదులుగా
కొన్ని జంటలు అదనంగా హనీమూన్ వంటి పనులకు డబ్బులు సమకూర్చడం, ఇంటి కొనుగోలు లేదా
కళాశాల నిధికి ఉద్దేశించి, దానిని తయారు చేస్తారు. బహుమతుల వెనుక సంప్రదాయక
ఉద్దేశాలను వివాహ సంబంధ పట్టీలు ఉల్లంఘించే విధంగా ఉన్నందున వివాహ సంబంధ పట్టీలు
కచ్చితమైనవి కావని కొందరు గుర్తించారు. అంటే బహుమతులన్నీ ఇష్టపూర్వకంగా ఉండటం
మరియు బహుమతి ప్రదాత ఎంపిక చేసిన వ్యక్తిగతమైన సంతోషకర ఆశ్చర్యాలు వంటివి. జంటకు
ప్రతి బహుమతి యొక్క వెల తెలిసి ఉన్నందున పట్టీలు ఒక రకమైన ధర-ఆధారిత పోటీకి
దారితీస్తాయి. సంప్రదాయకంగా, పెళ్లిళ్లనేవి వ్యక్తిగత కార్యాలుగా భావించబడతాయి. అలాగే
ఆహ్వానించిన పెళ్లి జంటలో కనీసం ఒక్కరితోనైనా పరిచయం లేని వారు ఒక కచ్చితమైన
బహుమతిని ఎంపిక చేసుకోవడం అనేది సమంజసం కాదు. అందువల్ల పట్టీలు అనవసరం.[32] ఒకవేళ సరైనవా లేదా కాదా అని భావిస్తే, ఇతరులు పెళ్లిళ్లనేవి
సాధ్యమైనంత ఎక్కువ మంది నుంచి డబ్బులు లేదా ప్రత్యేక కానుకలను గుంజుకోవడానికి
సదవకాశాలని అభిప్రాయపడుతున్నారు. చివరకు ఒక ఆహ్వానం సైతం కేవలం అభినందనల కంటే
ద్రవ్యసంబంధ ప్రతిఫలాన్ని ఆశిస్తుంది.
ఏదైనా బహుమతికి ధన్యవాదాలు
తెలిపే లేఖలు సంప్రదాయకంగా బహుమతిని అందుకున్న వెంటనే పంపుతారు. పెళ్లి జరిగిన
ఏడాది వరకు బహుమతులను అందించడానికి అనుమతించే సంప్రదాయం ఉంది. ధన్యవాదాలను
సాధ్యమైనంత త్వరగా తెలియజేయాలి. అంటే రెండు వారాల్లోగా.[20]
పశ్చిమ ఆఫ్రికాకి చెందిన అశాంతి సంప్రదాయం వెలుపల శుద్ధి కార్యక్రమం
(చీపురు లాంటి దానితో తలపై ఆడించడం) అభివృద్ధి చెందింది. ఈ శుద్ధి కార్యక్రమం
అశాంతి మరియు ఇతర అకాన్ సంస్కృతుల్లో కూడా ఆధ్యాత్మిక విలువను కలిగి ఉండటం మరియు
గత కర్మలు లేదా దుష్టశక్తులను దూరం చేయడాన్ని ఇది సూచిస్తుంది. దుష్టశక్తులను
దూరం చేసే విధంగా కొత్త జంటల తలలపై చీపుర్లును ఆడిస్తారు. ఈ కార్యక్రమం ముగింపు
సమయంలో అప్పుడప్పుడు చీపురు పై నుంచి దాటుతుంది.
ఈ ఆచారం అమెరికా సంయుక్తరాష్ట్రాల్లో బానిసత్వం సందర్భంలో అదనపు
విశిష్టతను సంతరించుకుంది. బానిసలకు చట్టపరంగా వివాహం చేసుకునే హక్కు లేదు.
బానిసల యజమానులు బానిసలను వారి సొత్తుగా భావించేవారు. అందువల్ల చట్టపరమైన వివాహం
మరియు కుటుంబ బంధాల వల్ల ఒక సంస్థ ఏర్పాటు మరియు తిరుగుబాటుకు దారితీయొచ్చని వారు
ఆందోళన చెందారు. అయితే వివాహ కార్యక్రమాలు ఆఫ్రికన్లకు చాలా ముఖ్యమైనవి. వారు
అనేక సందర్భాల్లో ఆఫ్రికన్ సంస్కృతుల్లోని ఖర్చుతో కూడుకున్న కార్యక్రమాలకు
చెందినవారు.
సాక్షి ఎదుట వివాహ
ప్రమాణాలు చేయడం మరియు తర్వాత చీపురు చేతిపిడిపై
నుంచి దాటడం అనేవి ఒక గుర్తింపు కలిగిన సంఘం ఏర్పాటు దిశగా సాధారణ అలవాట్లుగా
మారాయి. అంతేకాక చీపుర్లు నిప్పు (అగ్ని)కి ప్రతీకలు. నూతన కుటుంబం మధ్యలో దీనిని
ఏర్పాటు చేస్తారు. చీపురును దాటడం అనేది ఆఫ్రికన్-అమెరికన్ల మధ్య జరిగే పలు
ఆధునిక వివాహాల్లో ఒక ఆచారంగా మారింది.[ఆధారం
కోరబడింది]
యూరప్లో ప్రత్యేకించి, విక్కా
మరియు సెల్టిక్ కమ్యూనిటీల్లో కూడా చీపురును దాటే అలవాట్లు ఉన్నాయి. అవి
సంభవనీయంగా ఆఫ్రికన్ ఆచారంతో సంబంధం కలిగిలేవు.[ఆధారం కోరబడింది]
పాకిస్తానీ వివాహం
సాధారణంగా నాలుగు రోజుల్లో నాలుగు ప్రత్యేక కార్యక్రమాలను కలిగి ఉంటుంది. మొత్తం
మూడు రోజుల పాటు జరగవచ్చు. మొదటి ఉత్సవాన్ని "మెహింది" అని అంటారు. దీనిని
వధూవరుల కుటుంబాలు రెండూ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తాయి.
మొదటి ఉత్సవం మెహింది. ఇందులో ఇరు కుటుంబాలు
ఒకటిగా కలిసి, జరగబోయే వివాహ కార్యక్రమాన్ని చేపడుతాయి. ఆ రోజు, పచ్చ, పసుపు, నారింజ
లేదా ఇతర లేత రంగు దుస్తులు ధరించడం తప్పనిసరి. వధువు చేతులు హెన్నాతో
అలంకరించబడతాయి. అదే విధంగా ఆ రోజు రాత్రంతా ఆటపాటలతో సాగుతుంది.మరుసటి రోజు "బరాత్"
ఉంటుంది. దీనిని వధువు కుటుంబం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాన్ని సాధారణంగా
రిసెప్షన్ హాలులో నిర్వహిస్తారు. వరుడు అతని కుటుంబం మరియు మిత్రులతో కలిసి
వస్తాడు. ఈ సందర్భంగా భారీ విందు ఇవ్వడం జరుగుతుంది. వధువు మిత్రులు మరియు
బంధువులు కూడా దీనికి హాజరవుతారు. బరాత్ కార్యక్రమం ప్రధాన వివాహ వేడుకగా
భావించబడుతుంది. ఎందుకంటే, పెళ్లికి సంబంధించిన ఇతర కార్యక్రమాల్లో ఇదే
అట్టహాసమైనది. తర్వాత "నిఖా" అని పిలిచే ఒక పవిత్ర కార్యక్రమం ఉంటుంది.
దీనిని మతపరమైనపూజారి లేదా ముస్లింల మతగురువు (ఇమామ్) నిర్వహిస్తాడు. దీని తర్వాతే
వధూవరులను భార్యాభర్తలుగా ప్రకటించడం జరుగుతుంది.మరుసటి రోజు "వాలిమా" అని
పిలిచే వేడుక జరుగుతుంది. దీనికి వరుడి కుటుంబం అతిథ్యం వహిస్తుంది. వధువు
కుటుంబం ఒక భారీ విందులో పాల్గొనడానికి వస్తుంది.
ఆమె పెళ్లి రోజున, ఆమెకు నచ్చిన
రంగు దుస్తులను ధరించవచ్చు. అయితే లేత రంగులు మరియు పలు సంప్రదాయక బంగారు ఆభరణాలు
సాధారణంగా ధరిస్తుంటారు. లహంగా , సల్వార్ కమీజ్ లేదా చీర వంటి
సంప్రదాయక దుస్తులను వధువు ధరించడం తప్పనిసరి. భారతదేశంలోని ముస్లిం మతంలో ఈ తరహా వివాహాలు సాధారణమైనవి.
పర్ష్యన్ వివాహ సంప్రదాయం, దాని
స్థానిక మరియు ప్రాంతీయ తేడాలు ఉన్నప్పటికీ, పర్ష్యాలోని పలు ఇతర సంప్రదాయాల
మాదిరిగానే అది పురాతన జొరాస్ట్రియన్ సంప్రదాయానికి చెందినది.[ఆధారం కోరబడింది] వివాహ విధానాలు మరియు సిద్ధాంతం
ఇస్లాం సంబంధిత సంప్రదాయాల ద్వారా సమూలంగా మారినప్పటికీ, వాస్తవిక కార్యక్రమాలు
మాత్రం పురాతన జొరాస్ట్రియన్ సంస్కృతిలో అవి ఉన్న విధంగానే ఇప్పుడు కూడా ఉన్నాయి.
సంప్రదాయక రష్యన్ వివాహం రెండు రోజుల పాటు జరుగుతుంది. కొన్ని వివాహాలు వారం
రోజులు కూడా జరుగుతాయి. ఉత్సవం అంతటా ఆటపాటలు, సుదీర్ఘ అభినందనల పర్వం, భోజనాలు
మరియు పానీయాలు ఉంటాయి. తోడిపెండ్లికొడుకు మరియు తోడిపెండ్లికూతురు సాక్షులుగా
ఉంటారు. వీరిని రష్యా భాషలో "స్విడెటిలి" అంటారు. ఈ కార్యక్రమం మరియు
ఉంగరాల పరస్పర మార్పిడి వివాహం మొదటి రోజున జరుగుతాయి.
సంవత్సరాలుగా రష్యన్ వివాహాలు తోడిపెళ్లికొడుకు, తోడిపెళ్లికూతుళ్లు
మరియు పుష్పాలు ధరించే యువతులు సహా పలు పాశ్చాత్య సంప్రదాయాలను అవలంభిస్తున్నాయి.
వివాహ విందు సమయంలో అతిథుల్లో ఎవరైనా ఒకరు "గోర్కో"
("చేదు")ని ఆలపించడం మొదలుపెడతాడు. దానిని వెంటనే మిగిలిన అతిథులు
అందుకుంటారు. వధూవరులు పరస్పరం ముద్దు పెట్టుకోవాల్సి వస్తే, అది ఆలాపన
కొనసాగేంతవరకు ఉండాలి.
|
|
This section may
need to be rewritten entirely to comply with Wikipedia's quality standards, as the intro to this
section is about marriage, and needs to be rewritten to discuss weddings
ceremonies and traditions instead, as does the section on Christian customs.
A large amount of info in the section on Jewish customs is commented out and
needs to be incorporated. Sections on other religious customs such as
Islamic and Shinto weddings would also be helpful. You can help. The discussion page may contain
suggestions. (May 2009)
|
పలు మతాలు నిర్వహించిన కార్యక్రమాలు మరియు సంప్రదాయాల ద్వారా ఒక
జీవితకాల బంధాన్ని గుర్తిస్తాయి. కొన్ని మతాలు బహుభార్యాత్వ పెళ్లిళ్లు లేదా
స్వలింగ వివాహాలను అనుమతిస్తాయి.
పలు క్రైస్తవ విశ్వాసాలు ఒక
వివాహంలో పిల్లల పెంపకం అనేది ప్రధానమైనదని నొక్కిచెబుతున్నాయి. జుడాయిజంలో, పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది.
అవివాహుతులుగా ఉన్న వారిని అసహజమైన వారుగా భావిస్తారు.[ఆధారం కోరబడింది] ఇస్లాం కూడా పెళ్లిని ఎక్కువగా
సిఫారసు చేస్తుంది. ఇతర అంశాల్లో, ఆధ్యాత్మిక పరిపూర్ణతను సాధించడానికి అది
ఉపకరిస్తుంది.[ఆధారం కోరబడింది] బాహై విశ్వాసంలో పెళ్లిని సమాజ నిర్మాణానికి ఒక
పునాదిగా భావిస్తారు. అంతేకాక అది మరణానంతరం భౌతిక మరియు ఆధ్యాత్మిక బంధాన్ని
ఎక్కువ కాలం పాటు కలిగి ఉంటుందని భావిస్తారు.[33] హిందూమతం పెళ్లిని ఒక పవిత్రమైన ధర్మంగా చూస్తుంది. ఇది మతపరమైన
మరియు సామాజిక బాధ్యతలను అనివార్యం చేస్తుంది.[ఆధారం కోరబడింది] విరుద్ధంగా, బౌద్ధమతం ఒకరు ఏ విధంగా సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపాలన్న
విషయాన్ని బోధించడం మరియు పెళ్లి ప్రమాణాలను తేలికగా[ఆధారం కోరబడింది] తీసుకోరాదని నొక్కి
చెబుతున్నప్పటికీ, అది పెళ్లిని ప్రోత్సహించడం గానీ లేదా నిరుత్సాహపరచడం గానీ
చేయదు (వివరాలకు ప్రత్యేక కథనంను చూడగలరు).
విభిన్న మతాలు వివాహ బంధాన్ని
తెంపుకోవడానికి (విడాకులు చూడండి) సంబంధించి, భిన్నమైన విశ్వాసాలను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు,
రోమన్ కేథలిక్ చర్చి పెళ్లిని ఒక మతపరమైన కార్యక్రమంగానూ మరియు బాప్తీకరించబడిన
ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక అంగీకారయోగ్యమైన పెళ్లి మరణం తప్ప మరే ఇతర కారణాల వల్ల
విచ్ఛిన్నం కారాదని విశ్వసిస్తుంది. అంటే విడాకులు తీసుకున్న వారు వారి భాగస్వామి
బతికి ఉండగా కేథలిక్ వివాహం ద్వారా తిరిగి పెళ్లి చేసుకోరాదు. రద్దు పరిస్థితిలో,
మతాలు మరియు ప్రభుత్వం తరచూ భిన్నమైన నిబంధనలను వర్తింపజేస్తాయి. ఉదాహరణకు ఒక జంట
ప్రభుత్వ సంస్థ ద్వారా వారు అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే మాత్రమే కేథలిక్ చర్చి
ద్వారా వారు వారి పెళ్లి రద్దు ప్రక్రియను ప్రారంభించవచ్చు.

కాథోలిక్ చర్చ్ లో పెండ్లి వేడుక సమయంలో ఒక జంట ఒకరికొకరు ప్రమాణాలు
మార్చుకుంటున్నారు.
అనేక క్రైస్తవ చర్చిలు పెళ్లికి ఒక రకమైన దీవెనను అందిస్తాయి. వివాహ
కార్యక్రమం సాధారణంగా జంట సంబంధాన్ని బలపరిచే విధంగా సదరు కమ్యూనిటీ ప్రమాణం
చేయాల్సి ఉంటుంది. చర్చి వివాహం అనేది ఒక కార్యక్రమం. దీనిని ఒక క్రైస్తవ పూజారి లేదా
పురోహితుడు దగ్గరుండి జరిపిస్తాడు. కార్యక్రమాలు దైవం సూచన ఆధారంగా జరుగుతాయి. ఇవి మాస్ వంటి ఇతర చర్చి
కార్యక్రమాల్లో కూడా తరచూ రూపాంతరం చెందాయి.[34]
నామవర్గీకరణల మధ్య ఆచారాలు విస్తృతంగా
మారవచ్చు. రోమన్ కేథలిక్ చర్చిలో "హోలీ మ్యాట్రిమోనీ" అనేది ఏడు
మతపరమైన కార్యక్రమాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ భార్యాభర్తలిద్దరూ పూజారి
మరియు సాక్షులుగా ఉన్న కమ్యూనిటీ సభ్యుల ఎదుట పరస్పరం పాదాభివందనం చేసుకుంటారు. అన్ని
మతపరమైన కార్యక్రమాల మాదిరిగానే, దీనిని కూడా జీసస్ స్వయంగా (గోస్పెల్ ఆఫ్ మాథ్యూ
19:1-2, కేథలిక్ చర్చి సంగ్రహగ్రంథం §1614-1615 చూడండి)
రూపొందించినట్లు చూడబడుతోంది. తూర్పు ఆర్థోడక్స్ చర్చిలోని రహస్యాలలో ఇదొకటి
మరియు ఇది ఒక పాదిరిగా నిర్ణయించడం మరియు ఒక బలిదానంగా భావించబడింది.
కేరళ సిరియన్
మలబార్ నస్రాని (మార్ థోమా క్రైస్తవులు లేదా సెయింట్ థామస్ క్రైస్తవులు)కి
స్వస్థలం. వారు మొదటి శతాబ్దంలో జీసస్ శిష్యుడైన థామస్ ది అపోస్టిల్ ద్వారా
మార్పు చెందారని విశ్వసించబడుతోంది. వారి వివాహ ఆచారాలు మరియు సంప్రదాయాల్లో
వివిధ యూదుల అంశాలు మరియు భారతీయ సంప్రదాయాలు కన్పిస్తాయి. కార్యక్రమం
రెండు భాగాలుగా విభజించబడింది. మొదటి భాగంలో, కార్యక్రమ నిర్వాహకుడు (ఇక్కడ
పూజారి కావొచ్చు) వరుడు నుంచి ఉంగరాన్ని తీసుకుని, దానిని ఆశీర్వదించిన తర్వాత
వధువు యొక్క కుడిచేతి ఉంగరపు వేలికి తొడుగుతారు. చాలా పురాతనమైన ఈ సంప్రదాయం
ఇప్పటికీ ఆచరించబడుతోంది. రెండో భాగంలో, వధూవరులు చేతులు పట్టుకుంటారు. ఆ సమయంలో
బైబిలు భాగం పఠించబడుతుంది. తర్వాత ఒక కొత్త కుటుంబానికి పెద్దదిక్కుగా వారి తలపై
కిరీటాన్ని ధరిస్తారు. అతని భార్యకు మొదటి బహుమతిగా మిన్నుఅని పిలిచే ఒక బంగారు బిళ్లతో కూడిన మెడహారాన్ని ఇస్తాడు. దీనిని
వధువు మెడ చట్టూ వరుడు కడుతాడు. ఆమె కూడా మంత్రకోడి అని పిలిచే ఒక
చీరను బహుకరిస్తుంది.
చర్చిలో కార్యక్రమం ముగిసిన తర్వాత
రిసెప్షన్ ఉంటుంది. తర్వాత కచకొడుప్పు అనే మరో కార్యక్రమం ఉంటుంది. వరుడి ఇంటి వద్ద, ముఖ్యమైన బంధువుల
సమక్షంలో, వరుడు అతని అత్తకు కచా (చీర)ను ప్రదానం చేస్తాడు. అప్పటి నుంచి వారు
ఒకరినొకరు తల్లికొడుకుళ్లా పిలుచుకుంటారు.
మిత్రుల సమావేశంలో జరిగే ఒక క్వాకర్ వివాహ కార్యక్రమం అనేది ఏదైనా
ఇతర ఆరాధన కోసం గుమిగూడటంతో సారూప్యతను కలిగి ఉంటుంది. అందువల్ల మిత్రులు కాని
వారు తరచూ చాలా భిన్నమైన అనుభూతిని కోరుకుంటారు.
హిందూ కార్యక్రమాలు సాధారణంగా
సంపూర్ణంగా లేదా కనీసం పాక్షికంగానైనా సంస్కృతంలో జరిపించబడతాయి. ఇది హిందూ పవిత్రగ్రంథాల భాష. వివాహ మహోత్సవాలు పలు
రోజుల (భారతీయ సంప్రదాయాల పై
గత ఉప విభాగాన్ని చూడండి) పాటు జరుగుతాయి. ప్రాంతం, నామవర్గీకరణ మరియు కులంను
బట్టి అవి చాలావరకు భిన్నంగా ఉంటాయి. పెళ్లిరోజున, వధూవరులు అతిథుల ఎదుట దండలు
మార్చుకుంటారు. ఈ లఘు కార్యక్రమానికి మాత్రమే పలువురు అతిథులు హాజరవుతారు. ఈ
సందర్భంగా అందరితో కలివిడిగా వ్యవహరించడం, భోజనాలు చేసుకుని, వెళ్లిపోతారు. మతపరమైన
(ఆచరణలో ఉంటే) కార్యం కొన్ని గంటల తర్వాత జరుగుతుంది. దీనికి సన్నిహితులు మరియు
బంధువులు వస్తారు. ఒక మతపరమైన కార్యక్రమానికి ఒక బ్రాహ్మణుడు (హిందూ పురోహితుడు) ఒక
పవిత్రమైన యజ్ఞం (అగ్ని-నైవేథ్యం)ను ఏర్పాటు
చేసిన సందర్భాల్లో, పవిత్ర నిప్పు (అగ్ని) వివాహానికి ప్రధాన ఆధారం (సాక్షి )గా భావించబడుతుంది. వధూవరులు
అగ్ని ముందు కూర్చొని ఉండగా, అతను వేదాల్లోని మంత్రాలు మరియు అనుబంధ అంశాలను
పఠిస్తాడు. అతి ముఖ్యమైన ఘట్టం సప్తపది లేదా సాత్ పీర్ . ఇందులో వధూవరులు ఒకరి చేయి మరొకరు పట్టుకుని, అగ్ని చుట్టూ
ఏడుసార్లు చుడుతారు. ప్రతి చుట్టు ఒక వివాహ ప్రమాణాన్ని తెలుపుతుంది. భారతదేశ
హిందూ వివాహ చట్టం 1955 ఇది తప్పనిసరని మరియు ఒక హిందూ వివాహం పూర్తవడానికి ఇది
సరిపోతుందని భావించింది.[35] తర్వాత వధువు నుదుటిపై వరుడు వెర్మిలియన్ (సింధూరం ) దిద్దుతాడు. తర్వాత ఒక బంగారు
మెడహారాన్ని (మంగళసూత్రం ) ఆమె మెడలో కడుతాడు. ఇతర అనేక సంప్రదాయాలు ఇప్పటివరకు
తెలిపిన కార్యక్రమాలను అనుసరిస్తాయి. తర్వాత వరుడి కుటుంబంలో అడుగుపెట్టడానికి
వధువు ఆమె రక్త సంబంధీకులను వీడుతుంది.
"ఒకవేళ నేను నిన్ను
మరిస్తే, ఓ జెరూసలేం, నా కుడిచేయి దాని నైపుణ్యాన్ని మరిచిపోవచ్చు.
నా నాలుక నా నోటి పై భాగాన
వేలాడవచ్చు.
నేను గనుక నిన్ను
గుర్తించుకోకుంటే,
నేను విపరీతమైన ఆనందంలో
ఉన్నప్పుడు జెరూసలేంను గనుక గుర్తించకుంటే."
పలు ఆచరణాత్మక కమ్యూనిటీల్లో, జంట మరో ఏడు
రోజుల పాటు ఉత్సవాన్ని జరుపుకుంటారు. దీనిని షెవా బ్రాచోట్ (ఏడు
ఆశీర్వాదాలు) అని అంటారు. ఈ సమయంలో ప్రతి అతిపెద్ద సమూహం వద్ద ఏడు వివాహ
ఆశీర్వాదాలు పొందడం జరుగుతుంది.
మార్మాన్లుగా కూడా సుపరిచితులైన లేటర్ డే
సెయింట్స్ యొక్క జీసస్ క్రిస్ట్ చర్చి సభ్యులు పలు ప్రదేశాలకు మరియు నేపథ్యాలకు
చెందినవారు. అందువల్ల వారి సొంత సంస్కృతులకు చెందిన సంప్రదాయ పద్ధతుల్లోనే
కార్యక్రమాలు జరుపుకునేందుకు మక్కువ చూపుతారు. అయితే వారు LDS దేవాలయాలలో పెళ్లి చేసుకుంటారు. దేవాలయాల్లో జరిగే పెళ్లిళ్లు
శాశ్వతమైనవిగా భావిస్తారు. LDS
చర్చి కూడా ప్రభుత్వ
పెళ్లిళ్లను స్థానిక చట్టం కింద చట్టపరంగా ఒప్పందం కుదుర్చుకున్నవని
గుర్తిస్తుంది. భాగస్వాముల మరణం ద్వారా ఇది రద్దు చేయబడుతుంది. పెళ్లిళ్లను
దేవాలయంలోని పైకప్పు గదులలో అధికారులుగా పిలవబడే పౌరోహిత్య అధికారం ఉన్న వారు
నిర్వహిస్తారు. సాధారణంగా దేవాలయానికి వెళ్లడానికి సభ్యులు వారి పురోహిత సంబంధ
గురువుల నుంచి తప్పక సిఫారసులు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పరస్పరం వివాహం
చేసుకోవడానికి ప్రత్యేక సిఫారసు కోసం ఒక ఇంటర్వూ కూడా ఇవ్వాలి. సీలింగ్
కార్యక్రమానికి హాజరవ్వాలనుకున్న వారు తప్పకుండా LDS చర్చి
సభ్యులై ఉండాలి. వీరికి దేవాలయ సిఫారసు ఉంటుంది. మిగిలిన వారు దేవాలయం లోపల లేదా
దేవాలయ మైదానాల్లో ఉండే విడిది ప్రాంతంలోకి ఆహ్వానించబడతారు. ఈ సీలింగు
కార్యక్రమాలు చాలా పవిత్రమైనవి. సాధారణంగా వీటికి ముఖ్యమైన కుటుంబసభ్యులు మరియు
సన్నిహితులు మాత్రమే హాజరవుతారు. దేవాలయం వెలుపల పెళ్లి ఫోటోలు తీసుకోవడం మరియు
వేడుకకు వారికి నచ్చిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవడం పెద్ద కుటుంబం మరియు
మిత్రులకు సాధారణం. సీలింగు తర్వాత నిర్వహించే రిసెప్షన్లు మరియు భారీ వేడుకలు
భిన్నంగా ఉంటాయి. అమెరికా సంయుక్తరాష్ట్రాలకు చెందిన LDS జంటలు తరచూ భారీ వివాహ విందులు ఇస్తుంటాయి.
సాధారణంగా LDS జంటలు
దేవాలయంలో పెళ్లి చేసుకోవడానికి వివాహ అనుమతులు తీసుకుంటాయి. చట్టపరంగా అవసరమైతే,
ప్రభుత్వ వివాహం మొదటి నిర్వహించబడుతుంది. తర్వాత దేవాలయంలో జంట పెళ్లి
చేసుకుంటుంది. సందర్భోచితంగా LDS సభ్యులు
దేవాలయానికి వెళ్లడానికి సిద్ధం కానప్పుడు ప్రభుత్వ వివాహాలు చేసుకుంటారు. కార్యక్రమాన్ని
ఒక ప్రార్థనాలయం లేదా ఇతర ప్రదేశంలో నిర్వహించడానికి వారు ఒక LDS గురువు లేదా ఇతర చర్చి గురువుకు విజ్ఞప్తి చేయొచ్చు. దేవాలయంలో
పెళ్లి చేసుకోవడానికి సిద్ధం కాని చర్చి సభ్యులు తప్పక LDS సంప్రదాయాలకు కట్టుబడి ఉండాలి. అలాగే మొదట పెళ్లి చేసుకున్న
తర్వాత అంటే వారు దేవాలయంలో ఒక్కటవ్వడానికి ముందు ఏడాది కాలం పాటు సన్నద్ధమవ్వాలి.
మతమార్పిడి చేసుకున్న వారు కూడా ఒక్కటవ్వడానికి ఏడాది పాటు సిద్ధమవ్వాలి. ఒకవేళ
జంటకు ముందుగానే పిల్లలు ఉంటే, వారు వారి తల్లిదండ్రులతో కలిసి అంటే
కుటుంబసభ్యులంతా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అయితే ముందుగానే ఒక్కటైన
తల్లిదండ్రులకు ఒప్పందం ప్రకారం పుట్టిన పిల్లలకు అలాంటి కార్యక్రమం అవసరం లేదు.
దిగువ వివిధ రకాల మరియు తరహాల పెళ్లిళ్లు పేర్కొనబడ్డాయి. ఒక వివాహం
ఈ అంశాల్లో పలు వాటిని కలిగి ఉండొచ్చు.
ప్రభుత్వ వివాహం అనేది ఎన్నికైన లేదా నియమితుడైన న్యాయమూర్తి, మెజిస్ట్రేట్ లేదా
ఒక ప్రాంతం మేయరు వంటి ఒక స్థానిక ప్రభుత్వ అధికారి అధ్యక్షతన జరిగే కార్యక్రమం. ప్రభుత్వ
వివాహ కార్యక్రమాలు దేవుడు లేదా ఒక దేవత (UK చట్టంలో) ఆదేశాలను
ఉపయోగించుకోవచ్చు. అయితే సాధారణంగా ఒక ప్రత్యేక మతం లేదా నామవర్గీకరణను సూచించవు.
ఈ పెళ్లిళ్లు ఆడంబరంగా లేదా నిరాడంబరంగా ఉండొచ్చు. పలు ప్రభుత్వ వివాహ
కార్యక్రమాలు స్థానిక పట్టణం లేదా పట్టణ హాళ్లు లేదా ప్రభుత్వ భవనాల్లో జరుగుతాయి.
లేచిపోవడం అనేది పారిపోయి పెళ్లి చేసుకోవడం. తరచూ అనుకోకుండా,
వివాహానికి అతిథులను ఆహ్వానించకుండా ఇది జరుగుతుంది. కొన్నిసార్లు కుటుంబం
మరియు/లేదా మిత్రుల స్వల్ప సంఖ్యలో హాజరవుతారు. అదే విధంగా మరికొందరు
తల్లిదండ్రులు లేదా ఇతరుల అనుమతి మరియు/లేదా వారికి తెలియకుండా పెళ్లి
చేసుకుంటారు. లేచిపోవడానికి ముందు సదరు జంట ఒక్కటయ్యారా లేదా అన్న విషయం
విస్తృతంగా తెలియచ్చు లేదా తెలియకపోవచ్చు. వివాహం కూడా సాధారణంగా దాని గురించి
తర్వాత చెప్పినప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది.
స్వలింగ లేదా స్వలింగ వివాహం అనేది ఒక కార్యక్రమం. ఇందులో స్వలింగ వ్యక్తులు పెళ్లి
చేసుకుంటారు. ఈ కార్యక్రమం ఒక పెళ్లిగా లేదా ప్రభుత్వ పెళ్లి వంటి మరో చట్టపరమైన
గుర్తింపు కలిగిన భాగస్వామ్యంగా చట్టపరంగా నమోదవుతుంది. ఇలాంటి భాగస్వామ్యాలు
చట్టపరంగా గుర్తించబడవు. వివాహం మతపరమైనది లేదా ప్రతీకాత్మక కార్యక్రమంగా ఉంటుంది.
ఇతర ఏదైనా వివాహం అందించే విధంగా ఒకే విధమైన బహిరంగ ప్రకటనలు చేయడానికి మరియు
మిత్రులు మరియు కుటుంబంతో కలిసి సంబరాలు చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించే విధంగా
ఇది రూపొందించబడుతుంది. వీటిని తరచూ "అంకితభావ కార్యక్రమాలు"గా
పేర్కొనబడుతాయి.
స్వలింగ వివాహాలకు వచ్చే
అధికారులు మతపరమైన వారై ఉంటారు. పలు మతాలు మరియు క్వాకర్లు, యూనిటేరియన్లు, నైతిక
సంస్కృతి, సంస్కరణ మరియు పునర్నిర్మాణ యూదులు, ఎపిస్కోపాల్ చర్చి[ఆధారం కోరబడింది], మెట్రోపాలిటన్ కమ్యూనిటీ చర్చి
మరియు రిఫార్మ్డ్ కేథలిక్ చర్చి వంటి మతాల విభాగాలు స్వలింగకుల భౌగోళిక
ప్రాంతానికి చెందిన ప్రభుత్వం చేయకపోయినా, స్వలింగ వివాహాలు జరిపించడం మరియు
గుర్తించడం చేస్తున్నాయి.
లేచిపోయి చేసుకునే వివాహంతో
అయోమయం చెందకుండా, ఒక లక్ష్య వివాహం అనేది ఒక పెళ్లిగా చెప్పబడుతుంది. తరచూ ఒక విశ్రాంతి తరహా
సెట్టింగులో ఇది జరుపబడుతుంది. అక్కడ వచ్చిన అతిథుల్లో అధికులు ప్రయాణించడం మరియు
తరచూ కొద్ది రోజుల పాటు సేదతీరడం వంటివి చేయొచ్చు. ఇది ఉష్ణమండల ప్రదేశంలోని ఒక
బీచ్ కార్యక్రమంగా లేదా ఒక మెట్రోపాలిటన్ రిసార్టులో అమిత వ్యయ కార్యక్రమంగా లేదా
భౌగోళికంగా దూరపు మిత్రుడు లేదా బంధువు ఇంటి వద్ద జరిగే ఒక నిరాడంబర కార్యక్రమంగా
ఉంటుంది. 2009 ఆర్థిక మాంద్యం సమయంలో, లక్ష్య వివాహాలు వాటికయ్యే తక్కువ ఖర్చుల
కారణంగా సంప్రదాయక పెళ్లిళ్ల కంటే ఎక్కువగా జరిగాయి.[41]
శ్వేత వివాహం అనేది సంప్రదాయక లాంఛనప్రాయ
లేదా మధ్య-సంప్రదాయక పాశ్చాత్య వివాహానికి వాడే ఒక పదం. ఈ పదం వివాహ దుస్తుల
రంగులు తెలుపుతుంది. యువరాజు అల్బర్ట్తో పెళ్లి సందర్భంగా విక్టోరియా మహారాణి ఒక
స్వచ్ఛమైన తెలుపు రంగు గౌనును ధరించినప్పటి నుంచి ఈ వస్త్రధారణ బాగా ప్రాచుర్యం
పొందింది. తర్వాత పలువురు ఆమెను అనుసరించి, అదే రంగు వస్త్రాలు ధరించారు. ఆ
సమయంలో తెలుపు రంగు దుబారాకు మరియు లైంగిక పవిత్రతను తెలుపుతుందని పలువురు
భావించారు. తర్వాత అది రాజవంశాల యువతులు ధరించే రంగుగా అవతరించింది.[1] తెలుపు రంగు నేడు ఆదే విధమైన అభిప్రాయాలను సూచించనప్పటికీ, పశ్చిమంలో
ఈ రంగు మొదటి సారి వధువులవుతున్న వారికి అతి ముఖ్యమైన ఎంపికగా మారింది.
వారాంతపు వివాహం అనేది ఒక పెళ్లిగా చెప్పబడుతుంది. ఇందులో జంటలు మరియు వారి
అతిథులు పూర్తి వారాంతాన్ని ఆనందంగా గడుపుతారు. స్పా చికిత్సలు మరియు గోల్ఫ్
టోర్నమెంట్లు వంటి ప్రత్యేక కార్యకలాపాలు నిర్వహించబడతాయి. వీటిని వివాహ ప్రయాణ
షెడ్యూలులో పొందుపరుస్తారు. వివాహం జరిగే ప్రదేశంలోనే అతిథులకు బస ఏర్పాట్లు
చేయబడుతాయి. అలాగే వారాంతపు ముగింపును పురస్కరించుకుని జంటలు ఒక సండే విందును
ఏర్పాటు చేస్తాయి.
సైనిక వివాహం అనేది సైనిక ప్రార్థనాలయంలో నిర్వహించే ఒక కార్యక్రమం. తరచూ
సాబీర్ ఆర్చ్ అనే వివాహ సంప్రదాయం కూడా అనుసరించబడుతుంది. అనేక సైనిక వివాహాల్లో
వరుడు, వధువు లేదా ఇద్దరూ (వారిలో సాయుధ సేవల సభ్యులను బట్టి) సైనిక దుస్తుల
యూనిఫారాలు ఎక్కువగా ఇదే కార్యం కోసం అందిస్తున్నప్పటికీ, సాధారణ సంప్రదాయక
దుస్తులకు బదులుగా సైనిక దుస్తుల యూనిఫారం ధరించాలి. ఉద్యోగానంతరం పెళ్లి
చేసుకునే కొందరు విశ్రాంత సైనిక అధికారులు సైనిక వివాహానికి స్వస్తి చెప్పవచ్చు.
జంట వివాహం అనేది ఒకే కార్యక్రమం. ఇందులో
నిశ్చితార్థమైన రెండు జంటలు రెండు ఏకకాలిక లేదా క్రమానుగత వివాహాలు చేసుకుంటాయి. సాధారణంగా
ఒక వరుడు నిశ్చితార్థం చేసుకున్న ఒక తోబుట్టువుతో కలిసి జంట వివాహానికి
ఆలోచించవచ్చు. ఇక్కడ రెండు జంటలు చట్టబద్ధంగా పెళ్లిళ్లు చేసుకుంటాయి.
|
|
|
|
|

కామెంట్లు